Skip to main content

క‌రోనా క‌ష్ట కాలంలో జ‌ర్న‌లిస్టు కుటుంబాల‌ను ఆదుకోవాలి

 క‌రోనా క‌ష్ట కాలంలో జ‌ర్న‌లిస్టు కుటుంబాల‌ను ఆదుకోవాలి


*దూర‌ద‌ర్శ‌న్ విజ‌య‌వాడ డిప్యూటీ డైరెక్ట‌ర్ ర‌త్నాక‌ర్‌*

డిప్యూటీ డైరెక్ట‌ర్‌, న్యూస్ ఎడిట‌ర్‌ల‌ను స‌త్క‌రించిన ఏపీబిజేఏ రాష్ట్ర నాయ‌కులు

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: క‌రోనా క‌ష్ట స‌మ‌యంలో జ‌ర్న‌లిస్టుల‌ను ఆదుకోవాల్సిన అత్య‌వ‌స‌రం ఉంద‌ని దూర‌ద‌ర్శ‌న్ విజ‌య‌వాడ డిప్యూటీ డైరెక్ట‌ర్ ర‌త్నాక‌ర్ అన్నారు. క‌రోనాతో మృతి చెందిన జ‌ర్నలిస్టుల కుటుంబాల‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అందించే ప‌రిహారాల‌ను అందుకునేలా జ‌ర్న‌లిస్టు సంఘాలు కృషి చేయాల‌ని కోరారు. విజ‌య‌వాడ‌లో దూర‌ద‌ర్శ‌న్ కేంద్రంలో ఆ శాఖ డి.డి. ర‌త్నాక‌ర్ ను ఏపీ బ్రాడ్ కాస్టింగ్ జ‌ర్న‌లిస్టుల సంఘం స‌త్క‌రించింది. కోవిడ్ స‌మ‌యంలో గ్రామీణ ప్రాంతాల వారికి సైతం అవ‌గాహన క‌లిగేలా, కోవిడ్ నియ‌మాల‌ను వివ‌రిస్తున్న డి.డి. న్యూస్ ను అభినందిస్తూ, కోవిడ్ వారియ‌ర్ గా డిప్యూటీ డైరెక్ట‌ర్ ర‌త్నాక‌ర్ ను, న్యూస్ ఎడిట‌ర్ శ్రీనివాస్‌ను ఏపీబిజెఏ స‌న్మానించింది. ఈ సంద‌ర్భంగా డి.డి. ర‌త్నాక‌ర్ మాట్లాడుతూ క‌రోనా బాధిత జ‌ర్న‌లిస్టు కుటుంబాల‌ను ఆదుకునేందుకు వారితో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ రాయితీల‌కు విధిగా ద‌ర‌ఖాస్తులు చేయించాల‌ని సూచించారు. ఏపీబీజేఏ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు పి.మీరాహుస్సేన్‌ఖాన్‌ మాట్లాడుతూ త‌మ సంఘం ద్వారా ఇప్ప‌టికే జ‌ర్న‌లిస్టుల సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌న్నారు. క‌రోనా బాధిత కుటుంబాల‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి రావాల్సిన రాయితీలు స‌త్వ‌రం అందేలా కృషి చేస్తామ‌న్నారు. క‌రోనా మృతుల కుటుంబాల‌కు కేంద్రం అందించే రూ.5 ల‌క్ష‌ల రూపాయ‌ల ఎక్స్ గ్రేషియా అందేలా అంద‌రూ ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. జ‌ర్న‌లిస్ట్ కుటుంబాల‌కు ఏపి బ్రాడ్‌కాస్ట్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ నిరంత‌రంగా అండ‌గా ఉంటుంద‌ని మీరాహుస్సేన్ వివ‌రించారు. డిడి ర‌త్నాక‌ర్‌ను, న్యూస్ ఎడిట‌ర్‌ను శ్రీ‌నివాస్‌ల‌ను స‌త్క‌రించిన వారిలో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్, ఏపిబిజేఏ రాష్ట్ర నాయ‌కులు జేఎస్‌కె శ్రీ‌నివాసాచారి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్ట్ ఫెడ‌రేష‌న్ గ్రామీణ విలేక‌రుల సంఘం క‌న్వీన‌ర్ లాల్అహ్మ‌ద్‌గౌస్‌, ఫెడ‌రేష‌న్ జిల్లా నాయ‌కులు ఆకుల వెంక‌ట నారాయ‌ణ‌, జ‌ర్న‌లిస్ట్ సంఘ నాయ‌కులు ప‌ఠాన్ సైదాఖాన్‌, పంగులూరి వెంక‌ట్రావ్ చౌద‌రి, త‌దిత‌రులు పాల్గొన్నారు. అనంత‌రం సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్, ఏపిబీజేఏ రాష్ట్ర నాయ‌కులు జేఎస్‌కె శ్రీ‌నివాసాచారిని దూర‌ద‌ర్శ‌న్ డిప్యూటీ డైరెక్ట‌ర్‌, సంఘ రాష్ట్ర నాయ‌కులు శాలువాల‌తో ఘ‌నంగా స‌త్క‌రించారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...