కరోనా కష్ట కాలంలో జర్నలిస్టు కుటుంబాలను ఆదుకోవాలి
*దూరదర్శన్ విజయవాడ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్*
డిప్యూటీ డైరెక్టర్, న్యూస్ ఎడిటర్లను సత్కరించిన ఏపీబిజేఏ రాష్ట్ర నాయకులు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: కరోనా కష్ట సమయంలో జర్నలిస్టులను ఆదుకోవాల్సిన అత్యవసరం ఉందని దూరదర్శన్ విజయవాడ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ అన్నారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పరిహారాలను అందుకునేలా జర్నలిస్టు సంఘాలు కృషి చేయాలని కోరారు. విజయవాడలో దూరదర్శన్ కేంద్రంలో ఆ శాఖ డి.డి. రత్నాకర్ ను ఏపీ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్టుల సంఘం సత్కరించింది. కోవిడ్ సమయంలో గ్రామీణ ప్రాంతాల వారికి సైతం అవగాహన కలిగేలా, కోవిడ్ నియమాలను వివరిస్తున్న డి.డి. న్యూస్ ను అభినందిస్తూ, కోవిడ్ వారియర్ గా డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ ను, న్యూస్ ఎడిటర్ శ్రీనివాస్ను ఏపీబిజెఏ సన్మానించింది. ఈ సందర్భంగా డి.డి. రత్నాకర్ మాట్లాడుతూ కరోనా బాధిత జర్నలిస్టు కుటుంబాలను ఆదుకునేందుకు వారితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రాయితీలకు విధిగా దరఖాస్తులు చేయించాలని సూచించారు. ఏపీబీజేఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.మీరాహుస్సేన్ఖాన్ మాట్లాడుతూ తమ సంఘం ద్వారా ఇప్పటికే జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. కరోనా బాధిత కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన రాయితీలు సత్వరం అందేలా కృషి చేస్తామన్నారు. కరోనా మృతుల కుటుంబాలకు కేంద్రం అందించే రూ.5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందేలా అందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జర్నలిస్ట్ కుటుంబాలకు ఏపి బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ నిరంతరంగా అండగా ఉంటుందని మీరాహుస్సేన్ వివరించారు. డిడి రత్నాకర్ను, న్యూస్ ఎడిటర్ను శ్రీనివాస్లను సత్కరించిన వారిలో సీనియర్ జర్నలిస్ట్, ఏపిబిజేఏ రాష్ట్ర నాయకులు జేఎస్కె శ్రీనివాసాచారి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గ్రామీణ విలేకరుల సంఘం కన్వీనర్ లాల్అహ్మద్గౌస్, ఫెడరేషన్ జిల్లా నాయకులు ఆకుల వెంకట నారాయణ, జర్నలిస్ట్ సంఘ నాయకులు పఠాన్ సైదాఖాన్, పంగులూరి వెంకట్రావ్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్, ఏపిబీజేఏ రాష్ట్ర నాయకులు జేఎస్కె శ్రీనివాసాచారిని దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్, సంఘ రాష్ట్ర నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.