రాష్ట్రంలో షుగర్ పరిశ్రమల అభివృద్ధికి సమగ్ర చర్యలు - పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అమరావతి,మే13 : రాష్ట్రంలో షుగర్ పరిశ్రమల అభివృద్ధికి సమగ్ర చర్యలు తీసుకోవాలని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయం నాల్గవ బ్లాక్ లోని మంత్రి ఛాంబర్లో పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాల కొండయ్య, కమిషనర్ మురళిలతో మంత్రి గౌతమ్ రెడ్డి షుగర్ పరిశ్రమల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని చిత్తూరు, వైఎస్సార్ కడప, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో మొత్తం 10 షుగర్ ఫ్యాక్టరీలు ఉండగా 6 మూతపడ్డాయని, 4 పరిశ్రమలు నడుస్తున్నట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. ఈ నేపథ్యంలో మూతపడ్డ పరిశ్రమల అభ...