ప్రస్తుతం మార్కెట్లో నిలకడగానే ధరలు ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో అటు రైతులు, ఇటు వ్యాపారులు శీతలగిడ్డంగుల వైపు చూస్తున్నారు. అందులో భాగంగానే ఖమ్మం నగరంలోని కోల్డ్ స్టోరేజీల వద్ద మిర్చి బస్తాలతో వాహనాలు బారులు తీరుతున్నాయి. ఖమ్మం మార్కెట్ పరిసర ప్రాంతాలతో పాటు నగర శివారులో కలిపి 17 కోల్డ్స్టోరేజీలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం ఖమ్మం రూరల్ మండలంలో మరో శీతలగిడ్డంగి ప్రారంభమైంది. సీజన్ ఆరంభంలో ఒక్కసారిగా మార్కెట్లో ఎర్రబంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. ఏకంగా క్వింటాకు రూ.22వేల వరకు గరిష్ట ధర పలికింది. ఎగుమతిదారుల నుంచి భారీగా ఇండెంట్ ఉండటంతో స్థానిక కొనుగోలుదారులు పోటీపడి మిర్చి కొనుగోళ్లు చేపట్టారు. దీంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సరాసరి నలభైవేల బస్తాలు వచ్చాయి. అయితే వారం రోజులు గడవకముందే క్రమక్రమంగా ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో స్థానిక వ్యాపారులతోపాటు, ఇతర రాష్టాల వ్యాపారులు, ఖమ్మం నగరం సమీపంలోని చైనా కంపెనీ ప్రతినిధులు మాత్రమే పంటను కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం జిల్లాలో సుమారు 60 వేల ఎకరాల్లో మిర్చి...