Skip to main content

పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్, 25 జూలై 2021: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును  గ్రామస్థాయిలో పరిశీలించి వాటిలో సమస్యలను సమస్యలను పరిష్కారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ పేర్కొన్నారు.
ఆదివారం రాత్రి గురజాల మండలం పులిపాడు గ్రామంలోని ఆదర్శ మండల పరిషత్‌ పాఠశాలలో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలలో సమస్యలను జిల్లా స్థాయి అధికారులు గ్రామస్థాయికి వెళ్ళి పరిష్కారించేందుకు పల్లెనిద్ర కార్యక్రమంని జిల్లాలో తొలుత పులిపాడు గ్రామంతో ప్రారంభిస్తున్నామన్నారు. పల్లెనిద్ర కార్యక్రమంకు పండుగ వాతావరణం తీసుకువచ్చేలా భారీ స్థాయిలో గ్రామస్ధులు హాజరవటం సంతోషంగా ఉందన్నారు.
గురజాల శాసనసభ్యులు కాసు మహేష్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నవరత్న పథకాలు చక్కగా అమలు జరుగుతున్నాయని, పధకాల అమలును గ్రామస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కారించేందుకు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ పల్లెనిద్ర కార్యక్రమంకు గ్రామానికి రావటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రానికే శివారు గ్రామమైన పులిపాడు సచివాలయ సిబ్బంది సమయపాలన పాటిస్తే గ్రామస్ధులకు మరింత మేలు జరుగుతుందనన్నారు. గ్రామంలో అర్హత ఉన్న 30 మందికి పెన్షన్లు మంజూరు చేయాలని జాబితాను జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌కు శాసనసభ్యులు కాసు మహేష్‌ రెడ్డి అందించారు.
సమావేశం అనంతరం ఎస్‌సీ కాలనీలో జిల్లా కలెక్టర్‌  వివేక్‌ యాదవ్, శాసనసభ్యులు కాసు మహేష్‌ రెడ్డి గ్రామస్ధులతో కలసి సహపంక్తి భోజనం చేశారు.
కార్యక్రమంలో  జడ్పీ సీఈవో చైతన్య, డీఎంహెచ్‌వో డా. యాస్మిన్, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ మఢుసూదనరావు, డీఈవో గంగా భవానీ,   గురజాల రెవెన్యూ డివిజన్‌ అధికారి పార్ధసారధి,పోలీస్, రెవెన్యూ, పంచాయితీ, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...