Skip to main content

ఇవాళ కొంటె బొమ్మల బ్రహ్మ.. బాపు వర్ధంతి

🚩🚩 ఇవాళ కొంటె బొమ్మల బ్రహ్మ.. బాపు వర్ధంతి!🌹
.
♦నారాచీరతో వనవాసంలో ఉన్న సీతమ్మను చూపించాలన్నా…. వాలుజడతో వయ్యారాలు పోయే పడుచుల అందాలను చూపించాలన్నా….. 
♦పెళ్లిలో సిగ్గుతో తలదించుకున్న పెళ్లికూతురును వర్ణించాలన్నా అది బాపుకే సాధ్యం. 
♦ఒక్కముక్కలో చెప్పాలంటే అందమైన అమ్మాయిని వర్ణించాలంటే…..పెద్ద పెద్ద పదాలు అక్కర్లేదు. 
సింపుల్ గా బాపు బొమ్మ అంటే చాలు.
అచ్చ తెలుగుదనానికి ప్రతీక …బాపు బొమ్మలు
.ఇవాళ బాపు వర్ధంతి.
-
♦బాపు పూర్తిపేరు సత్తిరాజు లక్ష్మినారాయణ. 1933 డిసెంబర్ 15 న పశ్చిమగోదావరి జిల్లా నర్సాపూర్ లో జన్మించారు.
1955లో మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి లాయర్ పట్టా పుచ్చుకున్నారు.
-
♦ఆంధ్రపత్రికలో కార్టూనిస్ట్ గా చేరారు.
వాలుజడతో సన్నని నడుముతో.. హొయలుపోతూ మల్లెపూల దండ తయారుచేస్తున్నట్లుగా ఉండే బాపు బొమ్మ ఎవర్ గ్రీన్.
1967లో చిత్ర దర్శకుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు బాపు.
-
♦సాక్షి…..ఆయన తొలి సినిమా.
చివరి చిత్రం…శ్రీరామరాజ్యం.
మొత్తం 51 సినిమాలకు ఆయన దర్శకత్వం
దర్శకుడిగా బాపుది విలక్షణ శైలి. రామాయణాన్ని ఆధారం చేసుకుని సినిమాలు తీయడంలో ఎక్స్ పర్ట్
దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు, మిస్టర్ పెళ్లాం….జాతీయ అవార్డులు సాధించాయి.
అయిదు సార్లు నంది అవార్డులను సొంతం చేసుకున్న బాపు
ఆయనకు నంది అవార్డులతోపాటు ఎన్నో రాష్ట్ర,జాతీయ పురస్కారాలు లభించాయి.
♦1986లో రఘుపతి వెంకయ్య పురస్కారం, 1991లో కళాప్రపూర్ణ పురస్కారం,పొట్టిశ్రీరాములు పురస్కారం, పద్మ శ్రీ పురస్కారాలు వరించాయి.
స్నేహితుడు, రచయిత ముళ్లపూడి రమణతో కలిసి లెక్కకుమించి సినిమాలు తీశారు బాపు.
బాపుకు ముళ్లపూడి వెంకట రమణ ఆప్త మిత్రుడు.
ముళ్లపూడితో కలిసి బాపు రూపొందించిన బుడుగు పుస్తకం తెలుగు సాహిత్యంలో ఒక క్లాసిక్.
♦1972లో తీసిన సంపూర్ణ రామాయణం జనాన్ని భక్తిపారవశ్యంలో ముంచేసింది.
తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాధ్యాయం ముత్యాలముగ్గు.
1975లో బాపు దర్శకత్వం వహించిన ఈ సినిమా.. తెలుగు సినిమా రంగానికే ఓ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది.
- సేకరణ

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...