Skip to main content

టాలెంట్ ఎంత ఉన్నా శిక్షణ తీసుకుంటేనే సినీరంగంలో రాణించగలం

టాలెంట్ ఎంత ఉన్నా శిక్షణ తీసుకుంటేనే సినీరంగంలో రాణించగలం
 - ప్రముఖ సినీ నటులు,దర్శకులు ఆదిత్య ఓం.
టాలెంట్ ఎక్స్ ప్రెస్:
సినీ రంగంలో రాణించాలంటే కఠోర సాధన, నటనలో శిక్షణ చాలా ముఖ్యమని, అందుకోసం ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకోవడం ఎంతో అవసరమని సినీ నటులు, దర్శకులు తెలిపారు.
సౌత్ ఇండియా లో నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ గా పేరుగాంచిన యఫ్. టి. ఐ. హెచ్. ( ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హైదరాబాద్ ) యాక్టింగ్ స్టూడెంట్స్ సర్టిఫికెట్ ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆదిత్య ఓం ముఖ్య అతిథిగా విచ్చేశారు. 
"తెలుగు,తమిళ,హిందీ, ఇంగ్లీష్ భాషలలో కలిపి దాదాపు 30కి పైగా చిత్రాలలో నటించడమే కాకుండా రచన, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టిన తాను కూడా ఒకప్పుడు యాక్టింగ్ స్టూడెంట్ నే అని, ఆ తర్వాత యాక్టింగ్ టీచర్ గా కూడా క్లాసెస్ చెప్పానని ఆదిత్య ఓం తెలిపారు.

విద్యార్థులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.

పెద్ద పెద్ద దర్శకులతో కలిసి పనిచేయడం తన అదృష్టమని, ఇప్పుడు కూడా దర్శకులు నటీనటులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ నటనను రాబట్టుకుంటున్నారు అని, భయాలు, అనుమానాలు వదిలి సినీరంగంలో ప్రయత్నాలు కొనసాగించాలని విద్యార్థులను ఆదిత్య ఓం ప్రోత్సహించారు. 
ఈ సందర్భంగా ఎఫ్. టి. ఐ.హెచ్. యాక్టింగ్ విద్యార్థులు   ఇచ్చిన ప్రదర్శనలను చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వారిని అభినందించారు.
యాక్టింగ్ కోర్సులో శిక్షణ పూర్తి చేసుకున్న 100 మందికి పైగా  విద్యార్థులకు ఆదిత్య ఓం సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో యఫ్. టి. ఐ. హెచ్. మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ ఉదయ్ కిరణ్ కటకం,
జురియల్ స్టూడియోస్ సీఈఓ శ్వేత కటకం, యఫ్. టి. ఐ. హెచ్. డీన్ యం. వి. రఘు,  యాక్టింగ్ ప్రొఫెసర్ అండ్ పీఆర్వో. డా.శ్రీజ సాదినేని, మరియు ఎఫ్. టి. ఐ.హెచ్. అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...