Skip to main content

ప్రభుత్వాలు కళలను, కళాకారులను ప్రోత్సహించాలి

 ప్రభుత్వాలు కళలను, కళాకారులను ప్రోత్సహించాలి 

తెనాలి మార్చి 27 : కళాకారులు జనజీవన గమన నిర్ణేతలని చైతన్య వంతులని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక అభ్యుదయ కళాసమితి ప్రాంగణంలో బొల్లిముంత ఫౌండేషన్ వేదిక పై జరిగిన ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుకలకు వైష్ణవి జూనియర్ కళాశాల డైరెక్టర్, అభ్యుదయ కళాసమితి ప్రధాన కార్యదర్శి పాటిబండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ రంగస్థల వైభవం కోసం కళాకారులు తమ జీవితాలను త్యాగం చేశారని, వారి అడుగు జాడల్లో యువ కళాకారులు ముందుకు వెళ్ళాలని చెప్పారు. ప్రభుత్వాలు కళాకారులను, కళలను పోషించాల్సిన అవసరం ఉందన్నారు. కళాకారులు క్రమశిక్షణ సైనికుల్లాగా తమ ప్రదర్శనలు చేయాలని, సామాజిక సమస్యలను ఇతి వృత్తాలుగా చేసుకుని ప్రదర్శనలు ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఎం.సత్యనారాయణ శెట్టి మాట్లాడుతూ నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దర్శకుడు జొన్నల పేరెడ్డి మాట్లాడుతూ కళాకారులు, ప్రజా చైతన్యం కోసం నాటకాలు ప్రదర్శించాలన్నారు. కుల మత, తత్వాలు, రంగం అండగా నిలవాలని హితవు పలికారు. గరికపాటి సుబ్బారావు మాట్లాడుతూ మావో, పురుషాధిక్యత, తాండవిస్తున్న సమాజంలో మానవీయ తాత్విక స్పృహను ప్రవేశపెట్టే సత్తా జర్మన్ మేధావులు, బెట్రోల్డ్, బ్రెస్ట్, ఫాలో ఫెర్నీ, ఆగస్టో బోలోలాంటి వారందరో నాటక రంగం ద్వార ప్రజలను మేల్కొలిపారన్నారు. కళాసమితి నిర్వాహకులు గోగినేని కేశవరావు, సభ్యులు కళాకారులు రమేష్, బెల్లంకొండ వెంకట్, తాడికొండ జగన్మోహనరావు, బడుగుమోహనరావు, కనపర్తి  మధుకర్, దేవరపల్లి నీలాంబ్రం, మహిళా కళాకారిణిలు వి. హైమావతి, పద్మజా ప్రభాకర్ లను సత్కరించారు




. ఈ సందర్భంగా గాయకులు గేయాలను గానం చేశారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...