ప్రధానమంత్రి లైవ్

ప్రధానమంత్రి లైవ్.                                      https://youtu.be/0xmx92Q_kQ4               


రూ. 20లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ: మోదీ


దిల్లీ: కరోనాతో దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ప్రధాని మోదీ భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట రూ.20లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఇది మన దేశ జీడీపీలో 10 శాతమని తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మట్లాడుతూ.. కరోనాతో నాలుగు నెలలకు పైగా ప్రపంచం పోరాడుతోంది. కరోనాపై విజయం సాధించేందుకు అందరూ కలిసి పోరాడుతున్నారు. ఈ వైరస్ ప్రపంచానికి తీవ్ర నష్టం కలిగించింది. ప్రస్తుతం ప్రపంచం సంక్షోభంలో ఉంది. మరింత సంకల్పంతో పోరాడాల్సిన సమయమిది అన్నారు.