ఇంటర్ పరీక్ష ఫలితాల్లో వివేక విద్యార్థులు సత్తా..

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో వివేక విద్యార్థులు సత్తా చాటారు. ఎం.పి.సి విభాగంలో యార్లగడ్డ అమృత భార్గవి 1000 మార్కులకు 991,టి. సుష్మ 985, షేక్ ఆసియా 983, ఎస్.నిత్యశ్రీ 983, టి. భాను 950 మార్కులు సాధించారు. అలాగే బైపీసీ విభాగంలో కె.ప్రియాంక 1000 మార్కులకు 988 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను వివేక విద్యాసంస్థ ల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.