Skip to main content

యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ సినిమాలలో నటించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది

యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ సినిమాలలో నటించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది
- ప్రముఖ సినీ నటులు శివాజీ రాజా.

సినిమాలలో నటించాలంటే  ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకోవడం ఎంతో అవసరమని సినీ నటులు శివాజీరాజా తెలిపారు.
సౌత్ ఇండియా లో నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ గా పేరుగాంచిన యఫ్. టి. ఐ. హెచ్. ( ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హైదరాబాద్ ) స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించిన కళ్ళు సినిమా ప్రీమియర్ షో కి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 
కళ్ళు సినిమా విడుదలై ముప్ఫై మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా ఎఫ్. టి.ఐ.హెచ్.వారు శుక్రవారం ప్రసాద్ ల్యాబ్స్ లో కళ్ళు చిత్రాన్ని ప్రదర్శించారు.ఈ సందర్భంగా కళ్ళు చిత్రంలో హీరోగా నటించిన శివాజీ రాజా ఎఫ్. టి.ఐ.హెచ్.విద్యార్థులతో ఆ చిత్ర విశేషాలను పంచుకున్నారు. తొలిసారిగా కెమెరా ముందు నిల్చున్నప్పుడు తన కాళ్ళు వణకడం తనకు మాత్రమే తెలుసని, అయితే నటనలో తీసుకున్న శిక్షణ ఆ భయాన్ని అధిగమించి సినీరంగంలో నిలదొక్కుకునేలా చేసిందని ఆయన తెలిపారు.ఈ చిత్రం గురించి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు శివాజీరాజా సమాధానాలు ఇచ్చారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ మరియు దర్శకత్వం వహించిన ఎం.వి.రఘు తమను ఎంతగానో ప్రోత్సహించి తనకు కావలసిన నటనను రాబట్టుకున్నారని, అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఎఫ్. టి. ఐ.హెచ్ వంటి ప్రముఖ సంస్థలో ఎకడమిక్ డీన్  గా ఉండడం వల్ల మరెందరో అత్యుత్తమ నటులు సినీరంగానికి పరిచయం అవుతారని శివాజీరాజా సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో పనిచేసిన నటులను,సాంకేతిక నిపుణులను ఎఫ్. టి.ఐ.హెచ్. మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ ఉదయ్ కిరణ్ కటకం, జురియెల్ స్టూడియోస్ సీఈఓ శ్వేత కటకం సత్కరించారు 
కళ్ళు వాసు, చిత్తరంజన్, సినీ,నవలా రచయిత నడిమింటి నరసింగరావు తదితరులు విద్యార్థులతో ముచ్చటించి తమ సినీ అనుభవాలను వివరించారు.
యఫ్. టి. ఐ. హెచ్. డీన్ మరియు కళ్ళు చిత్ర దర్శకులు ఎం.వి.రఘు కళ్ళు చిత్రం తీయడానికి పడిన శ్రమను, పొందిన ఫలితాలను గుర్తు చేసుకుని, కళ్ళు చిత్రం మరోసారి తీయాలని ఉందని,తీస్తే అందులో ఎఫ్. టి. ఐ.హెచ్.విద్యార్థులకు అవకాశం ఉంటుందని తెలిపారు.
యాక్టింగ్ ప్రొఫెసర్& పీఆర్వో. డా.శ్రీజ సాదినేని, కల్చరల్ సెక్రెటరీ హర్ష వర్ధన్, మరియు ఎఫ్. టి. ఐ.హెచ్. అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...