బాపట్ల పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని పర్వతనేని నిహారిక ఈసీఈ మూడో సెమిస్టర్ పరీక్షల్లో ప్రతిభ కనబరచింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో 900 మార్కులకు 899 సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. పేద రైతు కుటుంబానికి చెందిన నిహారిక.. ఐఐటీలో ఎంటెక్ చదివి శాస్త్రవేత్తగా ఎదగాలని లక్ష్యం నిర్దేశించుకొన్నట్లు తెలిపింది.