బక్రీద్ తోఫాలను అందజేయడం సంతృప్తినిచ్చింది.

బక్రీద్ తోఫాలను అందజేయడం సంతృప్తినిచ్చింది....

......టీడీపీ జిల్లా సీనియర్ నాయకుడు కుదరవల్లి శ్రీనివాసరావు.

తెనాలి:పవిత్ర  బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరీమణులకు తోఫాలను అందజేయడం సంతృప్తిని ఇచ్చిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ జిల్లా నాయకుడు కుదరవల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక టిడిపి కార్యాలయంలో బక్రీద్ పండుగను పురస్కరించుకొని పేద ముస్లిం మహిళలకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ మరియు నక్కా ఆనంద్ బాబు ఆశీర్వాదాలతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మైనార్టీ ప్రెసిడెంట్ షేక్ నాసిర్ పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడి బోయిన హరిప్రసాద్ నాయకులు మహమ్మద్ ఖుద్దూస్,కాకుమాను రాంబాబు,కేసన కోటేశ్వరరావు, జొన్నాదుల మహేష్,కొర్రపాటి శ్రీనివాసరావు, జిలాని, నఫీజ్,అబ్బాస్,రాజేంద్రప్రసాద్, రవి,పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.