Skip to main content

రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు 

రైట్..రైట్ ..
రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు                         50 శాతం మందితో జర్నీ.. ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్


కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌తో మార్చి 22 నుంచి ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. ఇక ఇంతకాలం డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు త్వరలోనే రోడ్డెక్కనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కేసులు పెరుగుతున్నా సరే ఇంకా ఎక్కువ రోజులు లాక్ డౌన్ విధిస్తే జనజీవనం అస్తవ్యస్థంగా మారుతుందని భావించి లాక్ డౌన్ విధించినా కొన్నిటికి సడలింపు ఇవ్వడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రజా రవాణా కొనసాగేలా ఆర్టీసీ అధికారులు బస్సులు తిప్పాలని నిర్ణయించినట్లు తెలిసింది.


18వ తేదీకల్లా బస్సులను తిప్పేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ


ప్రజా రవాణా శాఖ అధికారులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు బస్సులు నడపనున్నారు.
అయితే బస్సుల్లో సామాజిక దూరం పాటించేలా సీట్ల సర్దుబాటు చేసేలా ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీ పీటీడీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఆర్‌ఎంలకు 18వ తేదీకల్లా బస్సులను తిప్పేందుకు సిద్ధంగా ఉండాలని సర్క్యులర్‌ జారీ చేశారు. దీంతో అన్ని రీజియన్‌లలో ఉన్నతాధికారులు వివిధ డిపోల్లోని డీఎం, తదితరులను అప్రమత్తం చేశారు. బస్సులను కండీషన్ లో పెట్టుకోవటానికి సన్నాహాలు చేస్తున్నారు.


భౌతిక దూరం ఉండేలా బస్సుల్లో సీటింగ్ అరేంజ్మెంట్ మారుస్తున్న అధికారులు


ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు కరోనావ్యాప్తి జరగకుండా ఉండేలా అన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్న ఆర్టీసీ అధికారులు రంగంలోకి దిగారు . మొదటి దశగా రీజియన్‌లో 635 బస్సులు తిప్పాలని అధికారులు నిర్ణయించారు. అంతేకాదు బస్సుల్లో, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో సీటింగ్‌ ఏవిధంగా ఏర్పాటు చేయాలని గ్యారేజ్‌ సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీటింగ్ భౌతిక దూరం ఉండేలా చూడాలని భావిస్తున్నారు. దీంతో ప్రయాణీకులు భౌతిక దూరం పాటిస్తే కరోనా వ్యాప్తి జరగకుండా ఉంటుందని ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక సీటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.


50 శాతం మాత్రమే ప్రయాణాలు .. ఆన్ లైన్ బుకింగ్


గతంలో 100 శాతం ప్రయాణికులు ప్రయాణాలు చేస్తే ఇక నుండి బస్సులో కేవలం 50 శాతం మందే ప్రయాణించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక టికెట్లు కూడా కండక్టర్ బస్సుల్లో కొట్టి ఇవ్వటం వల్ల కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉండటం తో టికెట్లు కూడా ఆన్‌లైన్‌ ద్వారానే బుక్‌ చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక వేళ బస్సుల్లో సీట్లు ఖాళీగా ఉంటే బస్టాండ్లలో కండక్టర్లు ఫోన్‌ పే, గూగుల్‌ పే, ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేస్తారు తప్ప చేతికి టికెట్ ఇచ్చే అవకాశం లేదు .


గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ లావదేవీలు తెలీని ప్రజలు ... ఆన్ లైన్ బస్ బుకింగ్ అంటే తిప్పలే


ఇక ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని బస్సులను నడపాలని సర్కార్ భావిస్తుంది కానీ అది ఆర్టీసీకి నష్టం చేకూరుస్తుంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది . ఇప్పటికే ఎప్పుడెప్పుడు బస్సులు తిరుగుతాయ అని చూస్తున్న వారికి ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం కాసింత ఊరట కలిగించినా , ఆన్ లైన్ బుకింగ్ మాత్రం కాసింత ఇబ్బందే. గ్రామీణ నేపధ్యం ఉన్న ఎంతో మందికి ఇంకా చాలా చోట్ల డిజిటల్ ట్రాన్జాక్షన్ తెలీదు . వారు బస్సు టికెట్లు కొనుగోలు చెయ్యాలంటే ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే వారికి తిప్పలే మరి.


Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...