Skip to main content

హైదరాబాద్ ను ఫిల్మ్ హబ్ గా తీర్చిదిద్దాలనేది సి.ఎం లక్యం

హైదరాబాద్ ను ఫిల్మ్ హబ్ గా తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి  లక్ష్యం! 

చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.  మంగళవారం BRK భవన్ లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలు, ఇతర అంశాలపై  మంత్రి శ్రీనివాస్ యాదవ్ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ తో కలిసి అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హోం శాఖ ప్రిన్స్ పల్ సెక్రెటరీ రవి గుప్తా, మున్సిపల్ పరిపాలన శాఖ ప్రిన్స్ పల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, విద్యుత్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, లా సెక్రెటరీ సంతోష్ రెడ్డి, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ నీతు ప్రసాద్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షులు నారాయణ దాస్ నారంగ్, సెక్రెటరీ దామోదర్ ప్రసాద్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షులు మురళి మోహన్, సెక్రెటరీ సునీల్ నారంగ్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అద్యక్షులు C.కళ్యాణ్, సెక్రెటరీ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ...  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చలనచిత్ర రంగ అభివృద్దికి అనేక విధాల సహాయ సహకారాలు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. సినీ పరిశ్రమకు అన్ని విధాలుగా అనువుగా ఉన్న హైదరాబాద్ ను ఫిల్మ్ హబ్ గా తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యం అన్నారు. సినిమా షూటింగ్ ల కోసం అనుమతులు పొందేందుకు నిర్వహకులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సింగిల్ విండో విధానంలో షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా టికెట్ ల విక్రయాలలో పారదర్శకత కోసం ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. దీనివలన తక్కువ సర్వీస్ చార్జి తోనే ప్రేక్షకులు టికెట్ ను పొందే అవకాశం ఉంటుందన్నారు. ప్రైవేట్ సైట్ లు ఒక్కో టికెట్ కు  20 నుండి 40 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయని, ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ( FDC ) ఆధ్వర్యంలో నిర్వహించే ఆన్ లైన్ టికెట్ విధానంలో ఒక్కో టికెట్ కు కేవలం 6 రూపాయలు మాత్రమే సర్వీస్ చార్జి వసూలు చేయబడుతుందని మంత్రి వివరించారు.  ఆన్ లైన్ టికెట్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని హోం, లా సెక్రెటరీ లను మంత్రి ఆదేశించారు. లాక్ డౌన్ సమయంలో ధియేటర్ లు మూసివేసి ఉన్నందున ప్రభుత్వానికి చెల్లించాల్సిన విద్యుత్ చార్జీలు, ఆస్తిపన్ను రద్దు చేసి ఆదుకోవాలని, సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో వాహనాల పార్కింగ్ ఫీజు వసూలు చేసేందుకు అనుమతించాలని తదితర విజ్ఞప్తులతో సినీ ఎగ్జిబిటర్స్ వినతిపత్రాన్ని అందజేశారని, అందులో పార్కింగ్ ఫీజు వసూలు కు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. మిగిలిన అంశాల పరిష్కారానికి  ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని తెలిపారు. ప్రస్తుతం 4 షో లు ప్రదర్శించబడుతున్నాయని, 5 వ షో ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ షూటింగ్ లు, పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహించుకోవడానికి, అనుమతించిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. సినీ పరిశ్రమలోని వివిధ విభాగాల లోని కార్మికుల (24 క్రాఫ్ట్స్ ) కు అండగా ప్రభుత్వం కార్మిక చట్టాలను అమలు చేయడంలో కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. లాక్ డౌన్ కారణంగా మూతపడిన థియేటర్ లను 50 శాతం సీటింగ్ కెపాసిటీ తో తెరిచేందుకు ప్రభుత్వం నవంబర్ 2020 అనుమతులు ఇచ్చిందని, కరోనా తగ్గుముఖం పట్టడంతో 100 శాతం సీటింగ్ కెపాసిటీ తో తెరిచేందుకు ఫిబ్రవరి 2021 న ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...