Skip to main content

Posts

Showing posts from October, 2020

తెనాలిలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళాశాల అందిస్తున్న కోర్సులు..

అరుదైన గుర్తింపు పొందిన వీరస్థలి తెనాలి డాక్యూమెంటరీ చిత్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లఘు చిత్రాల పోటీల కొరకు దరఖాస్తుల ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లఘు చిత్రాల నియమ నిబంధనలను అనుసరించి 2020వ సంవత్సరానికి గాను  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లఘు చిత్రాల పోటీల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన “నవరత్నాలు” అభివృద్ది పధకాలపై  తెలుగు భాషలో 3 నుండి 5 నిమిషాల వ్యవధిలో లఘు చిత్రo నిర్మించిన వ్యక్తులు / సంస్థల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.       ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లఘు చిత్రాల నియమ నిబంధనలనలతో పాటుగా దరఖాస్తుల కొరకు మా సంస్థ వెబ్ సైట్ www.apsftvtdc.in ను చూడగలరు. దరఖాస్తులను ఆన్ లైన్లో పొందుపరచగలరు.  పూర్తి చేసిన దరఖాస్తుతో పాటుగా చిత్రీకరించిన లఘు చిత్రo యొక్క కంటెంట్ ను DVD/USB(Pen Drive)/Blu-ray ఫార్మాట్లలో సంబంధిత ఫారాలతో జతపరచి మా సంస్థకు పంపుటకు చివరి తేది: 14 డిసెంబర్, 2020  గా నిర్ణయిస్తూ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకటక జారీచేయడ మైనది....... మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర టి.వి. మరియు నాటకరంగ అభివృద్ది సంస్థ, విజయవాడ, తేది: 17.10.2020

మాజీ రాష్ట్రపతి రాష్ట్రీయ సన్మాన్ పురస్కారం అందుకున్న చిత్రకళా ఉపాధ్యాయుడు రవీంద్ర విజయ ప్రకాష్

తెనాలి వైకుంఠపురం లో శరన్నవరాత్రి మహోత్సవాలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 కృష్ణా నదికి 9 నుండి 9.50 లక్షల క్యూసెక్ ల  నీరు విడుదల చేయడం జరుగుతున్నందున లంక గ్రామాల ప్రజలు అధికారుల సూచనల మేరకు వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి.  అధికారుల సూచనలు పాటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు -  గుంటూరు జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్

గుంటూరు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రుల పర్యటన

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి  చెరుకువాడ శ్రీరంగనాథరాజు రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితతో కలిసి సందర్శించారు  తెనాలి నియోజకవర్గంలోని బొమ్మ వారి పాలెం వద్ద మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులను అడిగి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు కూరగాయలు, పసుపు, అరటి, తమలపాకు, వరి పంటలను పరిశీలించారు. బాధిత రైతులను అడిగి పంటనష్టం వివరాలు తెలుసుకున్నారు. పంటనష్టం వివరాలు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.  ఈ పరిస్థితులు గౌరవ ముఖ్యమంత్రి గారికి  వివరించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తాడేపల్లి మండలం చిర్రావూరి గ్రామం, కొల్లూరు మండలం బొమ్మ వాణి పాలెం, చిలుమూరు, జువ్వలపాలెం, భట్టిప్రోలు మండలం వెల్లటూరు ప్రాంతాలను పరిశీలించి రైతులతో మాట్లాదారు. ఈ పర్యటనలో కలెక్టర్ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్,జాయింట్ కలెక్టర్, దినేష్ కుమార్ ఎమ్మెల్యే మేరగా నాగార్జున,  ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

 దసరా పండగ దృష్ట్యా పలు ప్రాంతాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే

దసరా పండగకు మరిన్ని ప్రత్యేక రైళ్లు  దిల్లీ: ప్రకటించింది. కాకినాడ-లింగంపల్లి, తిరుపతి-లింగంపల్లి,  నర్సాపూర్‌-లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. వాటితో పాటు విజయవాడ-హుబ్లీ,  తిరుపతి-అమరావతి మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈప్రత్యేక రైళ్లు అన్నీ 20వ తేదీ నుంచి మొదలుకొని 30వరకు తిరగనున్నాయని ద.మ.రైల్వే వివరించింది.   వివరాలు ఇలా...  * కాకినాడ పోర్టు- లింగంపల్లి: ఈనెల 20 నుంచి ప్రతిరోజూ రా.7:10గం.కు * లింగంపల్లి- కాకినాడ: ఈనెల 20 నుంచి ప్రతిరోజూ రా.8:30గం.కు * తిరుపతి- లింగంపల్లి: ఈనెల 20 నుంచి ప్రతిరోజూ ఉ.6:55గం.కు * లింగంపల్లి- తిరుపతి: ఈనెల 20 నుంచి ప్రతిరోజూ సా.5:30గం.కు * నర్సాపూర్‌- లింగంపల్లి: ఈనెల 23 నుంచి ప్రతిరోజూ సా.6:55గం.కు * లింగంపల్లి- నర్సాపూర్‌: ఈనెల 20 నుంచి ప్రతిరోజూ రా.9:05గం.కు * విజయవాడ- హుబ్లీ: ఈనెల  21 నుంచి ప్రతిరోజూ రా.7:45గం.కు * తిరుపతి- అమరావతి: ఈనెల  20 నుంచి ప్రతిరోజూ మ.3:10గం.కు * అమరావతి- తిరుపతి: ఈనెల22 నుంచి ప్రతిరోజూ ఉ.6:45గం.కు

ఎస్.బి.ఐ. అమరావతి సర్కిల్ భారీ విరాళం.. 23 లక్షలతో 27 సీట్ల బస్సు  దేవస్థానానికి అందజేత

విజయవాడ, ఇంద్రకీలాద్రి, అక్టోబరు17ః- .  విజయవాడ ఇంద్రకీలాద్రి వై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి అమ్మవారి దేవస్థానానికి భక్తుల సౌకర్యార్థం బస్సును అందజేయడంజరిగిందిని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ పి. శివకుమార్ తెలిపారు.   శనివారం శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం చైర్మన్, కార్యనిర్వాహణాధికారికి ఇంద్రకీలాధ్రి పై ఎస్.బి.ఐ.అధికారులు వాహనాన్ని అందించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ  అమరావతి సర్కిల్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం 27 సీట్లు గల మినీ బస్ ను అందించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.   ఈ మహత్కార్యంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.   ఆన్ లైన్ ద్వారా హైదరాబాదు నుండి చీప్ జనరల్ మేనేజరు సంజయసహాయ్  ఈ బస్సును విరాళంగా దేవస్థానానికి అందజేశారు.  డి.జి.యం వై. సత్యనారాయణ ప్రసాద్ మాట్లాడుతూ  అమ్మవారి సేవలో భాగస్వామ్యమవ్వడం పట్ల సంతషంగా ఉందన్నారు.   దేవస్థానం బోర్డు సభ్యులు ఈ అవకాశాన్ని కల్పించినందులకు  ఎస్ బి.ఐ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.  ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎస్.బి.ఐ. గాంధి నగర్ ఆధ్వర్యంలో న...

డాక్టర్ రాగలతకు అంతర్జాతీయ పురస్కారం

డాక్టర్ రాగలతకు అంతర్జాతీయ పురస్కారం

వైయస్సార్‌ చేయూత, వైయస్సార్‌ ఆసరా పథకాల అమలుపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం  వైయస్‌ జగన్‌ సమీక్ష

వైయస్సార్‌ చేయూత, వైయస్సార్‌ ఆసరా పథకాల అమలుపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం  వైయస్‌ జగన్‌ సమీక్ష - మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీతో పాటు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరు. అమరావతి: సమీక్షా సమావేశంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..: బ్రాండింగ్‌ తీసుకురావాలి: – వైయస్సార్‌ చేయూత పథకంలో మహిళలకు ఉపాధి కల్పనపై పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం కాబట్టి, ఎక్కడా లోపం లేకుండా చూసుకోవాలి.  – ఉపాధి కోరుతున్న మహిళలు నిజంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని అభివృద్ధి చెందాలి. దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. – కిరాణా షాపుల నిర్వాహకులకు ఏ సమస్య వచ్చినా, ఎక్కడైనా, ఎవరైనా లంచం అడిగినా, వెంటనే ఫోన్‌ చేసేందుకు వారికి ఒక నెంబరు ఇవ్వాలి. – ఆ నెంబర్‌ను షాపు వద్ద ప్రదర్శించాలి. – వ్యవస్థలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా చూడాలి, లేకపోతే విశ్వాసం కోల్పోతాము.  _ లబ్దిదారుడికి ఎట్టి పరిస్ధితుల్లోనూ నష్టం రాకుండా చూడండి  _ కొత్తగా ఏర్పా...

ముగిసిన దుర్గగుడి పాలకమండలి సమావేశం

విజయవాడ ముగిసిన దుర్గగుడి పాలకమండలి సమావేశం దసర ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించిన పాలకమండలి సభ్యులు..... దసర ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన చైర్మన్ సోమినాయుడు, ఈవో సురేష్ బాబు సోమినాయుడు దుర్గగుడి ఛైర్మన్,ఈవో సురేశ్ బాబు 37 అంశాలు సమావేశంలో చర్చించారు  17 నుండి 25 వరకు దసర ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించారు  ఉత్సవాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలను అమలు చేస్తామన్నారు  ఆరడుగులు భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని  చెప్పారు  మూలాల నక్షత్రం రోజు సీఎం.జగన్ పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పిస్తారు మూల నక్షత్రం రోజున భక్తుల రద్దీని బట్టి కలెక్టర్ అనుమతి తో టిక్కెట్ లు ఆన్లైన్ లో పెంచే ఆలోచన చేస్తున్నారు  ఈ సారి దసర ఉత్సవాలకు 4 నుండి 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామన్నారు 

క్రెడిట్‌ కార్డు సైజులో ఆధార్‌.. అప్లై ఇలా..

ఆధార్‌ కార్డు ఆకర్షణీయమైన సరికొత్త రూపును సంతరించుకుంది. డెబిట్‌/క్రెడిట్‌ కార్డు పరిమాణంలోకి మారిపోయింది. ఇక నుంచి ఇది పర్స్‌లో ఇమిడిపోయేంత చిన్నగా ఉండనుంది. పాలి వినైల్‌ క్లోరైడ్‌ (పీవీసీ)తో రూపొందే ఈ కార్డు ధరను రూ.50గా నిర్ణయించారు. ఈ తరహా కార్డు కావాలనుకున్న వారు ఆధార్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ఆధార్‌కార్డు వివరాలను నమోదు చేయడం ద్వారా సరికొత్త ఆధార్‌ను పొందొచ్చు. పది రోజుల్లో కొత్త ఆధార్‌ కార్డు మీ ఇంటికి చేరుతుంది. అప్లై చేయండి ఇలా.. -------------------------- * పీవీసీ ఆధార్‌ కార్డు అప్లయ్‌ చేసేందుకు https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి * గెట్‌ ఆధార్‌ అనే చోట Order Aadhaar PVC Card అనే ఆప్షన్‌ క్లిక్‌ చేయాలి. * అక్కడ మీ ఆధార్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. లేదంటే మీ ఆధార్‌ కార్డు తాలూకా వర్చువల్‌ ఐడీని గానీ, ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ అయినా ఎంటర్‌ చేయొచ్చు.

టీటీడీ క్యాలెండర్‌ను విడుదల చేసిన చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి

టీటీడీ క్యాలెండర్‌ను విడుదల చేసిన చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 06 : ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రూపొందించే క్యాలెండర్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి హైదరాబాద్ లో విడుదల చేసినట్లు లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గోవిందహరి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 12 షీట్లతో రూపొందించిన ఈ క్యాలెండర్ లో వెంకన్న స్వామి అన్ని రూపాలు ఉంటాయని తెలిపారు. ఈ క్యాలెండర్ నేటి నుంచి హిమాయత్ నగర్ తిరుమల తిరుపతి దేవస్థానం(బాలజీ భవన్)లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ క్యాలెండర్ ధర రూ. 100 గా నిర్ణయించామని, కొనుగోలుదారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్యాలెండర్‌ను సొంతం చేసుకోవచ్చని తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో త్వరలో మరిన్ని రకాల క్యాలెండర్‌ను రూపొందించి విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రమేష్, కృష్ణయ్య, టీటీడీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

వైద్యారోగ్యశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 225 పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్‌ జారీ

అమరావతి : వైద్యారోగ్యశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 225 పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు.  మంగళవారం నుంచి ఈనెల 12వతేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.   జిల్లాలోని ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్యకేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ఒంగోలులో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిపై భర్తీ చేయనున్నారు.  ఇందులో మెడికల్‌  కేటగిరీలో 15, నర్సింగ్‌, పారామెడికల్‌  విభాగంలో 196 పోస్టులు, ఇతర కేటగిరీల్లో 14 పోస్టులు ఉన్నాయి.  ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.  అందుకు సంబంధించిన విద్యార్హతలు, రిజర్వేషన్లు, లోకల్‌, నాన్‌లోకల్‌ తదితర అంశాలన్నింటినీ నోటిఫికేషన్‌లో ప్రకటించారు. 

// విషాద పర్వం // కోడె యామిని దేవి

  // విషాద పర్వం //    భరతమాత ఎదురైనా బలికాక తప్పదేమో  కనకదుర్గ కనిపించినా కాముకులు వదలరేమో  ఆడతనమంటే అనునిత్యం ఆక్రందనమా అమ్మతనమంటే అఘాయిత్యాల సుడిగుండమా!   పుణ్యభూమి నాదేశంలో పురుషాహంకారాలు  దుర్యోధన దుశ్శాసన కీచకుల పర్వాలు   అడుగడుగునా హత్యాచారాలై.. అతివల ఆక్రందనలు  క్షణక్షణానికో రణం.. ఆరని జ్వాలాభారతం     ప్రార్ధనా గీతాలు, మతగ్రంధాల నీతి బోధలూ భావి భారత ప్రతిజ్ఞలు.. ఏమయ్యాయమ్మా ? రాసిపెట్టిన రాజ్యాంగాలు, చేసిన సవరణలు  శాసనసభల చట్టాలు, శాసించే సిద్దాంతాలు నినదించే నిర్భయలు, దిక్కుతోచని దిశలు  ఎన్ని విషాదపర్వాలో.. ఎన్నెన్ని నిశీధి గీతాలో   అయ్యో.. తల్లీ.. భరతమాతా ఇది విన్నావా? శక్తి ప్రతీక స్త్రీ అనేది ఒట్టి నానుడైయ్యిందమ్మా  శక్తి విహీనం చేస్తున్న మృగతత్వపు మనిషి వికృతత్వం  మకిలిపడ్డ మనసుల్లో.. కరుడుగట్టిన కఠినత్వంలో..   సిగ్గుదాచే తెరను లాగి గొంతు నొక్కినవైనం నిర్బంధించి వెన్నువిరిచి నాల్క కోసిన దారుణం  తొడలమధ్యన "తొక్కిసలాట" కై నరకయాతనన పెట్టిన ఆటవికం  ఎందుకమ్మా ఈ వైపరీత్యం.. ఏమ...