Skip to main content

ఘనంగా పునరుత్థాన పండుగ ప్రార్ధనలు


 ఘనంగా పునరుత్థాన పండుగ ప్రార్ధనలు




 


- శిలువను గెలిచిన రక్షకునికి ఆరాధనలు 



తెనాలి ఏప్రిల్ 4 (తెనాలి): పట్టణ,పరిసర గ్రామాల్లో అన్ని క్రీస్తు దేవాలయాల్లో క్రీస్తు పునరుత్థాన పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఆయా చర్చీలను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు.తెల్లవారు జామునుంచే క్రైస్తవ సోదరులు సంప్రదాయబద్ధంగా క్రైస్తవ స్మశాన వాటికలకు చేరుకుని పూర్వికుల సమాధులపై పువ్వులు చల్లి, క్యాండిల్స్ వెలిగించి మృతిచెందిన వారిని స్మరించుకున్నారు.స్థానిక ఐతానగర్,చినరావూరు, రామలింగేశ్వర పేట,పినపాడు తదితర స్మశాన వాటికల్లో ప్రార్ధనలు జరిపారు. వీటితోపాటు తెనాలి నియోజకవర్గంలోని అన్ని క్రైస్తవ స్మశానవాటికల్లో ప్రార్ధనలు జరిగాయి.బోస్ రోడ్ లోని ఎఇఎల్ సి క్రీస్తు దేవాలయం (టౌన్ చర్చి)లో ఉదయం తొమ్మిది గంటలనుంచి పునరుత్థాన పండుగ పవిత్ర ప్రార్ధనలు ప్రారంభమయ్యాయి. చర్చి పాస్టర్లు రెవ.డి.యేసురత్నం,వై. లెనిన్ బాబు,డి. సాల్మన్‌రాజు, యం.వి.బి ప్రకాష్ బాబులు ఈస్టర్ పండుగ ప్రత్యేక వాక్యపఠనం చేసి పాపులను రక్షించుటకు క్రీస్తు శిలువ మరణంపొంది సజీవునిగా మూడవ రోజు తిరిగిలేచాడని ప్రవచించారు. మానవాళి రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన క్రీస్తు బోధనలు ఆచరణీయం అన్నారు. ప్రేమ,దయ,శాంతి, క్షమలను తెలియజేసిన క్రీస్తు మార్గాన్ని అనుసరించాలని చెప్పారు. స్త్రీల సమాజం సభ్యులు, సండే స్కూల్ పిల్లలు, యూత్ సభ్యులు ప్రత్యేక గీతాలను ఆలపించారు.చర్చి అడహక్ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.ప్రార్ధనల అనంతం భక్తులకు పలహారాలను పంపిణీ చేసారు. టౌన్ చర్చితో పాటు ఐతానగర్, చెంచుపేట, హయ్యర్ పేట, కొత్తపేట, మారీసుపేట, ముత్తెంశెట్టిపాలెం, చినరావూరు, చినరావూరుతోట, అమరావతి ప్లాట్స్, నందులపేట తదితర ప్రాంతాల్లోని లూధరన్, ఆర్ సిఎం, బాప్టిస్టు, రక్షణ సైన్యం తదితర చర్చీల్లో ఈస్టర్ పండుగను ఘనంగా నిర్వహించారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...