తాజ్‌మ‌హ‌ల్ సంద‌ర్శించ‌నున్న ట్రంప్‌

 అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.  ఈనెల 24వ తేదీన ఆయ‌న తాజ్‌మ‌హ‌ల్ వెళ్ల‌నున్నారు.  ఆగ్రాలో అగ్ర‌రాజ్యాధినేత ప‌ర్య‌టిస్తార‌ని ఆ సిటీ మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్ తెలిపారు.  ఖేరియా విమానాశ్ర‌యం నుంచి తాజ్‌మ‌హ‌ల్ రూట్లో క్లీనింగ్ ప్రోగ్రామ్ నిర్వ‌హిస్తున్నారు. తాజ్ ప‌రిస‌ర ప్రాంతాల‌ను కూడా సుంద‌రంగా తీర్చిదిద్దుతున్నారు.