ఘనంగా ఏకలవ్యుని జయంతి వేడుకలు.

ఘనంగా ఏకలవ్యుని జయంతి వేడుకలు.

తెనాలి:స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డు లోని ఎస్సీ, ఎస్ టి, బిసి,మైనారిటీల ఐక్యవేదిక కార్యాలయం వద్ద ఐక్య వేదిక  ఏపీ ఎరుకుల ప్రజా సంక్షేమ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఏకలవ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం ఐక్యవేదిక వ్యవస్థాపకుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఏకలవ్య మహనీయుని జయంతిని ఐక్యవేదిక కార్యాలయం వద్ద జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఏకాగ్రతతో విలువిద్యను అభ్యసించి ఆ విద్యలో రాణించిన గొప్ప వ్యక్తి ఏకలవ్యుడని పేర్కొన్నారు. ఏపీ ఎరుకల ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవరకొండ శంకర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏకలవ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఎరుకుల సంఘీయులు ఘనంగా జరుపుకునే ఏకలవ్య జయంతి ని వాడవాడలా జరుపుకోవడం సంతోషకరమని అటువంటి మహనీయుని జయంతి రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో ఐక్యవేదిక పట్టణ మండల అధ్యక్షులు జూపల్లి వంశీ,కుర్ర జశ్వంత్, ప్రధాన కార్యదర్శి ఉన్నవ రాజేష్, నాయకులు కె.శ్రీనివాసరావు,  బుల్లయ్య, కిషోర్,దేవకొండ గజేంద్ర రావు, బి శ్రీమన్నారాయణ, జి సాంబశివరావు,అజిత్,రవి, జయప్రకాష్ పలువురు పాల్గొన్నారు.