ప్రభుత్వ చిత్రలేఖన పరీక్షల్లో తెనాలి విద్యార్థుల ప్రతిభ

టాలెంట్ ఎక్స్ ప్రెస్:
ప్రభుత్వ చిత్రలేఖన పరీక్షల్లో తెనాలి విద్యార్థుల ప్రతిభ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్వహించిన డ్రాయింగ్ లోయర్ మరియు హయ్యర్ గ్రేడ్ పరీక్షలలో తెనాలి విద్యార్థుల ప్రతిభ కనబరిచారు.  ఏప్రిల్ 2021 న నిర్వహించిన డ్రాయింగ్ లోయర్ & హయ్యర్ గ్రేడ్ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల చేశారు.  ఈ ఫలితాలలో పెదరావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిత్రలేఖనోపాధ్యాయులు పణిదెపు వెంకట కృష్ణ దగ్గర శిక్షణ తీసుకున్న తెనాలి విద్యార్థులు లోయర్ గ్రేడ్ నందు చింతక్రింది ప్రియాంక (ప్రధమ శ్రేణి), పిల్లలమర్రి బాల త్రిపుర సుందరి (ద్వితీయ శ్రేణి), పల్లపోతు వాసవి (ద్వితీయ శ్రేణి), కె. ప్రత్యూష( ద్వితీయ శ్రేణి), ఉల్లగంటి మనీషా (ద్వితీయ శ్రేణి), మఱియు హయ్యర్ గ్రేడ్ నందు ch. కుశల్ మణిదీప్(ప్రథమ శ్రేణి), తడివాక పవన్ సాయిమధు (ద్వితీయ శ్రేణి), పులిపాటి లేఖనా గాయత్రి (ద్వితీయ శ్రేణి)లో ఉర్తీర్ణత సాధించారు. వీరిని డ్రాయింగ్ మాస్టర్ కృష్ణ మరియు ఉపాధ్యాయులు అభినందించారు. 
 పి. వెంకట కృష్ణ,(తెనాలి) డ్రాయింగ్ మాస్టర్, సెల్:9848811668