Skip to main content

కుమార్ పంపులు సంస్థ ఆధ్వర్యంలో  జర్నలిస్టుల కు నిత్యావసర వస్తువుల పంపిణీ

కుమార్ పంపులు సంస్థ ఆధ్వర్యంలో  జర్నలిస్టుల కు నిత్యావసర వస్తువుల పంపిణీ      తెనాలి పట్టణం లో పనిచేస్తున్న పాత్రికేయులకు నిత్యావసర సరుకులు  పారిశ్రామికవేత్త,  కుమార్ మంపులు సంస్థ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం సోమవారం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. స్థానిక కుమార్ పంపులు సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం మాట్లాడారు. సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు పనిచేస్తున్న పాత్రికేయులసేవలు మరువరానివని చెప్పారు. ప్రముఖ పారిశ్రామికవేత్త,కుమార్ పంప్స్ అధినేత కొత్తా సుబ్రహ్మణ్యం అన్నారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర  ప్రముఖమై నదన్నారు. నిరంతరం ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి ,వాటి పరిష్కారానికి కృషి చేసే పనిలో కీలక భూమిక పోషిస్తున్నారని అన్నారు. తన వంతు సహాయంగా కార్యక్రమమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడు టి. రవింధ్రబాబు మాట్లాడుతూ తొలి నుంచి కష్టపడి పైకి వచ్చి పారిశ్రామికవేత్తగా తన ప్రతిభను,నలుదిశలో విస్తరింపజేసారన్నారు.  కొత్త సుబ్రహ్మణ్యం విలేకరుల పట్ల సానుభూతితో సహాయ సహకారం అందించటం ముదావహమన్నారు.  కార్యదర్శి కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ,చిన్న పత్రికల విలేకరులు అసాధారణ రీతిలో సమాచారం సేకరించి వెలుగులోకి తెస్తున్నారని, అలాంటి వారికి ప్రకటనలు ఇచ్చే క్రమంలో, ప్రాధాన్యత కల్పించాలని కోరారు. నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఫెడరేషన్ నాయకులు జి.ప్రభాకర్ మాట్లాడుతూ,సుబ్రహ్మణ్యం తొలి నుంచి సేవా దృక్పథం కలిగిన వ్యక్తిని అలాంటి వ్యక్తి మన తెనాలి పట్టణంలో ఉండటం గర్వకారణమన్నారు. నేడువిలేకరులకు తన సహాయ సహకారాలు అందించటం అభినందనీయమన్నారు. వందమందికి పైగా విలేకర్ల కు సంస్థ ప్రతినిధులు నిత్యావసర వస్తువులు అందజేశారు.  కార్యక్రమంలో పాత్రికేయులు గుమ్మడి ప్రకాశరావు, బొల్లిముంత కృష్ణ ,ప్రకాష్ రావు,  లక్ష్మణరావు, నాయుడు, చందు, ప్రేమ్ కుమార్, మేకల సుబ్బారావు, సామ్యేల్, జహీర్, యం.రవి, శేఖర్, జానీ, గుంటూరు విజయ్, రెడ్డి, యడవూరు సాంబశివరావు, రమేష్, శ్రీకాంత్, శ్రీను, నాగరాజు, శ్యామ్ సాగర్, రామారావు, బదరి ప్రసాద్, వి. భాస్కర్, జీవన్ శ్రీ, తదితరులు పాల్గొన్నారు.


Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...