Skip to main content

బుల్లెట్ బండి @ తెనాలి మస్తాన్ బ్యాండ్

బుల్లెట్ బండి @ తెనాలి మస్తాన్ బ్యాండ్
- జానపద సంగీతంలో అద్భుతాలు సృష్టిస్తున్న మాస్టర్ బాజి
టాలెంట్ ఎక్స్ ప్రెస్:

అవును మీరు విన్నది నిజమే. ఇటీవల వైరల్ గా మారిన బుల్లెట్ బండి పాటకు మ్యూజిక్ అందించింది మన తెనాలి కి చెందిన బాజి. ఈ పాట రచన, గానం అద్భుతం. అంతకుమించి ఆ పాటకు బాణీ కట్టిన సంగీత దర్శకుడు ప్రతిభ, సృజనాత్మక ఇంకా అద్భుతం. జానపద సంగీతంలో ఈ పాటకు వచ్చిన స్పందన ఒక రికార్డ్. లోతుల్లోకి వెళితే ఈ పాట సంగీత దర్శకుడు షేక్ బాజి తొలుత మస్తాన్ బ్యాండ్ లొనే సంగీతంలో ఓనమాలు నేర్చుకుంది. 
మస్తాన్ బ్యాండ్ అంటే దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్న మ్యూజిక్ బ్యాండ్. తరతరాల గా వారసత్వం గా సంగీతమే నమ్ముకుని నేటికి ఈ సంస్థ కొనసాగుటూవుంది. బాజి తాత మస్తాన్, తండ్రి మీరావలి, మేనమామ పెద బాజీల నుంచి అందిపుచ్చుకున్న సంగీత పరిజ్ఞానానికి మెరుగులు అద్ది నేడు సినీ రంగం లోను రాణిస్తున్నారు మాస్టర్ జూనియర్ బాజి. అనేక హిట్ ప్రవేట్ మ్యూజిక్ ఆల్బమ్ లకు, పలు సినిమాలకు సంగీతం అందించారు బాజి. వృత్తిరీత్యా హైదరాబాద్ లో సొంత రికార్డింగ్ స్టూడియో నెలకొలపారు. జన్మస్థలంపై ఎంతో అభిమానం చూపించే బాజి ఇటీవల తెనాలి స్వతంత్ర్య ఉద్యమం పై దర్శకుడు కనపర్తి రత్నాకర్ దర్శకత్వంలో, గల్లా జ్ఞాన శేఖర్ నిర్మాణ సారథ్యంలో, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు కధ అందించిన వీరస్థలి తెనాలి మినీ మూవీ లోని ఒక పాటకు సంగీతం అందించారు బాజి. ఈ పాటను తెనాలి చెందిన చిత్రకళా ఉపాధ్యాయుడు బెల్లం కొండ వెంకట్, భవ్యలు గానం చేశారు. మా అందరి ఊపిరే వీడు, మన ఊరి రాముడే చూడు అనిసాగే ఈ పాటను రత్నాకర్ రచించారు. తనదంటూ  ప్రత్యేకమైన కొత్త బాణీ లను అందిస్తూ, సరికొత్త సంగీతం అందిస్తూ సంగీత ప్రపంచం లో రాణిస్తున్న బాజి మరిన్ని ఉన్నత స్థానాలు అందుకోవాలని ఆశిస్తున్నాము. ఈ సందర్భం గా వీరస్థలి చిత్ర యూనిట్ మాస్టర్ బాజి కి అభినందనలు తెలిపారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...