రాపర్ల లో విషాదం 9 మంది మృతి

రాపర్ల లో విషాదం 9 మంది మృతి.
నావులుప్పలపాడు
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు (మం) రాపార్ల గ్రామం లో విషాదం చోటు చేసుకుంది.
మిరపకాయలు కోత పనికి ముగించుకుని  వచ్చి తిరిగి ట్రాక్టర్ లో  ఇంటికి   వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.ట్రాక్టర్ పై వస్తున్న వ్యవసాయ కార్మికులు ప్రమాద వశాత్తు మార్గమధ్యంలో ఉన్న విద్యుత్  హైటెన్సన్ వైర్లు తగిలి 9మంది దుర్మరణం పాలయ్యారు.
మృతులు అందరూ రాపర్ల గ్రామానికి చెందిన వారు .ఈ సంఘటనతో గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది.
ఘటనాస్థలనికి చేరుకున్న పోలీసులు మృతులను గుర్తించే పనిలో పడ్డారు. నాగులుప్పలపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.