Skip to main content

కాకీబతుకులు నవల రచయిత మోహనరావు మృతి

 కాకీబతుకులు నవల రచయిత మోహనరావు మృతి


తెనాలి: బానిసల తిరుగుబాటు నాయకుడు స్పార్టకస్ కలం పేరుతో పోలీసు వ్యవస్థలోని మరో కోణాన్ని 'ఖాకీబతుకులు "నవలగా సజీవంగా చిత్రీకరించి సాహితీలోకంలో, పోలీస్ శాఖలో సంచలనం రేపిన గంటేనపాటి మోహనరావు (68) ఇకలేరు. తెనాలి కొత్తపేటలోని పోలీస్ క్వార్టర్స్ లోని నివాసంలో ఆదివారం రాత్రి మృతిచెందారు. మధుమేహం కారణంగా గుండె బలహీనమై మరణానికి చేరువ చేసింది. ఆయనకు భార్య మేరీ, కుమార్తె ప్రత్యూష, కుమారుడు ప్రేమ్ చంద్ ఉన్నారు. సాయంత్రం అంత్యక్రియలు పూర్తిచేశారు. పలువురు సాహితీవేత్తలు, పట్టణ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నాయకులు కనపర్తి రత్నాకర్, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

ఎస్టీ హెడ్ కానిస్టేబుల్ గా తెనాలిలో పనిచేస్తున్న సమయంలో మోహనరావు ఖాకీబతుకులు నవలను రాశారు. తనకన్నా ముందు 1940-75 మధ్య పోలీసుశాఖలో కానిస్టేబుల్ గా పనిచేసిన తన తండ్రి ప్రకాశం జీవితానుభవాలను తీసుకుని 1980-88 మధ్య రాసిన ఈ నవల, 1998లో పుస్తకరూపం దాల్చింది. పోలీస్ కానిస్టేబుల్ జీవితంలోని ప్రతి పార్శాన్నీ హృదయానికి హత్తుకునేలా అక్షరీకరించిన ఈ నవలకు ఆపూర్వమైన స్పందన లభించింది. ఏడాదిలోనే పునర్ముద్రణకు వచ్చింది. పాతికేళ్ల క్రితం వెలువడిన ఈ నవలపై అప్పటి పోలీస్ బాస్ కన్నెర్ర ఫలితంగా మోహనరావు ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఇందుకోసం ఆయన న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. న్యాయం జాప్యమవుతుందన్న భావనతో తన కేసును తానే వాదించుకున్నాడు. 18 ఏళ్ల సుదీర్ఘపోరాటం ఫలించి, 2011లో ఉద్యోగమైతే వచ్చింది. కేవలం 10 నెలలు హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసి రిటైరయ్యారు. 


సస్పెన్షనులో ఉన్న కాలాన్ని సర్వీసులో చేర్చకపోవటం, అప్పట్లో రావాల్సిన సగం వేతనం నిరాకరించటంపై న్యాయస్థానం తలుపు తట్టారు. మోహనరావుకు 18 సంవత్సరాల పెన్షనరీ ప్రయోజనాలను కల్పించమని కోర్టు తీర్పు వచ్చింది. దీనిపై 2012 చివర్లో అప్పటి జిల్లా ఎస్పీ హైకోర్టుకు వెళ్లి స్టే ఉత్తర్వులు పొందారు. దీనిపై 18 ఏళ్ల సర్వీసును తీసేసి 21 సంవత్సరాల సర్వీసునే పరిగణనలోకి తీసుకుని పింఛను ఇస్తున్నారు. అదే 18 ఏళ్లలో రావాల్సిన సగం జీతం పైనా ఆప్పీలు పెండింగులో ఉండిపోయింది. 


కానిస్టేబుల్ గా చేస్తూనే పీజీ, లా డిగ్రీలు చేసిన మోహనరావు కొత్తగా పోలీసుశాఖలో చేరే కానిస్టేబుళ్ల కోసం పోలీస్ చట్టాలు, న్యాయ అంశాలపై 12 పుస్తకాలు రాశారు. తన కుమార్తె ప్రత్యూష పబ్లికేషన్స్ పేరుతో తాను ముద్రించుకున్నారు. సుదీర్ఘ న్యాయపోరాట కాలంలో ఆ పుస్తకాలే ఆ కుటుంబాన్ని ఆదుకున్నాయి. ఎమర్జన్సీ తర్వాత పరిణామాలతో ఖాకీబడుకులు రెండో భాగం రాస్తానని అప్పట్లో ప్రకటించారు. మోహనరావు. దీనికి ముందు క్రైస్తవ సన్యాసిని (నన్స్)లపై పుస్తకం, ఓ సినిమా కథ రచనకు పూనుకున్నారు. అనారోగ్యంతో అవి పూర్తిచేయలేకపోయారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...