Skip to main content

Posts

Showing posts from April, 2020

శ్రీ శ్రీ చిరస్మరణీయులు

"అగాధమగు జలనిధిలోనా ఆణిముత్యమున్నటుల శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే" "చీకటిలో కారు చీకటిలో కాలమనే కడలిలో  లోకమనే పడవలో ఏ దరికో.. ఏ దెసకో... జాలరి వలలో చేపవు నీవే...! గానుగ మరలో చేపవు నీవే...! జాలే లేని లోకంలోనా... దారే లేని మనిషివి నీవే" "కలిమి నిలువదు - లేమి మిగలదు కలకాలం ఒకరీతి గడవదూ... నవ్విన కళ్లే చెమ్మగిల్లవా! వాడిన బతుకే పచ్చగిల్లదా! ఇంతేరా జీవితం - తిరిగే రంగుల రాట్నామూ....!" "ఉందిలే మంచికాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందనా...! అందరికోసం ఒక్కడు నిలిచి ఒక్కని కోసం అందరు కలసి సహకారమే మన వైఖరి అయితే... ఉపకారమే మన ఊపిరి అయితే..." పై సాహిత్యం శ్రీశ్రీ ఆయా సందర్భాల్లో సినిమాల కోసం రాసినది.  మనదగ్గర సినిమా సాహిత్యానికి ఇప్పుడు విలువలేదు. కానీ అది ప్రజలకు బలమైన సందేశాన్ని అందించే మార్గంగా ప్రజల్లోకి ఇలాంటి వ్యక్తికరణల్ని ప్రవేశపెట్టాడు. ఉద్యమాల సంధి కాలంలో సాధారణ పౌరుడు మొదలు ప్రతి ఉపాధ్యాయుడి నోట శ్రీశ్రీ కవిత్వం అలా రాలిపడేదంటే అతని ప్రభావం ఎలా ఉండేదో మనం ఒక అంచనాకు రావొచ్చు. దాదాపు చాలా మంది కవుల మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో శ్రీశ్రీ ముద...

వలస జీవుల వెతలు..

https://www.facebook.com/yamini369/videos/3089642557750192/ https://www.facebook.com/yamini369/videos/3089642557750192/ //వలస జీవుల వెతలు// పొట్టసేతా బట్టిమేము వలసబోయాం మొతుకుకోసం మా బతుకుకోసం  వచ్చామయ్యో.  సిన్న బతుకు సిద్రమైయ్యి సితికినోల్లం మీ ఆశలసౌదాల్ గట్టేటందూకొచ్చీనోల్లం    పూట పూటా కూలిచేసి గడపేటోల్లం ఆపదోత్తే ఒకరికొకరం లేకాపోయాం అంటకుంటా ముట్టకుంటా ఉండమంటే ఉండాలనే ఉందిగానీ ఏటీసెయ్యం కంటినిండా కన్నపేగూ కదులుతోందీ గుండెనిండా అయినవాల్లు కురుత్తుంటే (గురుతొత్తుఉంటే)  ఆపేదెట్టా.. ఆగేదెట్టా  పోనీండయ్యో  మొతుకుకోసం మా బతుకుకోసం  వచ్చామయ్యో.  కంచెలన్నీ హద్దులన్నీ దాటేదెట్టా అమ్మనానల్నీ ఆలిబిడ్డల్ని జూసేదెట్టా  రాదారి మొత్తం రహస్సంగా  దాటాలనీ అడుగు అడుగూ భారంగా నేనేత్తూబోతే  సరద్దులన్నీ నేరత్తులంటూ ఆపేత్తుంటే అంటురోగులని వల్లుమొత్తం తడిపేత్తుఉంటే ఏటిసెయ్యం ఏమిసెయ్యం ఎట్టాగయ్యో.. మొతుకుకోసం మా బతుకుకోసం  వచ్చామయ్యో పేదరికమే పెద్ద పాపమని అంటారంతా లేమితనమే పెద్ద జబ్బని తెలీద ఏమీ.. అయినవాల్లతో పండగసేసే యావాలేదు  ఉన్నసోటే ...

ఎస్ బి ఐ వడ్డీ తక్కువ రుణాలు

*ఎస్‌బీఐ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌..త‌క్కువ వ‌డ్డీకే లోన్స్!* ప్ర‌స్తుతం ఉన్న క్లిష్ట‌ప‌రిస్థితుల్లో డబ్బు అత్య‌వ‌స‌రంగా మారింది.  దీనికి తోడు రుణాలిచ్చే కొన్నిసంస్థ‌లూ తాత్కాలికంగా రుణాల మంజూరు నిలిపివేశాయి. అందులోనూ క‌రోనా మహ‌మ్మారి తెచ్చిన తిప్ప‌ల‌తో సంస్థ‌లు కూడా ఉద్యోగుల‌ వేత‌నాల్లో కోత‌లు విధిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ బ్యాంకింగ్ దిగ్గ‌జం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఊర‌ట‌నిచ్చే వార్త చెప్పింది. త‌మ వినియోగ‌దారుల‌కు స‌త్వ‌రం లోన్ మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు చెప్పింది. బ్యాంకుల‌కు వెళ్లే ప‌నిలేకుండా ఇంట్లో కూర్చుని లోన్ పొందే స‌దుపాయం ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ అత్య‌వ‌స‌ర లోన్‌లు ప్రీ అప్రూవ్‌డ్ ప‌ర్స‌న‌ల్ లోన్స్ (పీఏపీఎల్‌) లోన్‌లుగా పేర్కొంది. త‌క్కువ వ‌డ్డీకే అంటే 7.25 శాతం వ‌డ్డీకే కేవ‌లం 45 నిమిషాల్లో లోన్ పొంద‌వ‌చ్చ‌ని తెలుపుతూ ఇటీవ‌లే ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అంతేకాదు లోన్ వాయిదాలు వెంట‌నే ప్రారంభంకావు. ఆరు నెల‌ల త‌ర్వాత నుంచి క‌ట్టాల్సి ఉంటుంది. ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి... ఎస్‌బీఐ సీనియ‌ర్  ఉద్యోగి రాజేంద్ర అవ‌స్...

మంత్రివర్గం సమావేశం ..

*అమరావతి:* *29-04-2020* *రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒపి సేవలను యధావిధిగా కొనసాగించాలి* *ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను రాష్ట్రానికి తెచ్చేందుకు చర్యలు* *జిల్లాల్లో చిక్కుకున్న వారిని స్వంత జిల్లాలకు చేర్చేందుకు కృషి*  *మంత్రుల బృందం స్పష్టీకరణ* కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న మన రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, విద్యార్థులు తదితరులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కరోనా పై ఏర్పాటు చేయబడిన మంత్రులు బృందం స్పష్టం చేసింది.ఈ మేరకు అమరావతి సచివాలయం మొదటి భవనం సియం సమావేశ మందిరంలో బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) అధ్యక్షతన మంత్రుల బృందం(GOM) సమావేశం జరిగింది.ఈ సమావేశంలో కరోనా నేపధ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు తీరును మంత్రుల బృందం సమీక్షించింది.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తదితర మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడా ఓపి సేవలు అందించడం లేదని సమావేశం దృష్టికి తేగా ఎట్టి ...

లాక్డౌన్ సడలింపుకు గైడ్ లైన్స్

*కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్ డౌన్ సడలింపు కు అదనపు గైడ్ లైన్స్ విడుదల చేసిన ఏపి సర్కార్..* ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచనల మేరకు కొత్త గైడ్ లైన్స్ వ్యవసాయ రంగం, హార్టికల్చర్ పనులకు మినాహాయింపు  ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ కు మినహాయింపు  ఆర్థిక రంగానికి మినహాయింపు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనుల తో పాటు పవర్ లైన్స్, టెలికం కేబుల్స్ పనులకు అనుమతి  కావల్సిన అనుమతులతో ఈ కామర్స్ కంపెనీలకు, వారు వాడే వాహనాలకు పెర్మిషన్  వలస కార్మికులకు రాష్ట్రం పరిధిలో వారి సొంత ప్రాంతాలకు వెళ్లి పని చేసుకునేందుకు అనుమతి  కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే మీనాహాయింపు  వలస కార్మికులు లాక్ డౌన్ సమయంలో ఏ రాష్ట్రం లో ఉంటే అదే రాష్ట్రం లో మాత్రమే  పనులకు అనుమతి  బుక్స్ షాపు లకు అనుమతి  ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ షాపులకు మినహాయింపు ఓడల కు ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏర్పాటు  మాల్స్ తప్ప గ్రామీణ ప్రాంతంలో ఉంటే షాపులు, మార్కెట్ కాంప్లెక్స్ లకు అనుమతి

నివాళి

ఇలా ఆట సగంలో వెళ్ళిపోతే సగం బొమ్మే గీస్తాను నీకు..నీ మొహానికి ఇంక రంగుల్లేవ్ గింగుల్లేవ్..వెళ్లి పని చూసుకో బ్రదర్.. పొద్దున్నుంచీ చాలా కోపంగా ఉన్నాను నేను..        - రచయిత, చిత్రకారుడు, లక్ష్మీ భూపాల

భూలోక అద్భుతం శ్రీదేవి - వర్ధన్ రాజ్

ఇర్ఫాన్ ఖాన్ కు నివాళి

ఎలా నవ్వుతున్నాడో చూడండి ఆ నవ్వు మృత్యువును పరిహసిస్తున్నట్టు లేదూ! వెక్కిరించినట్టుగా లేదూ! సోకాల్డ్ మనుషుల ఆబతనాల్ని ఎగతాళి చేసినట్టుగా లేదూ! చివరగా రాసిన ఉత్తరంలో జీవితమేమిటో ఎంత వివరంగా చెప్పాడూ! ఇంకా ప్రయాణించాలని అతను  గట్టిగానే అనుకున్నాడు కానీ  అతనికే తెలియని అతని మృత్యువు వెంట తీసుకెళ్లడానికే నిర్ణయించుకుంది. ఇలానే పోతాం మనం కూడా మనకే తెలియకుండా రేపటిని వదిలేసి ఎవరూ భుజమ్మీద చెయ్యేసి వెంటరారు ఒక్కళ్ళమే వెళ్ళాలి ఇర్ఫాన్ ఖాన్ లానే వెళ్లిపోవాలి అల్విదా అనుకుంటూ... 

రాకాసి రాకాసి షార్ట్ ఫిల్మ్స్

https://youtu.be/HYnGyUPxJVs రాకాసి రాకాసి ఓ కాలేజ్ లో జరిగే కథ. లక్ష్యమే జీవితంగా భావించే అబ్బాయికి ఓ రాకాసి లాంటి అమ్మాయికి మధ్య ఏం జరిగింది. వారి పరిచయం దేనికి దారి తీసింది. అబ్బాయి అతని లక్ష్యాన్ని సాధించడా అమ్మాయి అతని లక్ష్యానికి అడ్డుగా మారిందా లేదా దోహద పడిందా? తెలుసుకోవాలంటే చూసేయండి. రచన - ఎడిటింగ్ - దర్శకత్వం చంద్రకాంత్ . టి DOP లోహిత్ తోట ప్రొడ్యూసర్  దేవ ప్రకాష్. G Suleman Sheik Chandu Sai Bharath Cast చందు సాయి భరత్ శ్రీ దేవి రెడ్డి వెంకటేష్ రజనీ ప్రసన్న భల్ల

ఉగ్గపట్టి

ఉగ్గపట్టి... చాలాసార్లు చిన్నపిల్లనైపోవాలనుకుంటా ముక్కు చీది కళ్ళునలుపుకుంటూ ఏడ్చేద్దామని నా గుండె బొమ్మపై రంగుగీతలు గీశారని నా బ్రతుకు చిత్రాన్ని బొగ్గుతో మరకేసారని చాడీలు చెప్పేందుకు అద్దాన్ని అమ్మను చేస్తా కళ్ళ అలమరాలో   ఇస్త్రీ చేసి  జ్ఞాపకాలతో మడిచి  దాచిపెట్టుకున్న  కొన్ని కన్నీటి బొట్లని నుసిచేసి బుగ్గలు కందేలా పూసుకోవాలనుకుంటా గాజుల చేతికి నిలువునా చీరుకున్న నిన్నమొన్నటి ఉద్వేగాయాలు కొత్తపట్టీలకు ఒరుసుకున్న  కాలి అడుగుల శబ్దాలు ఇంకా ఇంకా ఎన్నో చెప్పేందుకు మాటలే కాదు భావాలు లేవు ఎందుకంటే నేను చిన్నపిల్లనవ్వాలనుకుంటున్నా ఎంతగా అంటే  మరోసారి  నాలోకి ఏ పెద్దరికం అడ్డొచ్చి నా ఉగ్గబట్టే క్షణాలను చిదిమేయనంత.... సుభాషిణి తోట

ప్రతి భారతీయుడు సైనికుడే.. ప్రధాని నరేంద్రమోడీ

*"కంటికి కనిపించని శత్రువుతో అలుపెరగని యుద్ధం చేస్తున్న ప్రతీ భారతీయుడు ఒక సైనికుడే"- మన్ కి బాత్ లో ప్రధాని  నరేంద్రమోదీ.*  ప్రధానమంత్రి నేడు 64 వ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 🔸మనం చేస్తున్న యుద్ధాన్ని ప్రపంచమంతా గమనిస్తోందన్నారు. భారత ప్రజల స్ఫూర్తి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. 🔸కరోనా సృష్టించిన విలయాన్ని అధిగమించేందుకు అన్ని వర్గాలూ కొత్త మార్గాల గురించి అన్వేషిస్తున్నాయని చెప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా దేశంలోని ప్రతి ఒక్కళ్లూ లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారని తెలిపారు. 🔸మన్ కీబాత్ కార్యక్రమంలో ప్రజలతో తన మనోభావాలను పంచుకున్నారు. విపత్తు సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని మోదీ గారు అన్నారు. 🔸లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. 🔸 ప్రజల సహకారం లేనిదే కరోనాను ఎదుర్కోవడంలో ఎవరూ విజయం సాధించలేరని అన్నారు.  🔸కరోనా మహమ్మారి కట్టడికి భారతీయులంతా కలిసి చేస్తున్న ఈ పోరాటాన్ని భావి తరాల ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారని మోదీ వ్యాఖ్యానించారు. 🔸ప్రపంచ దేశాలన్నీ కరోనా మ...

సున్నా వడ్డీ రుణాలు

మహిళామణులకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు * గౌరవ ముఖ్యమంత్రి * వై.యస్.జగన్ మోహన్ రెడ్డి * 8.78 లక్షల గ్రూపులకు 1400 కోట్ల * రూపాయల * వై.యస్.ఆర్ * *సున్నా వడ్డీ * నిథులు విడుదల చేయటమైనది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో శనివారం హోంశాఖ మంత్రి వర్యులు మేకతోటి సుచరిత ప్రత్తిపాడులో ప్రారంభిస్తున్నారు. దీనిలో భాగంగా * గుంటూరు * రూరల్ మండలంలో * 906 గ్రూపులకు 50.27 లక్షలు * * కాకుమాను * మండలంలో * 898 గ్రూపులకు 73.54 లక్షలు * * పెదనందిపాడు * మండలంలో * 660 గ్రూపులకు 43.22 లక్షలు * * ప్రత్తిపాడు * మండలంలో * 1064 గ్రూపులకు 84.93 లక్షలు * * వట్టిచెరుకూరు * మండలంలో * 1023 గ్రూపులకు 83.47 లక్షలు * నియోజకవర్గంలో* * 4551 గ్రూపులకు 335.43 లక్షలు * లబ్ది చేకూరుతుంది. ఈ సందర్బంగా మహిళలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నారు.

సీఎం సహాయనిధి కి చెక్కులు అందజేత

కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి గుంటూరు డీసీసీబీ(జిల్లా సహకార కేంద్ర బ్యాంకు) తరపున కోటి రూపాయలు విరాళం.  విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం  వైయస్ జగన్‌కు అంద‌జేస్తున్న‌ డీసీసీబీ ఛైర్మన్  ఆర్‌ సీతారామాంజనేయులు, డీసీసీబీ డైరెక్టర్‌ ఎన్‌ వి వి యస్‌ వరప్రసాద్, పాల్గొన్న హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ. ముఖ్యమంత్రి సహాయనిధికి  గుంటూరు జిల్లా కోపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌) తరపున రూ.25 లక్షలు విరాళం. విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం  వైయస్ జగన్‌కు అందజేస్తున్న డీసీఎంఎస్‌ ఛైర్‌ పర్సన్‌ కె హెనీ క్రిస్టినా, కె సురేష్‌ కుమార్, పాల్గొన్న హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ.

ఆంధ్రా ప్యారీస్ లో ఆలోజింపచేస్తున్న భారీ పెయింటింగ్

ముస్లిం సోదరులు శుభాకాంక్షలు తెలిపిన హోమ్ మంత్రి సుచరిత

పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షల ఆరంభం సందర్భంగా  ముస్లిం సోదరులకు, సోదరిమణులకు హోంమంత్రి సుచరిత శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్ధనల సమయంలో, సామాజిక దూరాన్ని పాటించాలని ఆమె సూచించారు.

రేషన్ పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు రానివాళ్లను దృష్టిలో పెట్టుకుని రెండో విడతగా అప్లై చేసుకున్న వాళ్లకు శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో తెనాలి పట్టణ పరిధిలోని 765 మంది అర్హులకు కార్డులను జారీచేసారు. కార్డ్ హోల్డర్ లకు శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ రేషన్ అందజేశారు. 

సీఎం జగన్ కు చెక్కును అందజేస్తున్న హోంమంత్రి సుచరిత

కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలు, వివిధ సంస్ధల తరపున 36 లక్షల 50 వేల రూపాయలు విరాళం. విరాళానికి సంబంధించిన చెక్కులను సీఎం  వైయస్ జగన్‌కు అందజేస్తున్న హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత.

జేసుదాసు జీవిత విశేషాలు

కె. జె. ఏసుదాసు భారతీయ శాస్త్రీయ సంగీత కళాకారుడు, భారతీయ సినిమా నేపథ్య గాయకుడు. అతను భారతీయ శాస్త్రీయ, భక్తి, సినిమా పాటలు పాడాడు. అతను తన ఐదు దశాబ్దాల కళా జీవితంలో వివిధ భారతీయ భాషలైన మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషలతో పాటు అరబిక్, ఆంగ్లం, లాటిన్, రష్యన్ భాషలలో సుమారు 80వేల పాటలను పాడాడు. • జననం కట్టస్సేరి జోసెఫ్ జేసుదాస్ • 1940 జనవరి 10 (వయస్సు: 80  సంవత్సరాలు), ఫోర్ట్ కొచ్చి, కేరళ • తల్లిదండ్రులు  అగస్టీన్ జోసెఫ్ (తండ్రి), ఆలిస్ కుట్టి (తల్లి) • వృత్తి గాయకుడు • క్రియాశీలక సంవత్సరాలు 1955-ప్రస్తుతం • ప్రసిద్ధులు భారతీయ శాస్త్రీయ సంగీతము , నేపథ్యగాయకుడు • స్వస్థలం కొచ్చిన్, కేరళ, భారతదేశం • జీవిత భాగస్వామి ప్రభ • సంతానం: ముగ్గురు కుమారులు. వారు వినోద్, విజయ్, విశాల్. జీవితం కే .జె. యేసుదాసు 1940 జనవరి 10న కేరళ లోని కొచ్చిలో ఓ క్యాథలిక్ కుటుంబానికి చెందిన అగస్టీన్ జోసెఫ్, ఎలిజిబెత్ జోసెఫ్ దంపతులకు జన్మించాడు. అతని తండ్రి మలయాళ శాస్త్రీయ సంగీత గాయకుడు, రంగస్థన నటుడు. అతనికి నటునిగా, భాగవతార్ గా ఆయనకు మంచి పేరుండేది. ఆయనకు మంచి ప్రతిభ ఉన్నా ఆర్థికంగా మాత...

అన్ని పథకాల్లోనూ మహిళలకు ప్రాధాన్యత: హోంమంత్రి

*అన్ని పథకాల్లోనూ మహిళలకు ప్రాధాన్యత: హోంమంత్రి* *గుంటూరు:*  రాష్ట్రంలోని అక్కా, చెల్లెళ్లు బాగుండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరిక అని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాట కోసం సీఎం వైఎస్‌ జగన్‌ కట్టుబడి ఉంటారని తెలిపారు. కరోనా కష్టకాలంలో మహిళల కోసం రూ. 14 వందల కోట్లు మంజూరు చేశారని ప్రశంసించారు. మహిళలు వృథా ఖర్చులు చేయకుండా కుటుంబానికి అండగా నిలుస్తారు కాబట్టి చాలా పథకాల్లో మహిళలకే ప్రధాన్యత ఇచ్చారన్నారు. సంక్షేమ కార్యక్రమాలను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. చంద్రబాబు చేయలేని పని వైఎస్‌ జగన్‌ చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా సంతోషంగా ఉన్నారని సుచరిత అన్నారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం 'వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని' క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. నగదు బదిలీ కోసం ఆన్‌లైన్‌ ద్వారా బటన్‌ నొక్కగానే సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ఒకే విడతలో డబ్బులు జమ అయ్యాయి. దీంతో 90,37,254 మహిళలు సభ్యులుగా ఉండే ఆయ...

వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ' ప్రారంభించిన సీఎం జగన్‌

*అమరావతి:* *24-04-2020* *'వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ' ప్రారంభించిన సీఎం జగన్‌* ◆పొదుపు సంఘాలకు రూ.1400కోట్లు జమ చేసిన ప్రభుత్వం.. ఏపీలో స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ అందించే 'వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ' పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఏప్రిల్‌ 1, 2019 నుంచి మార్చి 31, 2020 వరకు బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.1400 కోట్ల వడ్డీ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో జమ చేశారు. ఈ పథకం ద్వారా 8.78 లక్షల పొదుపు సంఘాల్లో ఒకేసారి రూ.1400 కోట్ల వడ్డీని జమచేశామని.. దీంతో సుమారు 91 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పథకం ప్రారంభించిన అనంతరం వివిధ జిల్లాల స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌ మాట్లాడారు. కరోనా విపత్తు సమయంలో ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ మహిళలకు అండగా నిలబడాలనే ఈ పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం తెలిపారు. మొట్టమొదటిసారిగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పావలా వడ్డీ రుణాలు తెచ్చారని.. ఆ తర్వాత అది సున్నా వడ్డీ పథకంగా మారిందని సీఎం గుర్తు...

కోవిడ్ పరీక్షలు

కోవిడ్-19 ర్యాపిడ్ యాంటీ బాడీస్ పరీక్షలు నిర్వహణ :- జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ఆదేశాల ప్రకారం ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జెరపల నరసింహ నాయక్ గారి మౌఖిక ఆదేశాల ప్రకారం కోవిడ్ – 19 ర్యాపిడ్ యాంటీ బాడీ పరీక్షలను 92 మందికి నిర్వహించినట్లు మునిసిపల్ ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి వి రమణ గారు తెలిపారు. తెనాలి పురపాలక సంఘం సచివాలయo 4, 5 లలో రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించి, వారికి మనోధైర్యం తెలియజేసినట్లు తెలిపారు. 18 మంది వైద్య అధికారులు విధులు నిర్వహిస్తూ వైద్య పరీక్షలను చేశామని డాక్టర్ బి వి రమణ చెప్పారు. ఒక్కొక్కరికి రెండు నమూనాలు అనగా IGG, IGM పరీక్షలు నిర్వహించి వాటిలో ఏమైనా తేడా ఉంటే తదుపరి పరీక్షలకు పంపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ డి ఎస్ రమాదేవి, డాక్టర్ డి జీవన లత, డా. కె ప్రేమ చంద్, డా. జాస్తి స్వప్న, డా. పి ఆశా లత, ఆయుష్ వైద్యాధికారులు డాక్టర్ బి శ్రీనివాసరావు, డాక్టర్ యు బి భాస్కరరావు, డాక్టర్ ఎస్ బాల ప్రభావతి, డాక్టర్ అర్చన, ఆరోగ్య విస్తరణాధికారి అందె బాల చంద్రమౌళి, హెచ్ వి ప్రమీల, పి వెంకటేశ్వరమ్మ, ANM డి విజయ కుమారి తదితరులు ...

//పునరావృతం// కోడె యామిని దేవి

//పునరావృతం// నువొస్తావ్.. పలకరిస్తావ్.. కొన్ని పనూలూ చేస్తావ్ ఆ తర్వాత మాయమవుతావ్  ఫోన్లో గేములే ఆడతావో  ఫేస్ బుక్ లో స్టేటస్ లే రాస్తావో  నీ ఇష్టం నీదే కానీ..  నీ ప్రపంచం లో కాసేపు నన్ను చూడు  నా ప్రపంచంలో కాసేపలా కాలుమోపు నువొచ్చిన ఆ కాసేపూ  నా చుట్టూతా నువ్వు తిరుగుతుంటే పసిపాప(బాబు) నట్టింట మరలా పారాడినట్టే నాకు ఏదేదో చెప్పాలనుంటుంది ఏమేమో వినాలనుటుంది ఇద్దరిమద్యనా మౌనం రాజ్యమేలుతుంది  అయినా మాయదారి టెక్నాలజీ  నీకూ నాకూ మధ్యన అడ్డుపడుతూనే ఉంటుంది. నేను పిలుస్తాను - నువ్వు పలుకుతావు నేను అరుస్తాను - నువ్వు విసుక్కుంటావు నేను కేకలేస్తాను - నువ్వు బాధ పడతావు నాపై నాకే కోపమొస్తుంది - నా తప్పు తెలుస్తుంది మౌనాన్ని తొడుక్కుంటాను నువ్వలకనుకుంటావు - నేనదేంకాదంటాను అంతే అంతే అంటుంటావు - నేనదే తంతంటాను వెళ్లొస్తుంటావు  మరలా మామూలే నీ లోకి నువ్వు - నిన్ను వెతుక్కుంటూ నేను  ప్రహాసనాలెన్నో మిగిలి పోతూంటాయి  పదే పదే పునరావృతమవుతూంటాయి.

పుస్తక దినోత్సవ శుభాకాంక్షలతో..

*ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు* *"పుస్తకాల పురుగు" అనే మాటకు డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారిని చెప్పొచ్చు..అంటే అంత ఎక్కువగా ఇష్టం గా సామాజిక బాధ్యత గా పుస్తకాలు చదివే వారని అర్థం అవుతుంది.అమెరికా ,లండన్ లలో చదువుకునే రోజుల్లో రోజుకి కనీసం 18 గంటల సమయాన్ని అధ్యయనం చేయడానికే అంబేడ్కర్ గారు కేటాయించే వారు.ఆయన కీర్తి నేడు ప్రపంచ వ్యాప్తంగా కొనియాడబడుతుంది.1915లో కొలంబియా విశ్వవిద్యాలయం ఆయనకు పి.హెచ్ డి ఇచ్చింది.* *అంబేడ్కర్ గారు తన ఇంటికి రాజగృహ అని పేరు పెట్టుకున్నారు. రాజగృహ లో తన ఇంటిలోనే కొన్ని లక్షల పుస్తకాలతో ఒక గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.* *అంబేడ్కర్ గారు మొట్ట మొదటిసారిగా 1916 మే 9 న "భారత దేశంలో కులాలు వాటి పుట్టుక ,పనితీరు,అభివృద్ధి" రచించారు.ఇది కొలంబియా కాలేజీ స్టూడెంట్స్ కోసం వ్ర్రాసింది.కొలంబియా యూనివర్సిటీ ,న్యూయార్క్ ,అమెరికాలో జరిగిన ఆంత్రోపాలజీ సెమినార్ లో చేసిన ప్రసంగ పాఠం ఇది.* *డా.అంబేడ్కర్ మొత్తం 53 పుస్తకాలు రచించారు.వాటిలో కొన్ని ఇవి* *భారతదేశం లో రూపాయి సమస్య* *బుద్ధ అండ్ హిజ్ ధమ్మ*  *శూద్రులెవరు*  *హిందూ మతం లో చిక్కుముడులు* *గ...

<no title>

అగ్నిప్రమాద బాధితులకు ఎమ్మెల్యే సాయం

స్థానిక చినరావూరు లోని వాటర్ ట్యాంక్  రోడ్ లో ఇటీవల ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై ఇల్లు కాలిపోయినది. అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించి, బాధిత కుటుంబానికి ఆర్థికసాయం, నిత్యావసర సరుకులును  తెనాలి శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అందజేశారు.

భారతీయ కమ్యూనిజం గురించి బాబాసాహెబ్

❄ *భారతీయ కమ్యూనిజం గురించి బాబాసాహెబ్* ❄             సోహన్ లాల్ శాస్త్రి ( *బాబాసాహెబ్ సెక్రటరీ*) గారితో బాబాసాహెబ్ మాటలు:::  బాబాసాహెబ్  ఒకరోజు చదువుకుంటుండగా ఆయన వద్దకు వెళ్లాను,  బాబా మీతో ఒక విషయం మాట్లాడాలను కుంటున్నాను అని... *"మన భారతదేశంలో కమ్యూనిస్టులు పేదరికాన్నినిర్మూలించాలి"అనే నినాదంతో పనిచేస్తున్నారు. దేశ సంపదను జాతీయం చేసి ప్రజలందరికీ పంచాలి అంటున్నారు. మరి మనం కమ్యూనిస్టులతో కలిస్తే మనకు లాభమే కదా! ఎందుకంటే మనం తిండి లేని కడుపేదవారము. ఆ పార్టీ పేదరికాన్ని నిర్మూలించాలనే విషయంలో కంకణబద్దురాలై ఉంది అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి బాబా"* అన్నాను.  దానికి సమాధానంగా నాకు చాలా సుదీర్గమైన వివరణ ఇచ్చారు. బాబాసాహెబ్ మాట్లాడుతూ... *పేదరికాన్ని జయించడంపై నాకెలాంటి బేధాభిప్రాయాలు లేవు. భారతీయ కమ్యూనిస్తులతో మాత్రం మనకు ఎలాంటి మేలు జరగదు. అన్నిటికంటే ముందుగా తెలుసుకోవాల్సింది ఏమంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరూ బ్రాహ్మణులు లేకుంటే సవర్ణ హిందువులు. వాళ్ళు వర్ణ వ్యవస్థ గురించి మాట మాత్రంగానైనా ఆలోచించరు. ఎందు...

పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

కరోనా వైరస్ వ్యాధి వ్యాపిస్తున్ననేపథ్యంలో స్థానిక ఐతానగర్ లోని ఎర్రబడి సమీపంలో నివాసముంటున్న పేద ప్రజలకు నిత్యావసర సరుకులు ,కూరగాయలను తెనాలి శాసన సభ్యులు అన్నబత్తుని శివకుమార్ అందజేశారు. 

చిత్రాలు చూడరో...

జానకమ్మకు జన్మదిన శుభాకాంక్షలు

:: Happy Birthday to Janakamma  నరుడా ఓ నరుడా..  ఏమీ.. కోరికా!? --------------------------- ఎట్టకేలకు... మనం చేసిన తపస్పుకి మెచ్చి  ''నరుడా నరుడా ఏమి కోరికా..'' అంటూ దేవుడు  మాంచి ఆఫర్‌ ఇచ్చారనుకోండి.. ఏంటీ తపస్సు గిపస్సు.. ఛాదస్తం మాటలు అనకండీ. జస్ట్‌.. ఫర్‌ ఫన్‌ మాత్రమే అనుకోండి.. అలా ఆఫర్‌ వస్తే మాత్రం..  మనలో చాలామంది.. ''స్వామీ.. జానకమ్మ పాట ఒకటి వినిపించండీ.. మీకు పుణ్యముంటుంది'' అనిగానీ.. '' ప్రియాతి ప్రియమైన నా దేవుడా.. నాకు మణులు వద్దూ.. మాణిక్యాలు వద్దుగానీ..ఆ జానకమ్మ పాడిన పాటల సీడీలు నాలుగు ప్రసాదించండి స్వామీ.. '' అని అడుగుతామేమో..??  ఇట్టాంటి వీరాధివీర,, సంగీతాభిమానుల్ని సంపాదించుకున్నారు మన జానకమ్మ. *** జానకమ్మ పాటతో అసలు నేస్తంకట్టని మహానుభావులు ఎవరైనా ఉన్నారా? అని వెదికే సాహసం చేయడం కూడా తప్పే. ఎందుకంటే జానకమ్మ.. తెలుగు సినీగీతానికి వెన్నముద్దలు అద్దిన బంగారు తల్లికదా?!  బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమానాటి.. పంచెకట్టు సీతారామయ్యగారి నుంచి.. ఆ తర్వాత.. నెత్తిన చంద్రవంక కొప్పులు పెట్టుకున్న పార్వతమ్మ దాకా.. .. కిట్టీ పార్టీలు చే...

ఆయుష్ ఆధ్వర్యంలో హోమియో మందులు సిద్ధం

హోమియో మందులు సిద్ధం .                               - హోంమంత్రి సుచరిత ఆంధ్రప్రదేశ్ ఆయుష్ డిపార్ట్మెంట్ కరోనా వైరస్ భారీ నుండి బయటపడేందుకు హోమియో మందులను సిద్దం చేసింది. ఆర్సీనిక్ ఆల్బా 30 అనే హోమియో మెడిసిన్ ను ఆయుష్ డిపార్ట్మెంట్ తయారు చేసింది. వీటిని వాడటం వలన కరోనా మహమ్మారి నుండి బయటపడే అవకాశం ఉందని హోమియో డాక్టర్లు చెబుతున్నారు. ఈ మందులను వాడటం వలన మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వైరస్ భారిన పడకుండా ఉండొచ్చని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 కోట్ల మంది ప్రజలకు ఈ మెడిసిన్ అందేలా చర్యలు చేపట్టారు. ఆయుష్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఉషా కుమారి ఆదేశాల మేరకు ఇప్పటికే రెడ్ జోన్ ప్రాంతాల్లో హోమియో మెడిసిన్ ను పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి 25 వేల 1 డ్రామ్ బాటిల్ లను పంపిణీ చేసేందుకు సన్నద్ధం అయ్యారు. ఒక్కో 1 డ్రామ్ బాటిల్ లో వుండే హోమియో మందును కుటుంబంలోని 6 మంది సభ్యులు వాడవచ్చని వైద్యులు పేర్కొన్నారు. 5 సంవత్సరం లోపు పిల్లలు రోజుకు 3 పిల్స్ చొప్పున 3 రోజుల పాటు వాడాల్సి...

కళాకారులు అభినందనలు

 తెనాలి కమర్షియల్ ఆర్టిస్టుల సంఘం ఈ కరోనా లాక్ డౌన్ కాలంలో వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, పత్రికా విలేకరులు తదితరులు అందిస్తున్న విలువైన సేవలకు ఇలా ధన్యవాదాలు తెలిపారు. చిత్రించిన కళాకారులను ప్రజలు అభినందించారు.

ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నేత లేఖ

*ఆంధ్రప్రదేశ్* _*సీఎం జగన్ కి టీడీపీ జాతీయ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు లేఖ.*_ ★ పింఛను అంటే ఒక ఉద్యోగి తన జీవితకాలం అందించిన సేవలకు ప్రతిఫలంగా పొందేటటువంటి ఆస్తి.  ★ అలాంటి పింఛను చెల్లింపులో ఎలాంటి కోతలూ పెట్టకూడదని చట్టాలు చెబుతున్నా, రాష్ట్రప్రభుత్వం కరోనా వంకతో మార్చినెల పింఛను చెల్లింపుల్లో 50 శాతం కోత పెట్టింది. ★ పింఛను అందుకునే వారంతా 60 ఏళ్ళకు పైబడిన వారే. వీరికి కరోనా వ్యాపించే అవకాశాలు ఎక్కువ అని కూడా అంటున్నారు.  ★ అదీ కాకుండా వయోభారంతో వచ్చే అనారోగ్య సమస్యలకు వైద్య ఖర్చులు కూడా ఉంటాయి.  ★ అందుకని వీలైతే వీరికి మరింత సాయం అందించాలి. ★ కానీ ఈ రివర్స్ ప్రభుత్వం వారికి చెల్లించే పింఛన్లలోనే 50 శాతం కోత పెట్టింది.  ★ ఇది సబబు కాదని, తక్షణమే 100 శాతం పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాసాను.

ప్రపంచ పుస్తక రోజు సందర్భంగా..

🚜🚲🏍️ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా... విజ్ఞాన సుగంధం     అనుభవాన్ని...జ్ఞానాన్ని ఓ తరం నుంచి మరో తరానికి అందించే సాధనం పుస్తకం. 'మంచి పుస్తకాలు పఠించడం, గత శతాబ్దాల లోని ఉత్తమ వ్యక్తులతో సంభాషించడం వంటిది' అంటాడు ఫ్రెంచి తత్వవేత్త రీనీ డెకార్త్‌.  దీనికి కొనసాగింపుగా 'కొన్ని పుస్తకాలు రుచి చూడాలి.. కొన్నింటిని మింగేయాలి, కొన్నిటిని నమిలి జీర్ణం చేసుకోవాలి' అంటాడు ప్రముఖ రచయిత బేకన్‌. మంచి పుస్తకం జ్ఞానాన్ని రంగరించి పెడుతుంది. దాన్ని జీర్ణం చేసుకొని నరనరానికి ఎక్కించుకోవడమే మనం చేయాల్సింది.  ఆదిమ కాలం నుంచి అంతరిక్ష యానం వరకు మానవ మేధస్సు సృష్టించిన, సృజించిన మహత్తర విషయాలన్నీ పుస్తకాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. మానవ చరిత్రలో సంభవించిన, సంభవిస్తున్న మలుపులన్నింటికీ అక్షరాలు సజీవ సాక్ష్యాలు. అందుకే 'మానవ జాతి పురోగమన యాత్రలో పుస్తకాలు మహత్తర పాత్ర పోషిస్తాయంటాడు’ ముల్కరాజ్‌ ఆనంద్‌.  ప్రపంచ గతిని మార్చిన ఎందరో మహనీయుల జీవితాలను ప్రభావితం చేసిన శక్తి అక్షరం. 'ఫిరంగి వచ్చి ఫ్యూడల్‌ వ్యవస్థను నాశనం చేసింది. సిరా ఈనాటి సాంఘిక వ్యవస్థ రూపురేఖలు మార్చేస్తుంద'న్న ...

సీఎంకు కృతజ్ఞతలు

*Big Breaking...* *ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై స్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రత్యేక కృషితో...* గుజరాత్ లో ఉన్న దాదాపు ఐదు వేల మంది మత్స్యకారులను ప్రత్యేక బోట్లలో సముద్ర మార్గం ద్వారా ఆంధ్రప్రదేశ్ తరలించడానికి ఒప్పుకొన్న గుజరాత్ ముఖ్యమంత్రి.....  మోపిదేవి వెంకటరమణ మత్స్య శాఖా మంత్రి.

పుస్తకం- యామిని దేవి కోడె

//పుస్తకం// ఒకో పేజీలో ఒకో నేను అలజడులూ.. అలికిడులూ మది గదిలో యదసడులు వినపడుతూ.. కనపడుతూ అక్షరమై అల్లుకుంటూ.. పుస్తకమంతా మస్తకపు మేధై బాహువులొదిగి ఆలింగనమై గుండెను తడిమే నేస్తం తానై ఒంటరితనమే దూరం తరిమే ఉరికే జలపాతాల లేలేత నవ్వులై కారే కన్నీటికథలకు ఓదార్పు తానై వదల్లేని పదిలమైందీ పుస్తకం 🌺🌺యా"మినీస్"🌺🌺

డాక్టర్ల పై దాడులు చేస్తే కఠినమైన చర్యలు..

*ఢిల్లీ* వైద్య బృందాల పై దాడులు చేసే వారికి తాజా ఆర్డినెన్స్ ప్రకారం ఎటువంటి బెయిల్ లభించదు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ భాధితులకు చికిత్స అందించేందుకు 723 కోవిడ్-19 హాస్పటల్స్ ఏర్పాటు 1.85 కరోనా వైరస్ భాధితులకు బెడ్లు ఏర్పాటు 2.5 కోట్ల ఎన్-95 మాస్కుల తయారీకి ఆర్డర్, ప్రస్తుతం 24 లక్షల ఎన్-95 మాస్కులు అందుబాటులో ఉన్నాయి. కరోనా వైరస్ పై పోరాడుతున్న వైద్యుల పై ఎటువంటి దాడులకు పాల్పడిన ఉపేక్షించేది లేదు. వైద్యుల వాహనాలను, ఆస్తులను ధ్వసం చేస్తే, వారి నుండి మార్కెట్ ధర కంటే రెట్టింపు ధర జరిమానాగా వసూలు చేస్తాం వైద్యుల పై దాడి కి పాల్పడే వారికి 6 నెలల నుండి 7 సంవత్సరాల వరకు జైలుశిక్ష విధించబడుతుంది. వైద్య సిబ్బందిపై దాడులు అరికట్టేందుకు కేంద్రం ఆర్డినెన్స్ 1897నాటి ది ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్‌లో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ , కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు జరిమానా వైద్యుల నుంచి ఆశా వర్కర్ల వరకు, వైద్య రంగ సిబ్బంది అందరికీ రూ. 50 లక్షల బీమా *ప్రకాష్ జవదేకర్ (కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి )*

డ్వాక్రా మహిళలకు శుభవార్త

*రాష్ట్రంలో శుక్రవారం నుంచి డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నామని* *పొదుపు సంఘాల అప్పులకు వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తుందని సీఎం జగన్‌ తెలిపారు* ఈ మేరకు డ్వాక్రా సంఘాలకు బుధవారం ఆయన లేఖలు రాశారు.  ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం’ డ్వాక్రా సంఘాలకు మరింత ఊతంగా నిలుస్తుందన్నారు.  కరోనా నియంత్రణ చర్యలను అమలు చేస్తూనే సీఎం వ్యక్తిగతంగా రాసిన లేఖలను గ్రామ సమాఖ్యల ద్వారా మహిళలకు అందజేసే ఏర్పాటు చేశారు.  *ఈ నెల 24న సీఎం జగన్‌ ఈ పథకాన్ని తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు* *అనంతరం, ఒక బటన్‌ నొక్కగానే సెర్ప్‌, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే*  *8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ఒకే విడత డబ్బులు జమ అవుతాయని సెర్ప్‌ సీఈవో రాజాబాబు తెలిపారు*  90,37,254 మంది మహిళా సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1400 కోట్లు ఒకే విడత జమవుతాయి.  ఏ పొదుపు సంఘానికి ఎంత వడ్డీ జమచేశారనే వివరాలను లేఖలో తెలియజేస్తారు.  డబ్బు జమ అయినట్లు రశీదు, ఏదైనా సమస్య వస్తే ఫిర్యాదు చేసేందుకు సెర్ప్‌, మెప్మా అధికారుల ఫోన్‌ నంబర్లు ల...

ఇప్పుడు అంతా

ఇప్పుడు అంతా

సునీల్ గ‌వాస్క‌ర్ సాయం రూ. 59 ల‌క్ష‌లు!

కొవిడ్‌-19 వ్యాప్తిని అరిక‌ట్టేందుకు జ‌రుగుతున్న పోరాటంలో దిగ్గ‌జ బ్యాట్స్‌మ‌న్ సునీల్ గ‌వాస్క‌ర్  భాగ‌మ‌య్యాడు. మ‌హ‌మ్మారిపై పోరుకు ప్ర‌ధాని స‌హాయ నిధితో పాటు మహారాష్ట్ర ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి విరాళం అందించాడు. అయితే ఈ విష‌యాన్ని లిటిల్ మాస్ట‌ర్ నేరుగా ప్ర‌క‌టించ‌లేదు. ముంబై మాజీ కెప్టెన్ అమోల్ మ‌జుందార్  ట్విట్ట‌ర్ వేదిక‌గాఈ అంశాన్ని ధ్రువీక‌రించాడు. `బ్యాటింగ్ లెజెండ్ క‌రోనా వైర‌స్‌పై పోరుకు రూ. 59 ల‌క్ష‌ల ఆర్థిక సాయం చేశారు. అందులో రూ. 35 ల‌క్ష‌లు పీఎం కేర్స్ నిధికి.. మ‌రో రూ. 24 ల‌క్ష‌లు మహారాష్ట్ర ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి కేటాయించారు. హ్యాట్స‌ఫ్ స‌ర్‌` అని ట్వీట్ చేశాడు. మ‌రోవైపు టీమ్ఇండియా టెస్టు స్పెష‌లిస్ట్ చ‌తేశ్వ‌ర్ పుజారా కూడా త‌న‌వంతు సాయం చేసిన‌ట్లు  వెల్ల‌డించాడు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌తీ రూపాయి అవ‌స‌ర‌మొస్తుంద‌ని పుజ్జీ పేర్కొన్నాడు. `నేను, నా కుటుంబ సభ్యులం మాకు చేత‌నైనంత సాయం చేశాం. ప్ర‌ధాని స‌హాయ నిధితో పాటు, గుజరాత్ సీఎం స‌హాయ నిధికి విరాళం అందించాం. మీరు కూడా ఈ ప‌నిచేశార‌ని ఆశిస్తున్నా. క‌ష్ట‌కాలంలో ప్ర‌తీ రూపాయి అక్క‌ర‌కు వ‌స్తుంది....