Skip to main content

ఆటోలో టాయ్ లెట్ -ప్రపంచం దృష్టికి ఆకర్షిస్తున్న హైదరాబాద్ మహిళ

ఆటోలో టాయ్ లెట్
 -ప్రపంచం దృష్టికి ఆకర్షిస్తున్న హైదరాబాద్ మహిళ

ఆటో అంటే ప్యాసింజర్స్ కోసం వాడటం చూశాం.. చెత్త తీసుకెళ్లే ఆటో చూశాం.. ట్రాన్స్ పోర్ట్ ఆటో చూశాం.. బిజినెస్ కోసం ఉపయోగించటం చూశాం.. ఆటోలో టాయ్ లెట్ ఏర్పాటు చేయటం ఎప్పుడైనా చూశాం.. ఇప్పటి వరకు చూడలేదు.. ఇప్పుడు దీన్ని సాధ్యం చేసింది హైదరాబాద్ కు చెందిన మహిళ. షీ టాయ్ లెట్ పేరుతో.. ఆటోలో క్లీన్ టాయ్ లెట్ ఏర్పాటు చేసి హైదరాబాద్ నగర వీధుల్లో తిరుగుతున్నాయి ఇప్పుడు. ప్రపంచంలోనే ఫస్ట్ టైం.. సృజనాత్మకంగా తయారైన ఈ టాయ్ లెట్ ఆటో విశేషాలు తెలుసుకుందాం…
సుష్మ కల్లెంపూడి అనే మహిళ.. 2017లో అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చింది. హైదరాబాద్ లో మహిళలు బయటకు వెళ్లినప్పుడు టాయ్ లెట్ కోసం ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ ఆవిష్కరణ చేసింది. ఓ ఆటోను మొబైల్ షీ టాయ్ లెట్ మార్చింది. ఈ ఆటోను జీహెచ్ఎంసీ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చూపించింది. మొబైల్ షీ టాయ్ లెట్ వల్ల రద్దీ ప్రాంతాల్లో మహిళలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని.. పర్యావరణ హితంగా పని చేస్తాయని గుర్తించిన ప్రభుత్వాలు.. ఇలాంటి ఆటోలను మరిన్ని ఏర్పాటు చేయటానికి ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో 25 ఆటోలు వీధుల్లో తిరుగుతున్నాయి.
ఒక్కో ఆటో తయారీకి 4 లక్షల రూపాయలు ఖర్చవుతుందని వివరించారు సుష్మ. మొబైల్ షీ ఆటోలో 100 లీటర్ల కెపాసిటీ వాటర్ ట్యాంక్, అద్దం, హ్యాంగర్, వాష్ బేసిన్, ఫ్లెష్, డ్రైనేజ్ సిస్టమ్ ఉంటాయి. అదే విధంగా చంటి పిల్లలకు డైపర్స్ మార్చుకోవటానికి అనువుగా స్థలం ఉంది. మహిళలకు అత్యవసరంగా కావాల్సిన శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా ఉంటాయి. శానిటరీ న్యాప్కిన్స్, సెల్ ఫోన్ ఛార్జింగ్ పాయింట్ ఉన్నాయి. ప్రతి ఆటోకు జీపీఎస్ కనెక్టెవిటీ ఉంది.
పాత ఆటోలను ఈ విధంగా మార్చటం జరిగిందని.. మంచి స్పందన వస్తుంది అంటున్నారు సృష్టి కర్త సుష్మ. స్వచ్ఛభారత్ తో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహం అందిస్తే.. వందలాది వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ మహిళ క్రియేటివిటీకి ప్రపంచం మొత్తం ఔరా అంటోంది. చాలా దేశాలు ఈ ఆలోచనను స్వాగతిస్తున్నాయి.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...