సీఎం సహాయనిధి కి చెక్కులు అందజేత

కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి గుంటూరు డీసీసీబీ(జిల్లా సహకార కేంద్ర బ్యాంకు) తరపున కోటి రూపాయలు విరాళం.  విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం  వైయస్ జగన్‌కు అంద‌జేస్తున్న‌ డీసీసీబీ ఛైర్మన్  ఆర్‌ సీతారామాంజనేయులు, డీసీసీబీ డైరెక్టర్‌ ఎన్‌ వి వి యస్‌ వరప్రసాద్, పాల్గొన్న హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ.


ముఖ్యమంత్రి సహాయనిధికి  గుంటూరు జిల్లా కోపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌) తరపున రూ.25 లక్షలు విరాళం. విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం  వైయస్ జగన్‌కు అందజేస్తున్న డీసీఎంఎస్‌ ఛైర్‌ పర్సన్‌ కె హెనీ క్రిస్టినా, కె సురేష్‌ కుమార్, పాల్గొన్న హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ.