Skip to main content

Posts

Showing posts from July, 2021

నేడు ప్రముఖ నటుడు, దర్శకుడు, ప్రయోక్త డి.ఎస్.దీక్షిత్ జయంతి

కళాదీపికాంజలి! ●●●●●●●●●● ఈరోజు... ప్రముఖ నటుడు, దర్శకుడు, ప్రయోక్త డి.ఎస్.దీక్షిత్ గారి 28-7-1956  ◆ 18-2-2019 జయంతి. ●●●●●క●ళా●దీ●పి●క●●●●● "న‌ట‌న కాదు..వ‌రం..!" -డి.ఎస్.దీక్షిత్ ◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆ తెలుగునాటకం అనే మాట విన్నప్పుడు, అన్నప్పుడు ఎంత గాంభీర్యంగా ఉంటుందో.. అంతకుమించి సమాజం కోసం లెక్కలేనన్ని బాధ్యతల్నీ ఎన్నో ఏళ్ళుగా తెలుగునాటకం తన భుజాన మోస్తూ వస్తుందనేదీ అక్షర సత్యం.  నాటకం అంటేనే సమ్మోహన కళ. ఆ సమ్మోహనంలో  చైతన్యాన్ని నింపే సుగంధ కవనాలు, రసరమ్య గమనాలెన్నో. అందుకే 'నాటక కళ' సమాజాన్ని  ప్రభావితం చేసే అత్యుత్తమమైన కళల్లో ఒకటయ్యింది. తెలుగు నాటకానికి ఇంతటి ఘనమైన చరిత్రే ఉంది. కళారూపంగానే కాదు, మనో, వైజ్ఞానిక, కళావికాసానికి గళమెత్తిన ఎందరో మేటి నటుల్ని, భవిష్యత్‌ దార్శనికుల్ని తెలుగు నాటకం ఈ సమాజానికి అందించింది.  అలా నాటక కళ కోసం..  నాటకరంగం కళకళలాడటం కోసం..  తనంతట తానుగా, తనతో అనేకమందిగా,  నటకులానికే వారథిగా, జీవితాంతం బతికినవాడే  డిఎస్‌ దీక్షిత్‌ మాష్టార్‌..  అలియాస్‌ దీవి శ్రీనివాసా దీక్షిత్‌.  డిఎస్‌ దీక్షిత్...

ad

ad

వివేక విద్యా సంస్థల కీర్తి స్ఫూర్తిదాయకం

వివేక విద్యా సంస్థల కీర్తి స్ఫూర్తిదాయకం    - శ్రమతోనే విజయాలు దక్కుతాయి     ప్రతిభ చూపినవివేకసంస్థల విద్యార్థులను                 అభినందించిన   - ఎమ్మెల్యే శివకుమార్  టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్, తెనాలి: ప్రతి విజయం వెనుక శ్రమ దాగి ఉందని, నిరంతర సాధనతోనే లక్ష్యాలు సాధించగలరని తెనాలి శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. స్థానిక వివేక విద్యాసంస్థల ఆధ్వర్యంలో మంగళవారం ఇటీవల ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన వివేక విద్యార్థుల అభినందన సభ జరిగింది. సభలో ముఖ్యఅతిధిగా అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం దక్కించుకున్న వివేక విద్యా విద్యార్థిని అమృత భార్గవికి ప్రశంసలు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్ కోసం కళాశాలల ఎంపిక కీలకమని దీనిలో తల్లిదండ్రుల పాత్ర ప్రధానమని అభిప్రాయ పడ్డారు. గడచిన ఏడు సంవత్సరాలుగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న వివేక విద్యాసంస్థలను, డైరెక్టర్ రావిపాటి వీరనారాయణలను అభినందించారు. కేవలం ...

న్యాయవాదులకు ప్రాక్టీస్ సర్టిఫికెట్లు మరియు ఐడి కార్డుల పంపిణీ...

న్యాయవాదులకు ప్రాక్టీస్ సర్టిఫికెట్లు మరియు ఐడి కార్డుల పంపిణీ... తెనాలి బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కొత్తపేట కోర్టు ప్రాంగణంలోని తెనాలి బార్ అసోసియేషన్ హాలు నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ వారు జారీ చేసిన ప్రాక్టీస్ సర్టిఫికెట్స్ మరియు ఐడి కార్డులను న్యాయవాదులకు పంపిణీ చేశారు. కార్యక్రమానికి రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు సోమశని బ్రహ్మానంద రెడ్డి  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు  దాసరి శ్రీధర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి బ్రహ్మానంద రెడ్డి ప్రసంగిస్తూ  న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం బార్ కౌన్సిల్ ప్రయత్నిస్తోందని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో  న్యాయస్థానాలు  పని పనిచేయని కారణంగా పలువురు న్యాయవాదులు సమస్యలు ఎదుర్కొంటున్నారని వారికి బ్యాంకుల ద్వారా పర్సనల్ లోన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టామని త్వరలోనే  కార్యరూపం దాలుస్తుందని తెలిపారు. సర్టిఫికెట్లు మరియు ఐడి కార్డులు న్యాయవాదులకు చాలా ఉపయుక్తంగా ఉంటాయని నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని గుర్తించటం కోసం భారత బార్ కౌన్సిల్ ఈ విధానాన్ని రూపొం...

దిశా యాప్ తో రక్షణ పొందండి......ఎస్ఐ టి.అనిల్ కుమార్.

దిశా యాప్ తో రక్షణ పొందండి... ...ఎస్ఐ టి.అనిల్ కుమార్. స్థానిక 20 వ వార్డ్ లో ని మహిళలకు సోమవారం 1 టౌన్ ఎస్ఐ అనిల్ కుమార్ దిశా యాప్ గురించి, యాప్ వలన మహిళలకు కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. ప్రతి మహిళా తన ఫోన్ లో దిశా యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయాలలో పోలీసుల నుండి రక్షణ పొందాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమములో 20 వ వార్డు వైఎస్ఆర్ సిపి ఇంచార్జ్ కొల్లా గురునాద్ గుప్తా సచివాలయం సిబ్బంది వాలెంటీర్లు పాల్గొన్నారు.

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: జర్నలిస్టులకు ఉద్యోగులతోపాటు ఇళ్ల స్థలాలు కేటాయించే విషయం ప్రభుత్వం పరిశీలిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ  ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కు హామీ ఇచ్చారు. కోవిడ్ తో మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు జర్నలిస్టులతో పాటు ఇళ్ళ స్థలాలను కేటాయిస్తామని ఈ విషయం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉన్నదని ఆయన హామీ ఇచ్చారు.  సోమవారం ఆయనను కలిసిన ప్రతినిధివర్గం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి వివరించింది.పత్రికలకు అక్రిడిటేషన్ కేటాయింపుల్లో తగిన ప్రాధాన్యం ఇస్తామని, చిన్న పత్రికలకు న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆరోగ్య బీమా విషయంలో అక్రిడేషన్లు మంజూరైన తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన  చెప్పారు. ఈరోజు ఎపిడబ్ల్యుజెఎఫ్ ప్రతినిధివర్గం ఆయనను కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించింది. అంతకుముందు ప్రతినిధి వర్గం సమాచార శాఖ కమిషనర్ టి.విజయకుమార్ రెడ్డిని కలిసి జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేసింది. జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేయవలసిన వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ ...

ఫిలిం క్రిటిక్స్ అసోసియేష‌న్ నూత‌న కార్య‌వ‌ర్గానికి మెగాస్టార్ చిరంజీవి శుభాభినంద‌న‌లు

ఫిలిం క్రిటిక్స్ అసోసియేష‌న్ నూత‌న కార్య‌వ‌ర్గానికి మెగాస్టార్ చిరంజీవి శుభాభినంద‌న‌లు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఆదివారంనాడు ఎంపికైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి సోమ‌వారంనాడు మెగాస్టార్ చిరంజీవి శుభాభినందనలు తెలియ‌జేశారు. అధ్య‌క్షునితోపాటు కార్య‌వ‌ర్గ‌స‌భ్యుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. చిరంజీవిగారు ముందుగా అధ్య‌క్షుడు ప్ర‌భుకి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అలాగే మిగిలిన క‌మిటీ స‌భ్యుల‌కు నా శుభాకాంక్ష‌లు తెలియ‌జేయండ‌ని తెలిపారు. ఇంకా ఆయ‌న మాట్లాడుతూ, అధ్య‌క్షులైన మీరు (ప్ర‌భు) ఇదొక మంచి అవ‌కాశంగా భావించి మీ వాళ్ళంద‌రికీ మంచి చేయ‌డానికీ, వారి సంక్షేమం కోసం మీ సేవ‌లు అందించ‌డానికి ప్ర‌య‌త్నం చేయండి. దానికి ఇదో చ‌క్క‌ని అవ‌కాశం. స‌ద్వినియోగ ప‌ర‌చుకోండి. ప‌ద‌వి అలంకారం కాకుండా బాధ్య‌త‌గా ప‌నిచేయండి. ప‌దిమందికి ఉప‌యోగ‌ప‌డండి. త‌ద్వారా మాన‌సిక ఆనందం ఎంత వుంటుందో ఊహించ‌లేరు. అలాగే నా మిత్రులైన మిగిలిన వారంతా మీ మార్కు సేవ‌లు అందించండి. ఎలాంటి విమ‌ర్శ‌ల‌కు తావులేకుండా అంద‌రికీ త‌ల‌లో నాలుక‌లా వుండాల‌నీ, వుంటార‌ని అనుకుంటున్నాను. అని శుభాభినంద‌న‌...

ad

29న రెండో విడత విద్యాదీవెన

29న రెండో విడత విద్యాదీవెన టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: జగనన్న విద్యాదీవెన పథకం(ఫీజు రీయింబర్స్ మెంట్)లో భాగంగా ఈ నెల 29న రెండో విడత నగదును తల్లుల ఖాతాల్లో రాష్ట్రప్రభుత్వం జమచేయనుంది. పాలిటెక్నిక్, డిగ్రీ, ఐటీఐ, బిటెక్, బీఫార్మసీ, ఎంబిఎ, ఎంసిఎ, ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కళాశాలకు చెల్లించాల్సిన ఫీజుల మొత్తాన్ని మూడు నెలలకొక్కసారి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి విడత కింద 10,88,439 మంది విద్యార్థులకు రూ.67145కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాలో ఏప్రిల్ 19న ప్రభుత్వం జమచేసింది. ఈ పథకం రెండో విడత కింద సుమారు 10.97 లక్షల మంది విద్యార్ధులకు రూ. 693.81కోటు చెల్లించాల్సి ఉంది. ఈ నెల 29వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.  2019-20 విద్యాసంవత్సరంలో విద్యార్ధిని, విద్యార్థులు ఏదైనా కళాశాలకు ఫీజు చెల్లించి ఉంటే, ఆ మొత్తాన్ని కళాశాలలు తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. కళాశాల యాజమాన్యాలు ఇవ్వని పక్షంలో 1902 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే ప్రభు...

పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్, 25 జూలై 2021: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును  గ్రామస్థాయిలో పరిశీలించి వాటిలో సమస్యలను సమస్యలను పరిష్కారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి గురజాల మండలం పులిపాడు గ్రామంలోని ఆదర్శ మండల పరిషత్‌ పాఠశాలలో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలలో సమస్యలను జిల్లా స్థాయి అధికారులు గ్రామస్థాయికి వెళ్ళి పరిష్కారించేందుకు పల్లెనిద్ర కార్యక్రమంని జిల్లాలో తొలుత పులిపాడు గ్రామంతో ప్రారంభిస్తున్నామన్నారు. పల్లెనిద్ర కార్యక్రమంకు పండుగ వాతావరణం తీసుకువచ్చేలా భారీ స్థాయిలో గ్రామస్ధులు హాజరవటం సంతోషంగా ఉందన్నారు. గురజాల శాసనసభ్యులు కాసు మహేష్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నవరత్న పథకాలు చక్కగా అమలు జరుగుతున్నాయని, పధకాల అమలును గ్రామస్థాయిలో పరిశీలించి సమస్యలను...

అభిలాష చిత్రం పోస్టర్ లాంచ్

శ్రీ హరిహరధీర మూవీ మేకర్స్ పతాకంపై అమర్‌దీప్,అశ్విని రెడ్డి హీరోహీరోయిన్లుగా శివప్రసాద్ చలువాది దర్శకత్వంలో శ్రీమతి శిరీష నిర్మించిన చిత్రం ‘అభిలాష’. ‘లవ్ లైట్స్ ద లైఫ్’ అనేది ట్యాగ్‌లైన్. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమం ఇటీవల నెల్లూరులోని అనీల్ గార్డెన్సు లో నెల్లూరు జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ‘సాహో’ మూవీ డైరెక్టర్ సుజిత్ నాన్నగారైన గోపీనాధ్ రెడ్డి, ‘మేకసూరి’ మూవీ డైరెక్టర్ వెలిశిల త్రినాధ్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నగర అధ్యక్షుడు కేతంరెడ్డి వినోద్‌‌రెడ్డిలతో పాటు చిరంజీవి యువత, పవన్ కల్యాణ్ యువత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హాజరైన ప్రముఖులందరూ చిత్రం మంచి విజయం సాధించాలని, టీమ్‌లోని అందరికీ మంచిపేరు రావాలని అభిలాషించారు.అమర్‌దీప్ చౌదరి,, అశ్వినిరెడ్డి, బెల్లంకొండ వెంకట్, బాహుబలి ప్రభాకర్, కుమనన్ సేతు రామన్, సమ్మెట గాంధీ, అప్పాజీ అంబరీష,ఐ డ్రీమ్ అంజలి, గుండు సుదర్శన్, గుండు అశోక్ కుమార్, ఆంజనేయులు, రాకింగ్ రాకేష్, జబర్దస్త్ రాజమౌళి, చిట్టిబాబు, జలీల్ భాయ్ తదితర...

టోక్యో ఒలంపిక్స్ లో ఆదరకొట్టిన మేరికోమ్

టోక్యో ఒలంపిక్స్ లో ఆదరకొట్టిన భారత్ బాక్సర్ మేరీకోమ్  టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: టోక్యో ఒలింపిక్స్ లో ఈరోజు భారత బాక్సర్ మేరీకోమ్ అదరగొట్టింది. మహిళల ఫై వెయిట్ విభాగం (48-51 కేజీలు) రౌండ్-32 మ్యాచ్ లో మేరీకోమ్ ప్రత్యర్థిని చిత్తుచేసి రౌండ్-16లోకి అడుగుపెట్టింది.  డొమినికన్ రిపబ్లిక్ బాక్సర్ హెర్నాండేజ్ గార్షియా మిగులీనాను 4-1 పాయింట్లతో మేరీకోమ్ చిత్తుచేసింది. జులై 29న జరిగే తదుపరి మ్యాచ్ లో మేరీకోమ్ కొలంబియాకు చెందిన వాలెన్సియా విక్టోరియా ఇంగ్రిట్ లోరెనాతో తలపడనుంది. అందులోనూ గెలిస్తే క్వార్టర్ ఫైనల్స్ లో అడుగుపెడుతుంది.  - బి. సురేష్ బాబు,    స్పెషల్ కరస్పాండెంట్

73kg ల విభాగంలో భారత రెజ్లర్ ప్రియా మాలిక్ కు బంగారు పతకం

73kg ల విభాగంలో భారత రెజ్లర్ ప్రియా మాలిక్ కు బంగారు పతకం... కేవలం ఒలింపిక్ గేమ్స్ లో మాత్రమే కాదు, ప్రపంచంలో నిర్వహిస్తున్న వివిధ పోటీలలో భారతీయ మహిళలు సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నారు. తాజాగా భారత్ కు చెందిన హర్యానా రాష్ట్ర రెజ్లింగ్ క్రీడాకారిణి ప్రియా మాలిక్ హంగేరీ దేశంలోని బుడాపెస్ట్ లో జరుగుతున్న ప్రపంచ క్యాడేట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో 73 kg. ల విభాగంలో 5-0 తో బరిలో ప్రత్యర్థి బెలారస్ ను ఓడించి బంగారు పతాకాన్ని సాధించి భారత ప్రతిష్ఠను ఇనుమడింపచేశారు. దేశవ్యాప్తంగా ప్రియా మాలిక్ పై  ప్రశంసలు వెల్లువెత్తు తున్నాయి. ... టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: కేవలం ఒలింపిక్ గేమ్స్ లో మాత్రమే కాదు, ప్రపంచంలో నిర్వహిస్తున్న వివిధ పోటీలలో భారతీయ మహిళలు సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నారు. తాజాగా భారత్ కు చెందిన హర్యానా రాష్ట్ర రెజ్లింగ్ క్రీడాకారిణి ప్రియా మాలిక్ హంగేరీ దేశంలోని బుడాపెస్ట్ లో జరుగుతున్న ప్రపంచ క్యాడేట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో 73 kg. ల విభాగంలో 5-0 తో బరిలో ప్రత్యర్థి బెలారస్ ను ఓడించి బంగారు పతాకాన్ని సాధించి భారత ప్రతిష్ఠను ఇనుమడింపచేశారు. దేశవ్యాప్తంగ...

రంగస్థల ప్రముఖులు మొదలి నాగభూషణ శర్మ

*మొదలి నాగభూషణ శర్మ* (గుంటూరు జిల్లా, ధూళిపూడి  జూలై 24, 1935 - జనవరి 15, 2019) రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక రచయిత, అధ్యాపకుడు, విమర్శకుడు, పరిశోధకుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ ఆంగ్ల సాహిత్య పట్టభద్రుడై నాగభూషణ శర్మ, అమెరికా లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో నాటకదర్శకత్వంలో ఎం.ఎఫ్.ఏ పట్టా పొందారు . నాటకమే ప్రధానాశంగా పరిశోధన చేసి డాక్టరేటు అందుకున్నాడు. ఆ తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు శాఖ లోను, నాటక శాఖ లోను ఆచార్యుడిగా పనిచేశారు  *రంగస్థల ప్రస్థానం* తండ్రి కూడా స్వయంగా నాటక రచయిత, ప్రయోక్త, కథా రచయిత. అతని స్ఫూర్తి వల్లనే నాగభూషణ శర్మ నాటకరంగంలోకి వచ్చారు . తండ్రి నేతృత్వంలో ఎనిమిదవ ఏటనే రంగస్థలంపై తొలిపాఠాలు నేర్చిన శర్మ కాలేజీ రోజుల్లో బందరులో కన్యాశుల్కం నాటకంలో మధురవాణి పాత్రను ధరించి పేరుపొందారు . కళాశాలలో చదువుతుండగానే ఆయన తొలి రచన అన్వేషణ 1954లో *భారతి* లో ప్రచురితమైంది. విదేశాలలో పర్యటించి, వివిధ నాటక ప్రయోగ రీతుల్ని అధ్యయనం చేసి శిక్షణ పొందారు . నవల, *నాటక సాహిత్యానికి చెందిన అనేక పరిశోధనాత్మక వ్యాసాలు* పత్రికల్లో ప్రకటించారు  ది...

యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ సినిమాలలో నటించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది

యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ సినిమాలలో నటించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది - ప్రముఖ సినీ నటులు శివాజీ రాజా. సినిమాలలో నటించాలంటే  ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకోవడం ఎంతో అవసరమని సినీ నటులు శివాజీరాజా తెలిపారు. సౌత్ ఇండియా లో నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ గా పేరుగాంచిన యఫ్. టి. ఐ. హెచ్. ( ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హైదరాబాద్ ) స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించిన కళ్ళు సినిమా ప్రీమియర్ షో కి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  కళ్ళు సినిమా విడుదలై ముప్ఫై మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా ఎఫ్. టి.ఐ.హెచ్.వారు శుక్రవారం ప్రసాద్ ల్యాబ్స్ లో కళ్ళు చిత్రాన్ని ప్రదర్శించారు.ఈ సందర్భంగా కళ్ళు చిత్రంలో హీరోగా నటించిన శివాజీ రాజా ఎఫ్. టి.ఐ.హెచ్.విద్యార్థులతో ఆ చిత్ర విశేషాలను పంచుకున్నారు. తొలిసారిగా కెమెరా ముందు నిల్చున్నప్పుడు తన కాళ్ళు వణకడం తనకు మాత్రమే తెలుసని, అయితే నటనలో తీసుకున్న శిక్షణ ఆ భయాన్ని అధిగమించి సినీరంగంలో నిలదొక్కుకునేలా చేసిందని ఆయన తెలిపారు.ఈ చిత్రం గురించి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు శివాజీరాజా సమాధానాలు ఇచ్చారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ మరియు...

కట్టెలు కొట్టిన చేతులు ఒలంపిక్ మెడల్ అందుకున్నాయి

కట్టెలు కొట్టిన చేతులు… ఒలంపిక్ మెడల్ అందుకున్నాయి చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను ఒలంపిక్స్! వాటిలో పాల్గొనడమే ఓ అద్భుతమైన విజయం. అలాంటిది పతకం దక్కించుకోవడం ఇంకెంత గర్వకారణమో కదా. ఆ సమయంలో జాతీయ గీతం మోగుతూ ఉంటే, ఒంటికి చుట్టుకున్న జెండా రెపరెపలాడుతుంటే… అంతకంటే గొప్ప ఉద్వేగాన్ని ఊహించగలమా! వంద కోట్లమంది భారతీయులు తల ఎత్తుకునే మన విజయాన్ని దేనితో అయినా పోల్చగలమా! అందుకే ఇవాళ మీరాబాయి సృష్టించిన చరిత్ర మనలో ప్రతి ఒక్కరికీ గర్వకారణం. ఆ ప్రస్థానం వెనుక ఉన్న ప్రయాణం మరింత స్ఫూర్తిదాయకం. 1994 ఆగస్టు 8న మణిపుర్ రాష్ట్రంలోని ఓ చిన్న గ్రామంలో జన్మించారు మీరాబాయి. తనది దిగువ మధ్యతరగతి కుటుంబం. కష్టపడి తీరాల్సిన బాల్యం. రోజూ కట్టెలు కొట్టుకుని వస్తే కానీ పొయ్యి వెలగదు. ఖాళీ డబ్బాలతో చెరువుల నుంచి నీళ్లు తెచ్చుకుంటే కానీ దాహం తీరదు. మీరాబాయి తన అన్నతో కలిసి ఆ పనులు చేసేది. మీరాబాయికి మొదటి నుంచి ఆటలు అంటే చాలా ఇష్టం. కాకపోతే వాటిలో కొట్లాటలు, బట్టలు మురికి చేసుకోవడం తనకు నచ్చేది కాదు. కాస్త హుందాగా కనిపించే ఆటలు ఆడాలనుకుంది. అలా వెయిట్ లిఫ్టింగ్ ఎంచుకుంది. కానీ ఆటలో పట్టు అంత తేలికగ...

ఆకలిని అక్షరాలతో అలంకరించిన జాఘవా

ఆకలిని అక్షరాలతో అలంకరించిన జాఘవా ౼౼౼ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గుర్రం జుషువా మరణించి 50 ఏళ్ళు పూర్తయింది. అంతకు ముందు ఒక యాభై ఏళ్ళ నుంచి ఆయన కవిత్వం రాశాడు. ఈ వందేళ్ళల్లో మన దేశంలో చాలా మార్పులొచ్చాయి. పేదరిక నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు పాలకులు. ఎన్ని పథకాలను ప్రవేశపెట్టినా ఇంకా పాత బతుకులు కొనసాగుతూనే వున్నాయి. 'భిక్షవర్షీయసి' లు కనిపిస్తూనే వున్నారు. అందుకే గుర్రం జాషువా మారని నాణెంగా ఇంకా మారిపోలేదు. ఆయన ప్రాసంగికత చెదిరిపోలేదు. ఆకలి, పేదరికం, వివక్ష, అణచివేత, అస్పృశ్యత, అసమానత వంటి అసాంఘిక, అమానవీయ సాంఘిక ఆర్థిక రాజకీయ ధోరణులు కొనసాగినంత కాలం జాషువా కవిగా మనల్ని ప్రశ్నిస్తూనే వుంటాడు. ''కనుపింపరాదన్న కరకుటాకటదూలి క్షుభితమౌ దీన భిక్షుక చయంబు'' (జాషువా- కాందిశీకుడు) ఆర్థిక అసమానత, శ్రమ దోపిడి, పాలక నిర్లక్ష్యం వంటి కారణాల చేత ఆకలి వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ కారణాలతోనే తిరుగుబాట్లు కూడా వస్తాయి. బాధ్యత నెరిగిన రాజకీయ వ్యవస్థ ఆకలి లేని సమాజాన్ని నిర్మించుకోవాలి. ఆకలి ఏ దేశానికైనా తలవంపులు తెచ్చే సాంఘికార్థికాంశం. ఆకలి మానవ క్రౌర్యం ఫలితమే త...

మొదటి రోజే భారత్ బోణీ..

#TokyoOlympics2021   మొదటి రోజే భారత్  బోణీ ...  వెయిట్ లిఫ్టింగ్ లో 49 కేజీల విభాగంలో  మీరాబాయి చాను సిల్వర్ మెడల్ గెలుచుకుంది. 

సబ్సిడీపై 5,600 మినీ ట్రక్కులు

సబ్సిడీపై 5,600 మినీ ట్రక్కులు . * బీసీలకు 3,800.. ఈబీసీలకు 1,800 మినీ ట్రక్కుల కేటాయింపు. * లబ్ధిదారుల సబ్సిడీ 30 నుంచి 60 శాతానికి పెంచిన ప్రభుత్వం. రాష్ట్రంలో బీసీలకు 3,800 మినీ ట్రక్కులు, ఈబీసీలకు 1,800 మినీ ట్రక్కులు.. మొత్తం 5,600 మినీ ట్రక్కులను సబ్సిడీపై ప్రభుత్వం అందజేయనుంది. వెనుకబడిన తరగతులు (బీసీ), ఆర్థికంగా వెనుకబడిన వారి (ఈబీసీ) అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ)లను మంజూరు చేసింది. బీసీలు, ఈబీసీల సంక్షేమం, స్వయం ఉపాధి పథకం మార్గదర్శకాలను సోమవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము జారీ చేశారు. మొత్తం యూనిట్‌ (మినీ ట్రక్కు) వ్యయంలో 10 శాతం లబ్ధిదారుడు ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 90 శాతాన్ని ఎంపిక చేసిన బ్యాంకు నుంచి రుణంగా అందిస్తారు. 90 శాతం అప్పులో లబ్ధిదారుడు 60 శాతం సబ్సిడీగా పోనూ మిగిలిన 30 శాతాన్ని 72 నెలల్లో వాయిదాల పద్ధతిలో చెల్లించాలి. కాగా, ఇప్పటి వరకు లబ్ధిదారుడికి ఇస్తున్న 30 శాతం సబ్సిడీని 60 శాతానికి పెంచుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీని వల్ల లబ్ధిదారుడిపై ఆర్థిక భారం తగ్గుత...

నవయుగ కవిచక్రవర్తి, మహాకవి , విశ్వనరుడు. గుఱ్ఱం జాషువా వర్ధంతి సందర్భంగా..

నవయుగ కవిచక్రవర్తి, మహాకవి , విశ్వనరుడు.  గుఱ్ఱం జాషువా గారి 50 వ వర్ధంతి  జూలై, 24 సందర్భంగా ఒక సీసపద్య నివాళి  రచన : డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి. సీసపద్యం: కాజాలడెవ్వడూ కవనమూర్తిగ తాను  జాషువా పద్యాలు చదవకుండ కాజాలడెవ్వడూ ఘనవక్తగా తాను  పాడక జాషువా పద్యములను కాజాలడెవ్వడూ కవివిమర్శకునిగా  పలుకక జాషువా పద్యరీతి కాజాలడెవ్వడూ కవి కులాగ్రజునిగా  తెలియక జాషువా తేట తెలుగు  తే.గీ. కవిత పొంగారు జాువా కవిత చదువ పద్యముప్పొంగు జాషువా పద్యమరయ రీతి తెలియును జాషువా కైత విన్న చూడ కవులందు జాషువా సుకవి మిన్న.

పేద‌ల‌ను ఆదుకునేందుకు ప్ర‌తిఒక్క‌రు ముందుకు రావాలి

యువ‌తి వివాహానికి రూ.10 వేలు ఆర్ధిక సహాయం అంద‌జేత‌ - పేద‌ల‌ను ఆదుకునేందుకు ప్ర‌తిఒక్క‌రు ముందుకు       రావాలి - ఏపిబిజేఏ రాష్ట్ర ఉపాధ్య‌క్షులు     పి. మీరాహుస్సేన్‌ఖాన్‌ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: నిరుపేద‌ల‌ను ఆదుకునేందుకు మ‌న‌సున్న మ‌హ‌రాజులు ముందుకు రావాల‌ని, పేద‌ల‌ను మాన‌వ‌తా ధృక్ప‌దంతో ఆదుకుంటున్న దాత‌ల సేవ‌లు ఎన‌లేనివ‌ని, క‌ష్ట‌కాలంలో ఉన్న వారికి స‌హాయ ప‌డ‌డంలో ప్ర‌తి ఒక్క‌రు ముందుండాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ్రాడ్‌కాస్ట్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ రాష్ట్ర ఉపాధ్య‌క్షులు పి మీరాహుస్సేన్‌ఖాన్ పేర్కొన్నారు. నందిగామ ప‌ట్ట‌ణానికి చెందిన పేదింటి యువ‌తి వివాహ ఖ‌ర్చుల నిమిత్తం మీరాహుస్సేన్‌ఖాన్ త‌న మిత్ర‌బృందంతో క‌లిసి రూ. 10,116లు ఆర్ధిక స‌హాయం యువ‌తి బందువుల‌కు అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా మీరాహుస్సేన్ మాట్లాడుతూ క‌ష్టాల్లో ఉన్న‌వారికి స‌హాయం అందించ‌డంలో ఉన్న సంతృప్తి మ‌రెందులో ఉండ‌ద‌ని , మ‌నం ఎంత సంపాదించామ‌న్న దానికంటే ఎదుటివారికి ఎంతోకొంత స‌హాయ ప‌డ‌డం ముఖ్యం అన్నారు. త‌న‌తో పాటు స‌హాయం అందించిన త‌న మిత్ర‌బృందానికి పేరుపేరున కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ...

ఇంటర్ పరీక్ష ఫలితాల్లో వివేక విద్యార్థులు సత్తా..

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఇంటర్ పరీక్ష ఫలితాల్లో వివేక విద్యార్థులు సత్తా చాటారు. ఎం.పి.సి విభాగంలో యార్లగడ్డ అమృత భార్గవి 1000 మార్కులకు 991,టి. సుష్మ 985, షేక్ ఆసియా 983, ఎస్.నిత్యశ్రీ 983, టి. భాను 950 మార్కులు సాధించారు. అలాగే బైపీసీ విభాగంలో కె.ప్రియాంక 1000 మార్కులకు 988 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను వివేక విద్యాసంస్థ ల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.

ad

వినుకొండ అథ్లెట్ షేక్ అబ్దుల్లాకు ప్రోత్సాహక నగదు బహుమతి

భూటాన్ లో జరగనున్న సౌత్ ఏషియన్ గేమ్స్ కు ఎంపికయిన గుంటూరు జిల్లా వినుకొండ పట్టణానికి చెందిన అథ్లెట్ షేక్ అబ్దుల్లాకు శుక్రవారం రు. 50వేల చెక్కును రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అంద జేశారు.

సచివాలయ పనితీరును తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్

సచివాలయ పనితీరును తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ . తెనాలి పట్టణంలోని 25వ వార్డ్ సచివాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు.సచివాలయంలో నిర్వహిస్తున్న రికార్డులు, సిబ్బంది హజరును పరిశీలించారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల నమోదును అడ్మిన్ ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషల్ ఆడిట్, సిటిజన్ చార్టర్,సిబ్బంది పనితీరు, అధికారుల సమన్వయం తదితర అంశాలను పరిశీలించినట్లు తెలియజేసారు. ముఖ్యమంత్రి ఆదేశాలకనుగుణంగా సచివాలయ వ్యవస్థ పనిచేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.  అక్కడి నుంచి నేరుగా కళాక్షేత్రంలో జరుగుతున్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని వీఆర్వోవోలు,వార్డ్ రెవెన్యూ కార్యదర్సులు శిక్షణలో పాల్గొని ప్రసంగించారు.హాజరైన సిబ్బందికి రికార్డుల నిర్వహణ,తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహశీల్దార్ కె రవి కుమార్,గుంటూరు తూర్పు మండల తహసిల్దార్ శ్రీకాంత్ కేదార్ నాధ్,వేమూరు తహసిల్దార్ శిరీష, కొల్లూరు తహసిల్దార్ జాన్ పీటర్, కొల్లిపర తహసిల్దార్ నాంచారయ్య,తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయ కె...

ad

తెనాలి నుండి చిత్ర సీమలోకి అడుగు పెట్టిన తొలితరం తార కాంచనమాల సినీ ప్రయాణం..

తెనాలి నుండి చిత్ర సీమలో కి అడుగు పెట్టిన తొలితరం తార  కాంచనమాల గారి సినీ ప్రయాణం : కాంచనమాల (మార్చి 5, 1917 - జనవరి 24, 1981) తొలితరం నటీమణులలో ఒకరు. ఆంధ్రా ప్యారిస్‌గా పేరుపొందిన తెనాలి పట్టణం ఆవిడ స్వస్థలం. ఆ కాలంలో బాగా పేరు తెచ్చుకున్న నటీమణులలో ఈవిడా ఒకరు.కాంచనమాల తెనాలికి చెందిన గాలి వెంకయ్య అనే యువకుణ్ణి ప్రేమించి పెళ్ళాడారు. చిన్నాన్న దగ్గర సంగీతం నేర్చుకున్న కాంచనమాల ఓ చిన్న పాత్ర ద్వారా సినిమాలో ప్రవేశించారు. కాంచనమాల రూపలావణ్యం, విశాలనేత్రాలు, అందమైన ముఖం చూసి సి. పుల్లయ్య ఆమె చేత వై.వి.రావు నిర్మించిన శ్రీకృష్ణ తులాభారము (35) లో మిత్రవింద వేషం వేయించారు. ఆ సినిమాలో తన అందంతో అందరి చూపులని తన వైపుకి తిప్పుకున్నారు ఈమె. ఆ తర్వాత చిత్రం వీరాభిమన్యు (1936) లోనే ఆమె కథానయిక స్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత వరుసగా విప్రనారయణ (1937), మాలపిల్ల (1938), వందేమాతరం (1939),మళ్ళీ పెళ్ళి (1939), ఇల్లాలు (1940), మైరావణ (1940), బాలనాగమ్మ (1942) వంటి సినిమాలలో కథానాయిక పాత్ర పోషించారు. గృహలక్ష్మి (1938) లో మాత్రం వాంప్ పాత్ర పోషించారు. విప్రనారాయణలో దేవదేవిగా ఆమె అందం, అభిన...

ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఎక్కడెక్కడ ఎలా నమోదయ్యే అవకాశాలున్నాయి

ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఎక్కడెక్కడ ఎలా నమోదయ్యే అవకాశాలున్నాయి ?? ====================== ఈ రోజు రాష్టంలో భారీ వర్షాలు కొనసాగుతాయి. ఈ వర్షాలు మోస్తరుగా పడుతాయి, కానీ పడుతునే ఉంటాయి కాబట్టి ఇవి తప్పకుండా భారీ వర్షాలుగా ఉంటాయి. నిన్న రాత్రి కురిసిన వర్షాలకే ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్షాలు మోస్తరు నుంచి భారీగా పడ్డాయి. ముఖ్యంగా విజయవాడ నగరంలో అయితే వర్షం పడుతునే ఉంది. చాలా చోట్ల నీరు నిలిచిపోయింది. ప్రకాశం, కర్నూలు, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే అత్యధికంగా వర్షాలు పడనున్నాయి. కడప​, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అడపదడప వర్షాలు కొనసాగనున్నాయి. ఎక్కువ వర్షాలు సాయంకాలం/రాత్రి సమయంలో నమోదవ్వనున్నాయి. ఈదురు గాలులు గంటకు 25 kmphr నుంచి  50 kmphr రాష్ట్ర వ్యాప్తంగా వీచే అవకాశాలున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కొనసాగనున్నాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు నమోదవ్వనుంది. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని కొండ ప్రాంతాల్లో మాత...

నేటి నుంచి ఆగ‌స్టు 15 వ‌ర‌కు ఢిల్లీలోని ఎర్ర‌కోట‌లో సందర్శకులకు ప్రవేశాలు నిలిపివేత‌

నేటి నుంచి ఆగ‌స్టు 15 వ‌ర‌కు ఢిల్లీలోని ఎర్ర‌కోట‌లో సందర్శకులకు ప్రవేశాలు నిలిపివేత‌. స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు ముగిసేవ‌ర‌కు దేశ రాజధాని ఢిల్లీ లోని ఎర్రకోట లోనికి సందర్శకుల ప్రవేశాలు నిలిపివేస్తున్న‌ట్టు ఆర్కియాల‌జిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలియచేసింది.

త్వరలో ఇంటర్, టెన్త్ ఇంటర్ పరీక్షలు ఫలితాలు విడుదల

అమరావతి: కరోనా కారణంగా ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే. దాంతో ఫలితాలు ఎలా ఉంటాయోనని విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. తాజాగా టెన్త్, ఇంటర్ ఫలితాలపై ఏపీ విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఫలితాలపై నివేదిక రెడీ చేసింది. గ్రేడ్ల విధానంతో మార్కులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్, టెన్త్ ఇంటర్ పరీక్షలు విడుదల చేయనుంది. టెన్త్, ఇంటర్ ఫలితాలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే టెన్త్, ఇంటర్ పరీక్షలను విడుదల చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. ఫలితాల ప్రకటనపై ఇప్పటికే సీఎం జగన్‌కు ప్రతిపాదనలు పంపామన్నారు.త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. టెన్త్ పరీక్షల ఫలితాలు ప్రకటించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని ఆదిమూలపు సురేశ్ తెలిపారు.

తొలిసారి ఒలింపిక్ ఫెన్సింగ్ విభాగం లో అర్హత సాధించిన భవానీదేవి

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:  మన భారతదేశం నుండి ఒలింపిక్ గేమ్స్ కు  మొట్టమొదటి సారిగా ఫెన్సింగ్ విభాగంలో అర్హత సాధించిన భవాని దేవి. టోక్యో నగరంలో జరుగుతున్న శిక్షణా తరగతులలో ఈ విషయాన్ని నిర్వాహకులు వెల్లడించారు. దీనితో భారత్ తరఫున ఫెన్సింగ్ విభాగంలో పోటీకు దిగుతున్న మొట్టమొదటి భారతతేజం భవానిదేవికి పలువురు శుభాకాంక్షలు అంద జేస్తున్నారు. (- స్పెషల్ కస్పాండెంట్, సురేష్ బాబు బచ్చు)

ad

బాపట్ల పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థిని పర్వతనేని నిహారిక ఈసీఈ మూడో సెమిస్టర్‌ పరీక్షల్లో ప్రతిభ

బాపట్ల పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థిని పర్వతనేని నిహారిక ఈసీఈ మూడో సెమిస్టర్‌ పరీక్షల్లో ప్రతిభ కనబరచింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో 900 మార్కులకు 899 సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. పేద రైతు కుటుంబానికి చెందిన నిహారిక.. ఐఐటీలో ఎంటెక్‌ చదివి శాస్త్రవేత్తగా ఎదగాలని లక్ష్యం నిర్దేశించుకొన్నట్లు తెలిపింది.

బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు - ఎమ్మెల్యే శివకుమార్

ఘనంగా ఏకలవ్యుని జయంతి వేడుకలు.

ఘనంగా ఏకలవ్యుని జయంతి వేడుకలు. తెనాలి:స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డు లోని ఎస్సీ, ఎస్ టి, బిసి,మైనారిటీల ఐక్యవేదిక కార్యాలయం వద్ద ఐక్య వేదిక  ఏపీ ఎరుకుల ప్రజా సంక్షేమ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఏకలవ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం ఐక్యవేదిక వ్యవస్థాపకుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఏకలవ్య మహనీయుని జయంతిని ఐక్యవేదిక కార్యాలయం వద్ద జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఏకాగ్రతతో విలువిద్యను అభ్యసించి ఆ విద్యలో రాణించిన గొప్ప వ్యక్తి ఏకలవ్యుడని పేర్కొన్నారు. ఏపీ ఎరుకల ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవరకొండ శంకర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏకలవ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఎరుకుల సంఘీయులు ఘనంగా జరుపుకునే ఏకలవ్య జయంతి ని వాడవాడలా జరుపుకోవడం సంతోషకరమని అటువంటి మహనీయుని జయంతి రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో ఐక్యవేదిక పట్టణ మండల అధ్యక్షులు జూపల్లి వంశీ,కుర్ర జశ్వంత్, ప్రధాన కార్యదర్శి ఉన్నవ రాజేష్, నాయకులు కె.శ్రీనివాసరావు,  బుల్లయ్య, కి...

కోవిడ్ నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలి...

కోవిడ్ నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలి... ...వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్. తెనాలి :స్థానిక ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియా లోని ఆటోనగర్ అసోసియేషన్ హాల్ లో మంగళవారం కోవిడ్ వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరి ప్రసాద్ మాట్లాడుతూ కోవిడ్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆటోనగర్ లోని పలు సంస్థల యజమానులకు కార్మికులకు కోవిడ్ వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరు విధిగా పాటించి కోవిడ్ నియంత్రణకు సహకరించాలని కోరారు.కోవిడ్ లక్షణాలు ఉన్నవారు అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని అన్నారు.ఆటోనగర్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆటోనగర్ వచ్చే వినియోగదారులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సామాజిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ షేక్ ఇస్మాయిల్, సభ్యులు మాలేపాటి కోటేశ్వరరావు, వైద్యాధికారి డాక్టర్ ఎమ్ అనూష, డాక్టర్ బాల ప్రభావతి ,ఆరోగ్య విస్తరణాధికారి అందే బాల చంద్రమౌళి, వైద్య సిబ్బంది ఏ రాధిక, ఎం రోహిణి,బి ...

కోవిడ్ థర్డ్ వేవ్ ను సమర్థంగా ఎదుర్కొంటాం.

కోవిడ్ థర్డ్ వేవ్ ను సమర్థంగా ఎదుర్కొంటాం... ... డిప్యూటీ ఎం హెచ్ ఓ జె. నరసింహ నాయక్. తెనాలి : కోవిడ్ థర్డ్ వేవ్ ప్రభావం చిన్నపిల్లలపై ఎక్కువగా ఉంటుందని శాస్త్రీయంగా నిర్ధారణ అయిన దృష్ట్యా ఎటువంటి పరిస్థితినయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు డిప్యూటీ ఎం హెచ్ ఓ నరసింహ నాయక్ తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ థర్డ్ వేవ్ ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని అన్ని వైద్యశాలలో బెడ్స్ పెంచుతున్నట్లు, ఆక్సిజన్ తదితర సౌకర్యాలను మెరుగు పరుస్తున్నట్లు తెలిపారు.పిల్లల వయసును బట్టి మందుల డోసులు ఇవ్వాల్సి ఉంటుందని అందుకోసం వైద్యాధికారులకు సిబ్బందికి శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.డివిజన్ పరిధిలో 45 సంవత్సరాలు నిండిన వారికి, గర్భిణీలకు,పిల్లల తల్లులకు, మరియు ఉపాధ్యాయులకు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ చేయడం జరిగిందన్నారు. అంతేగాక విదేశాలకు చదువు, ఉద్యోగం నిమిత్తం వెళుతున్న వారికి కూడా వ్యాక్సినేషన్ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు పట్టణ పరిధిలో మూడు...

Films Like "Kallu" By Veteran DOP & Director M.V.Raghu Garu is Among A Few Films Which Make An Everlasting Impression.FTIH Is Celebrating 33rd Anniversary Of This Telugu Classic By Screening It At Prasad Labs On 23rd Of This Month.

బక్రీద్ తోఫాలను అందజేయడం సంతృప్తినిచ్చింది.

బక్రీద్ తోఫాలను అందజేయడం సంతృప్తినిచ్చింది.... ......టీడీపీ జిల్లా సీనియర్ నాయకుడు కుదరవల్లి శ్రీనివాసరావు. తెనాలి:పవిత్ర  బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరీమణులకు తోఫాలను అందజేయడం సంతృప్తిని ఇచ్చిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ జిల్లా నాయకుడు కుదరవల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక టిడిపి కార్యాలయంలో బక్రీద్ పండుగను పురస్కరించుకొని పేద ముస్లిం మహిళలకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ మరియు నక్కా ఆనంద్ బాబు ఆశీర్వాదాలతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మైనార్టీ ప్రెసిడెంట్ షేక్ నాసిర్ పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడి బోయిన హరిప్రసాద్ నాయకులు మహమ్మద్ ఖుద్దూస్,కాకుమాను రాంబాబు,కేసన కోటేశ్వరరావు, జొన్నాదుల మహేష్,కొర్రపాటి శ్రీనివాసరావు, జిలాని, నఫీజ్,అబ్బాస్,రాజేంద్రప్రసాద్, రవి,పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.