సూర్య శిల్పశాల ఆధ్వర్యంలో శిల్పకళా ప్రదర్శన

 ఎక్స్ ప్రెస్:
ఆగస్టు 15 భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి కి చెందిన సూర్య శిల్పశాల నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీ హర్ష లు స్వాతంత్ర సమరయోధుల, భారత దేశానికి తమ సేవలు అందించిన సంఘసంస్కర్తల ,రచయితల విగ్రహాలను శిల్పశాల ముందు ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. అతిధులుగా విచ్చేసిన
స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివ కుమార్,
మున్సిపల్ చైర్ పర్సన్ కాలేదా నసీమలు ప్రదర్శన ప్రారంభించారు. స్వాతంత్రం ఆర్జించి పెట్టిన త్యాగధనుల, వారి త్యాగాలను గుర్తుకువచ్చే విధముగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసిన సూర్య శిల్పశాల నిర్వాహకులు శిల్పి కాటూరి  వెంకటేశ్వరరావు, రవిచంద్రలను శివకుమార్ అభినందించారు.