టీటీడీ క్యాలెండర్‌ను విడుదల చేసిన చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి

టీటీడీ క్యాలెండర్‌ను విడుదల చేసిన చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి


హైదరాబాద్, అక్టోబర్ 06 : ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రూపొందించే క్యాలెండర్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి హైదరాబాద్ లో విడుదల చేసినట్లు లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గోవిందహరి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 12 షీట్లతో రూపొందించిన ఈ క్యాలెండర్ లో వెంకన్న స్వామి అన్ని రూపాలు ఉంటాయని తెలిపారు. ఈ క్యాలెండర్ నేటి నుంచి హిమాయత్ నగర్ తిరుమల తిరుపతి దేవస్థానం(బాలజీ భవన్)లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ క్యాలెండర్ ధర రూ. 100 గా నిర్ణయించామని, కొనుగోలుదారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్యాలెండర్‌ను సొంతం చేసుకోవచ్చని తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో త్వరలో మరిన్ని రకాల క్యాలెండర్‌ను రూపొందించి విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రమేష్, కృష్ణయ్య, టీటీడీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.