Skip to main content

కళాకారులుగా జన్మించరు, తయారు చేయబడతారు

కళాకారులుగా జన్మించరు, తయారు చేయబడతారు 
  -సినీ నటి డా. శ్రీజ సాదినేని

కళాకారులు అంటూ స్వతహాగా తల్లి గర్భంలో నుండి వచ్చేయరని, సరైన గురువు చేతిలో పడితే మామూలు మనుషులు సైతం మహానుభావులు కాగలరు అని ప్రముఖ సినీ,టీవీ,రంగస్థల నటి డా. శ్రీజ సాదినేని తెలిపారు.
ఆదర్శ కళా నిలయం 25వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాదులోని నాంపల్లిలో గల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోనీ నందమూరి తారక రామారావు ఆడిటోరియంలో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ ఉత్సవాలలో ఆమె పాల్గొన్నారు. నటిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, యాక్టింగ్ ఫ్యాకల్టీ గా, యాంకర్ గా.. విభిన్న రంగాలలో విశేష ప్రతిభ కనబరుస్తూ కళారంగంలో ధృవ తారగా వెలుగొందుతున్న ఆమెను ఆదర్శ కళానిలయం సంస్థ ఆదర్శ కళా ప్రతిభా అవార్డుతో ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా డా.శ్రీజ సాదినేని మీడియాతో మాట్లాడారు. చిన్నతంలోనే హరికథా కళాకారిణిగా కళారంగం లోకి ప్రవేశించిన తనకు తొలి గురువు తన తండ్రి,కీ. శే. సాదినేని నాగేశ్వర రావు అని, ఆ తర్వాత సంగీతంలో, నాట్యంలో, నటనలో, రచనలో, దర్శకత్వంలో ఎందరో గురువులు ఎన్నో మెళకువలు నేర్పారని, ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణమైన తమ గురువులని మరోసారి గుర్తు చేసుకుని వారికి నమస్సులు తెలిపారు.
2003 నుండి శ్రీ జయా ఆర్ట్స్ మరియు శ్రీజా మీడియా అకాడమీ సంస్థలను స్థాపించి,. ఎంతో మంది విద్యార్థులకు యాక్టింగ్, యాంకరింగ్, న్యూస్ రీడింగ్, డబ్బింగ్, వాయిస్ ఓవర్, స్టోరీ,స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్ రైటింగ్, డైరెక్షన్ వంటి కోర్సులతో పాటు థియేటర్ ఆర్ట్స్ కోర్సులో కూడా శిక్షణ ఇచ్చి  మీడియా,టీవీ, రంగస్థలం మరియు సినిమాలలో అవకాశాలు ఇప్పించిన తాను గురువుగా ఎంతో గర్వ పడుతున్నాను అని ఈ అవార్డు కూడా ఆ విభాగంలో వచ్చినందుకు సంతోష పడుతున్నాను అని శ్రీజ తెలిపారు.ఈ కార్యక్రమంలో సినీ ,టీవీ నటులు 
శ్రీ కోట శంకర్ రావు, కెప్టెన్ చౌదరి, ఆదేష్ రవి, అరుణా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...