ఈరోజు సాయంత్రం 4గంటలకు ఆర్థిక ప్యాకేజీ వివరాలు

*ఈరోజు సాయంత్రం 4గంటలకు ఆర్థిక ప్యాకేజీ వివరాలు*



```కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. 


ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈరోజు సాయంత్రం 4గంటలకు మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు.


ఆర్థిక వ్యవస్థకు ఊపరిలూదేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీని ఇప్పటికే పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. 


ప్యాకేజీ సమగ్ర స్వరూపం ఎలా ఉంటుందన్న దానిపై పారిశ్రామిక వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆధునిక సాంకేతికతతో సరఫరా గొలుసును బలోపేతం చేయాలన్న ప్రతిపాదన ఈ ప్యాకేజీలో చాలా కీలకమైన అంశంగా మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 


ప్రధాని ప్రకటించిన ప్యాకేజీలో బ్యాంకులకు ఎక్కువగా కేటాయించాలని, బ్యాంకులను రక్షించుకుంటేనే ఆర్థికరంగం ముందుకెళ్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.```