విశ్రాంత అధ్యాపక సంఘ ఆవిర్భావం



విశ్రాంత అధ్యాపక సంఘ ఆవిర్భావం 
   - అధ్యక్షురాలిగా కె. అనిల కుమారి
టాలెంట్ ఎక్స్ ప్రెస్: జిల్లా ప్రభుత్వ కళాశాలల విశ్రాంత అధ్యాపక సంఘ అధ్యక్షురాలిగా కె. అనిల కుమారి, కార్యదర్శిగా కేఈ ప్రసాద్ ఎన్నికయ్యారు. సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో మంగళవారం జిల్లా సంఘ ఆవిర్భావ సమావేశాన్ని నిర్వ హించారు. ఈసందర్భంగా సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కృష్ణ మాట్లాడుతూ 2016 యూజీసీ వేతనాలు అమలు చేసేందుకు సంఘం చేసిన కృషిని, సాధించాల్సిన అంశాలను వివరించారు. శాఖ కోశాధికారిగా పి. జయశ్రీ, కార్యనిర్వాహక సభ్యులుగా సీహెచ్ సుశీ లమ్మ, నాగేంద్రసాయి, రవిబాబు ఎన్నిక య్యారు. సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధాన సలహాదారు ఆంధోనీ తదితరులు పాల్గొన్నారు.