నవయుగ కవిచక్రవర్తి, మహాకవి , విశ్వనరుడు. గుఱ్ఱం జాషువా గారి 50 వ వర్ధంతి
జూలై, 24 సందర్భంగా ఒక సీసపద్య నివాళి
రచన : డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి.
సీసపద్యం: కాజాలడెవ్వడూ కవనమూర్తిగ తాను
జాషువా పద్యాలు చదవకుండ కాజాలడెవ్వడూ ఘనవక్తగా తాను
పాడక జాషువా పద్యములను కాజాలడెవ్వడూ కవివిమర్శకునిగా
పలుకక జాషువా పద్యరీతి కాజాలడెవ్వడూ కవి కులాగ్రజునిగా
తెలియక జాషువా తేట తెలుగు
తే.గీ. కవిత పొంగారు జాువా కవిత చదువ పద్యముప్పొంగు జాషువా పద్యమరయ రీతి తెలియును జాషువా కైత విన్న చూడ కవులందు జాషువా సుకవి మిన్న.