పి.టి. ఉష తో సింధు

పి.టి. ఉష 18 సంవత్సరాల పూర్వం జరిగిన ఒక సంఘటనను గుర్తు తెచ్చుకుంటూ సోషల్ మీడియాలో ఈ ఫోటోను పోస్ట్ చేసి ట్వీట్ చేశారు. 2001 లో హైద్రాబాద్ లో అల్ ఇండియా రైల్వే మీట్ స్పోర్ట్స్ టోర్నమెంట్  జరిగింది. సింధు తండ్రి రైల్వేశాఖ లో పనిచేశారు.ఆయన వాలీబాల్ ప్లేయర్ కూడా.నేను బయట హోటల్స్ లోనే బస చేస్తాను. కానీ హైద్రాబాద్ లో జరిగిన ఈ టోర్నమెంట్ కు వెళ్ళినప్పుడు మాత్రం సింధు కుటుంబంతో ఉన్న పూర్వ పరిచయం కారణంగా వారి ఇంట్లోనే 3,4 రోజులు బస చేసాను.నా ఒడిలో కూర్చుని ఉన్న ఈ సింధు అప్పుడు చిన్నపిల్ల.