కరోనా పై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలంటూ హైకోర్టులో పిల్...

*టీఎస్ హైకోర్టు.....*


కరోనా పై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలంటూ హైకోర్టులో పిల్...


పిల్ దాఖలు చేసిన న్యాయవాది రాపోలు భాస్కర్


వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జర్నలిస్ట్ పిల్ పై విచారణ చేపట్టిన హైకోర్టు..


ప్రాణాలకు తెగించి కరోనా వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలని కోర్టుకు తెలిపిన పిటీషనర్


పిటీషనర్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య..


లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టుల కు ప్రభుత్వం అడుకోవలన్న పిటీషనర్..


రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జర్నలిస్టుకు 25 వేలు ఇచ్చే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్న పిటీషనర్...


కరోనా వార్తలను కవర్ చేస్తున్న ప్రతి జర్నలిస్టుకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని కోరిన పిటీషనర్...


జర్నలిస్టులకు మెడికల్ కిట్లు, మాస్కులు, ఉచితంగా అందించాలని కోర్టును కోరిన పిటీషనర్..


తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇన్ఫర్మేషన్ & పబ్లిక్  డిపార్ట్ మెంట్, ప్రెస్ అకాడమీ చైర్మన్ కు హైకోర్టు నోటీసులు జారీ...


పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేస్తామన్న అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్..


తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.