Skip to main content

Posts

Showing posts from June, 2021

పలునిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి

 పలునిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని ప్రకాశం బ్యారేజి కృష్ణ కరకట్టపై ఉన్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం పంపింగ్ స్టేషన్ వద్ద కృష్ణ కరకట్ట రోడ్డు విస్తరణ, కరకట్ట బలోపేతం చేయడం, కృష్ణ అవుట్ ఫాల్, స్లుయిచ్ వద్ద డబల్ వంతెన నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్సైటీ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నారాయణ స్వామి, రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర పురపాలక, పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర గృహ నిర్మాణ, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తో కలసి శంఖుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. శంఖుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, జ...

క‌రోనా క‌ష్ట కాలంలో జ‌ర్న‌లిస్టు కుటుంబాల‌ను ఆదుకోవాలి

 క‌రోనా క‌ష్ట కాలంలో జ‌ర్న‌లిస్టు కుటుంబాల‌ను ఆదుకోవాలి *దూర‌ద‌ర్శ‌న్ విజ‌య‌వాడ డిప్యూటీ డైరెక్ట‌ర్ ర‌త్నాక‌ర్‌* డిప్యూటీ డైరెక్ట‌ర్‌, న్యూస్ ఎడిట‌ర్‌ల‌ను స‌త్క‌రించిన ఏపీబిజేఏ రాష్ట్ర నాయ‌కులు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: క‌రోనా క‌ష్ట స‌మ‌యంలో జ‌ర్న‌లిస్టుల‌ను ఆదుకోవాల్సిన అత్య‌వ‌స‌రం ఉంద‌ని దూర‌ద‌ర్శ‌న్ విజ‌య‌వాడ డిప్యూటీ డైరెక్ట‌ర్ ర‌త్నాక‌ర్ అన్నారు. క‌రోనాతో మృతి చెందిన జ‌ర్నలిస్టుల కుటుంబాల‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అందించే ప‌రిహారాల‌ను అందుకునేలా జ‌ర్న‌లిస్టు సంఘాలు కృషి చేయాల‌ని కోరారు. విజ‌య‌వాడ‌లో దూర‌ద‌ర్శ‌న్ కేంద్రంలో ఆ శాఖ డి.డి. ర‌త్నాక‌ర్ ను ఏపీ బ్రాడ్ కాస్టింగ్ జ‌ర్న‌లిస్టుల సంఘం స‌త్క‌రించింది. కోవిడ్ స‌మ‌యంలో గ్రామీణ ప్రాంతాల వారికి సైతం అవ‌గాహన క‌లిగేలా, కోవిడ్ నియ‌మాల‌ను వివ‌రిస్తున్న డి.డి. న్యూస్ ను అభినందిస్తూ, కోవిడ్ వారియ‌ర్ గా డిప్యూటీ డైరెక్ట‌ర్ ర‌త్నాక‌ర్ ను, న్యూస్ ఎడిట‌ర్ శ్రీనివాస్‌ను ఏపీబిజెఏ స‌న్మానించింది. ఈ సంద‌ర్భంగా డి.డి. ర‌త్నాక‌ర్ మాట్లాడుతూ క‌రోనా బాధిత జ‌ర్న‌లిస్టు కుటుంబాల‌ను ఆదుకునేందుకు వారితో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ రాయితీల‌కు...

డబ్బింగ్ రంగంలో బోలెడు అవకాశాలు : ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ స్వర్ణలత.

 డబ్బింగ్ రంగంలో బోలెడు అవకాశాలు  : ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్  స్వర్ణలత.  సరైన అవగాహన, రంగం పట్ల ఆసక్తి ఉంటే డబ్బింగ్ లో చాలా అవకాశాలు ఉన్నాయని ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ , స్పోర్ట్స్ కామెంటేటర్ జె.ఎస్. స్వర్ణలత అన్నారు. తన ప్రయాణం లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్న తరువాతే సరైన గుర్తింపు లభించిందని తెలిపారు. ఫిలిం అండ్ టెలివిజిన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హైదరాబాద్ ఏర్పాటు చేసిన స్పెషల్ వర్క్ షాప్ లో ఆమె పాల్గొన్నారు. కాబోయే డబ్బింగ్  ఆర్టిస్టులతో మాట్లాడి వాళ్ళకి సరైన గైడెన్స్ అందించారు. . ఈ వర్క్ షాప్ లో భాగంగా విద్యార్థులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు. జూమ్ సెషన్ ఆన్లైన్లో జరిగిన ఈ కార్యక్రమం లో దాదాపు 70 మందికి పైగా  పాల్గొన్నారు. భవిష్యత్ డబ్బింగ్ ఆర్టిస్ట్ లు తమకు ఈ వర్క్ షాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.  ఈ కార్యక్రమం లో FTIH సీఈఓ ఉదయ్ కిరణ్ కటకం, FTIH  కల్చరల్ సెక్రటరీ & పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫాకల్టీ హర్షవర్ధన్ రెడ్డి , ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు.

ఏపీ కేబినెట్ నిర్ణయాలు

 ఏపీ కేబినెట్ నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ ల కొనుగోలుకు మంత్రివర్గం ఆమోదం.. నవరత్నాల్లో భాగంగా 28లక్షల ఇళ్ల నిర్మాణానికి భారీ ప్రచార కార్యక్రమం. 9 నుంచి 12 వతరగతి విద్యార్ధులకు ల్యాప్ టాప్ ల పంపిణీకి ఆమోదముద్ర. ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి వర్సిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. విజయనగరం జేఎన్ టీయూ ఇంజనీరింగ్ కళాశాలను వర్సిటీగా మార్పుకు ఆమోదం. జేఎన్ టీయూ చట్టం 2008 సవరణకు అంగీకారం తెలిపిన మంత్రివర్గం. టిడ్కో ద్వారా 2,62,216 ఇళ్ల నిర్మాణం పూర్తికి మంత్రివర్గం ఆమోదం. మౌలిక సదుపాయల కల్పనకు రూ.5990 కోట్ల మేర బ్యాంకు రుణం హామీకి ఆమోదం. 2021-24 ఐటీ విధానానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం. కాకినాడ పోర్టులో రీ గాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుపై చర్చ. మారిటైమ్ బోర్డుతో సంయుక్త కార్యకలాపాల నిర్వహణకు అనుమతి. రీసర్వే పట్టాదారులకు ధ్రువపత్రాల జారీకి భూహక్కు చట్ట సవరణకు ఆమోదం. విశాఖ నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్ భూ కేటాయింపునకు ఆమోదం. 81 ఎకరాల భూ కేటాయింపుకు అంగీకారం తెలిపిన మంత్రివర్గం . పుట్టపర్తి నియోజకవర్గానికి రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు కింద నీటి సరఫరా. తొలిదశ కింద ఎత్త...

జపాన్, టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌కు ఆంధ్రప్రదేశ్‌ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న ఒలింపియన్స్‌ పి.వి సింధు, ఆర్‌. సాత్విక్‌ సాయిరాజ్, రజనీలకు విషెష్‌ చెప్పిన సీఎం వైఎస్‌ జగన్‌

 జులై 23, 2021 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్‌ టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌కు ఆంధ్రప్రదేశ్‌ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న ఒలింపియన్స్‌ పి.వి సింధు, ఆర్‌. సాత్విక్‌ సాయిరాజ్, రజనీలకు విషెష్‌ చెప్పిన సీఎం వైఎస్‌ జగన్‌ .

ప్రైమ్ పిక్చర్ 5లో ప్రేయసి రావే చిత్రం విడుదల

  మీనాక్షి క్రియేషన్స్ పతాకంపై జె డి .ప్రసాద్ నిర్మాతగా, ఎ.శ్రీనివాస్ సహా నిర్మాత గా రూపొందిన చిత్రం” ప్రేయసిరావే”ఇప్పటికే ఊర్వశి ఎటిటి లో విడుదలయ్యి విజయవంతం కాగా జూన్ 25నుండి ప్రైమ్ పిక్చర్ 5లో కూడా జనాధరణ పొందిందని నిర్మాత సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం : రాజ సుందర్ నూతలపాటి.

వన్ టౌన్ సి. ఐగా బాధ్యతలు స్వీకరించిన కె. చంద్రశేఖర్

 వన్ టౌన్ సి. ఐగా బాధ్యతలు స్వీకరించిన కె. చంద్రశేఖర్ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి వన్ టౌన్ సి. ఐ గా  కొమ్మాలపాటి చంద్రశేఖర్ మంగళవారం ఉదయం  బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రథమంగా తెనాలి పట్టణం లో కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా తగినచర్యలు తీసుకుంటామన్నారు. మహిళల రక్షణకోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ ఆప్ ను తీసుకువచ్చింది యాప్ పై మహిళలకు అవగాహన కల్పిస్తామన్నారు. మహిళల రక్షణ ద్యేయం గా పనిచేస్తామన్నారు. పై అధికారుల సూచనల మేరకు తెనాలి ప్రాత శాంతి భద్రతలకు బాధ్యతగా పనిచేస్తామన్నారు. గతం లో లా అండ్ ఆర్డర్ విభాగం తో పాటు ఇంటెలీజెన్స్, పోలీస్ ట్రెనింగ్ కళాశాలలో పనిచేసినట్లు తెలిపారు. స్టేషన్ సిబ్బంది సి. ఐ గా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్ ను స్వాగతించి అభినందనలు తెలిపారు.

నూతన నటీ, నటులకు ఆహ్వానం

 

కొత్త ఆలోచనలతో, సరికొత్త కథలతో యువ రచయితలు ముందుకు రావాలి

కొత్త ఆలోచనలతో, సరికొత్త కథలతో యువ రచయితలు ముందుకు రావాలి - ప్రముఖ సినీ దర్శకులు, రచయిత నల్లపూసలు బాబ్జీ  టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: కొత్త ఆలోచనలతో, సరికొత్త కథలతో యువ రచయితలు ముందుకు రావాలని ప్రముఖ సినీ దర్శకులు, రచయిత నల్లపూసలు బాబ్జీ అన్నారు. సౌత్ ఇండియా లో నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ గా పేరుగాంచిన ఫిఫ్త్ ( ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హైదరాబాద్ ) లో జరిగిన కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా నిర్వహించిన స్పెషల్ వర్క్ షాప్ ఆన్ స్క్రిప్ట్ రిజిస్ట్రేషన్ అనే అంశంపై ఆయన మాట్లాడారు. సినిమా కథల రిజిస్ట్రేషన్ విధానం, కాపీ రైట్స్ హక్కుల గురించి వివరించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. సినిమాను సినిమాలా చూడడం కాదని, పుస్తకంలా చదవాలన్నారు. వెండితెరపై తమను తాము ఆవిష్కరించుకునే వరకు అలుపెరుగని పోరాటం చేయాలని , సినీరంగంలో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని సినీ పరిశ్రమలో పైకి రావాలన్నారు.ఫిఫ్త్ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. సంస్థ క్రమశిక్షణ, నిర్వహణా పద్ధతులు, బోధనా విధానం తనకు ఎంతగానో నచ్చిందన్న...

తెనాలి కళాకీర్తి విశ్వవ్యాప్తం కావాలి

 

ఏపీ ప్రభుత్వం మరో నూతన పధకం

 ఎస్సీ సామాజవర్గానికి చెంది, 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగి, కుటుంబ పోషణ ఆధారపడివున్న వ్యక్తులు ఇటీవల కాలం లో మరణించి ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించనున్నట్లు నూతనం గా జీఓ విడుదల చేసింది. ఆ విధంగా మరణించిన కుటుంబ సభ్యులకు 5లక్షలవరకూ ఆర్థిక సహాయం పొందవచ్చునని జీ ఓ లో పేర్కొంది. సహాయం కోసం ఆయా వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది. ఆయా జిల్లాల కలెక్టర్ల కు ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం దేశాలను జారీ చేసింది. - Talent express news Talentexpress.page

కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌తో ముఖ్యమంత్రి భేటీ

కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌తో ముఖ్యమంత్రి భేటీ * * రైల్ భవన్ లో కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ ను కలిసిన ముఖ్యమంత్రి  వైయస్.జగన్ * * న్యూఢిల్లీ: * * –కేంద్ర రైల్వే, వాణిజ్య–పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియ ప్రజాపంపిణీ శాఖలమంత్రి పియూష్‌గోయల్‌తో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ భేటీ. * – కోవిడ్‌ కారణంగా తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుందని వివరించిన సీఎం. – మరో రెండు నెలలపాటు ఉచితంగా బియ్యం పంపిణీని కేంద్రం పొడిగించినందుకు ధన్యవాదాలు తెలిపిన సీఎం. – 2015 డిసెంబర్‌ వరకూ జాతీయ ఆహార భద్రతా చట్టంకింద ఏపీలో 1.29 కోట్ల రేషన్‌కార్డులకు 1,85,640 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ప్రతినెలా కేటాయిస్తున్నారని తెలిపిన సీఎం. – 2015 డిసెంబర్‌ తర్వాత 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో 60.96శాతం కుటుంబాలకు, పట్టణాలు–నగరాల్లో 41.14 శాతం కుటుంబాలకు మాత్రమే పరిమితంచేసి, బియ్యం ఇచ్చేలా సూత్రాన్ని అమలు చేస్తున్నారన్న సీఎం. – దీనివల్ల కేవలం 0.91 కోట్ల రేషన్‌ కార్డులకే బియ్యం పంపిణీని పరిమితం చేశారని, కేటాయింపులను 1,85,640 మె...

బంగాళాఖాతం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది

*తూర్పు, ఈశాన్య బంగాళాఖాతం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది..* ◆దీని ప్రభావంతో శుక్రవారం వాయవ్య బంగాళాఖాతం పరసరాల్లో అల్పపీడనం ఏర్పడనున్నది.  *తదుపరి 24 గంటల్లో ఇది మరింత బలపడి, తీవ్ర అల్పపీడనంగా మారనుంది..పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ, ఒడిసా మీదుగా పయనిస్తుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది..* *రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో ఈ నెల 14 వరకు ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది..*  - ప్రేమకుమార్ ◆దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని పేర్కొంది.  *నాలుగురోజుల పాటు కోస్తా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం సూచించింది..*

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున భేటీ

 మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున భేటీ.  వేమూరు నియోజకవర్గంలో ఇరిగేషన్, డ్రైనేజీ పనులు పురోగతిని ఆయనకు వివరించి, అనంతరం జరగవలసిన అభివృద్ధి పనులను మంత్రి తో చర్చించిన ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున.