మోదుకూరి జాన్సన్ రచించిన సినీ పాటల ఆడియో సిడీని ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

టాలెంట్ ఎక్స్ ప్రెస్:
సంచలన సినీ రచయిత మోదుకూరి జాన్సన్  రచించిన సినీ పాటల ఆడియో సిడీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. జాన్సన్ గారి  జయంతి సందర్భంగా ఆదివారం మోదుకూరి జాన్సన్ కల్చరల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు గుంటూరు కృష్ణ ఈ కార్యక్రమం నిర్వహించారు. వేమూరు శాసనసభ్యులు డాక్టర్ మేరుగు నాగార్జున గారు, రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు గారు,రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ వై.నాగిరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే జియావుద్ధీన్ గారు తదితరులు పాల్గొన్నారు. జాన్సన్ గారి ప్రతిభను వెలుగులోకి తీసుకురావటానికి కృషి చేస్తున్న గుంటూరు కృష్ణను సజ్జల రామకృష్ణారెడ్డి గారు అభినందించారు.* *కార్యక్రమ విజయవంతానికి సహరించిన శాసనసభ్యులు నాగార్జున గారికి కృతజ్ఞతలు.*