నా నియోజకవర్గంలో ఆరుబయటే చదువులు..

నా నియోజకవర్గంలో ఆరుబయటే చదువులు..


న్యూఢిల్లీ: తన నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో స్కూళ్లు బహిరంగ ప్రదేశాల్లోనే నడుస్తున్నాయని బీజేపీ ఎంపీ హేమమాలిని చెప్పారు. లోక్‌సభలో ఈ విషయమై హేమమాలిని మాట్లాడుతూ..మధుర లోక్ సభ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో తరగతులు ఎక్కువ ఆరుబయటే నడుస్తున్నాయి. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో స్కూళ్లు నడిపిస్తే బాగుంటుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.