Skip to main content

Posts

Showing posts from September, 2021

శుభాకాంక్షలు

కాటూరి శిల్పకళా నైపుణ్యం దేశానికే గర్వకారణం

 కాటూరి శిల్పుల శిల్పకళా నైపుణ్యం దేశానికే గర్వకారణం  - రైల్వే ప్యాసింజర్స్ సర్వీస్ కమిటీ చైర్మన్ రమేష్ చంద్ర రతన్  టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:  కాటూరి శిల్పుల శిల్పకళా నైపుణ్యం దేశానికే గర్వకారణంగా నిలుస్తుందని రైల్వే ప్యాసింజర్స్ సర్వీస్ కమిటీ చైర్మన్ రమేష్ చంద్ర రతన్ అన్నారు. స్థానిక సూర్య శిల్పశాలలో శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు 14 అడుగుల ఎత్తు. రెండు టన్నుల ఐరన్ రొటీతో రూపొందించిన భారత ప్రధాని నరేంద్రమోడీ విగ్రహాన్ని ఆయన స్వయంగా సందర్శించారు. ఇటీవల ఈ విగ్రహ నిర్మాణం అన్ని మీడియాలో వైరల్ గా మారిన విషయం విధితమే. విభిన్న ఆలోచనలతో సృజనాత్మకంగా శిల్పాలను రూపొందించడంలో కాటూరి శిల్పుల ఖ్యాతి విశ్వవ్యాప్తంగా విస్తరించింది. వరల్డ్ రికార్డులను నెలకొలిపారు కాటూరి శిల్పులు. వీరి శిల్పకళా నైపుణ్యంను ప్రధాని మోడీ విగ్రహం రూపంలో తెలుసుకున్న రమేష్ చంద్ర రతన్ గురువారంప్రధాని విగ్రహాన్ని తిలకించారు. ఐరన్ స్క్రాబ్ తో మనిషి పోలికలతో విగ్రహం రూపొందించడం ఎంతో కష్టతరమని ఏ మాత్రం పోలికలు పోకుండా సజీవంగా ప్రధాని విగ్రహాన్ని సజీవంగా ఆవిష్కరించారని శిల్పులను అభినందించారు. శి...

భారత ప్రధాని విగ్రహాన్ని రూపొందించిన సూర్య శిల్పశాల శిల్పులు

భారత ప్రధాని విగ్రహాన్ని రూపొందించిన సూర్య శిల్పశాల శిల్పులు టాలెంట్ ఎక్స్ ప్రెస్: రెండు టన్నుల ఐరన్ స్క్రాప్ తో, 14 అడుగుల ఎత్తుతో భారత ప్రధాని ప్రధానమంత్రి నరేంద్రమోడీ  విగ్రహాన్ని పట్టణానికి చెందిన సూర్య శిల్పశాల శిల్పులు రూపొందించారు.. ఐరన్ స్క్రాప్ విగ్రహాలు తయారు చేయుటలో సూర్య శిల్పశాల కు అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నది. వరల్డ్ రికార్డు కోసం ఇటీవల 75 వేల నట్లను ఉపయోగించి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని రూపొందించారు. ఆ విగ్రహాన్ని మీడియా ద్వారా చూసిన బెంగళూరుకు చెందిన ఒక సంస్థ కోరికమేరకు నరేంద్రమోడీ విగ్రహాన్ని ఐరన్ ప్ తో రూపొందించామని, ఐరన్ స్క్రాప్ తో మనిషి పోలికలో అందున ప్రస్తుత ప్రధానమంత్రి విగ్రహం రూపొందించడం అంటే ఎంతో సాహసంతో కూడుకున్నది అని ఏ మాత్రం విగ్రహ రూపం సరిగా లేదు అని పేరు వచ్చినా ఇన్నాళ్ళు వారి సంస్థకు ఉన్న పేరుకు విగూతం కలుగుతుంది అని ముందు సంసయించినా,ధైర్యం చేసి తయారీకి అంగీకరించినట్లు తెలిపారు. రెండు నెలలు నిరంతరం రేయింబవళ్లు శ్రమించి ఈ విగ్రహాన్ని సజీవంగా రావడానికి కృషి చేసామన్నారు. విగ్రహం తయారీలో విజయం సాధించినట్లు భావిస్తున్నామని శిల్ప...

రసవత్తరంగా సాగిన చాకలి ఐలమ్మ నాటక ప్రదర్శన

రసవత్తరంగా సాగిన చాకలి ఐలమ్మ నాటక ప్రదర్శన టాలెంట్ ఎక్స్ ప్రెస్: సౌత్ జోన్ కల్చర్ సెంటర్ తంజావూర్ ,మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సౌజన్యం తో నవకళా భారతి షాద్ నగర్ వారి ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్ లో ఆంధ్ర సారస్వత పరిషత్ హైదరాబాద్ లో ప్రదర్శించిన చాకలి ఐలమ్మ చారిత్రాత్మక నాటకం రసవత్తరంగా సాగింది. ప్రేక్షకులకు ఆకట్టుకుంది. కార్యక్రమం కో ఆర్డినేటర్  టీ.వీ.రంగయ్య మాట్లాడుతూ తెలంగాణ పోరాట యోధురాలు  ఆనాటి దేశ్ ముఖ్ లు దొరల దౌర్జన్యాలను ,దురాగతాలను , దోపిడీలను ధైర్యంగా ఎదుర్కొని  దొరల గుండెల్లో ఫిరంగి మోతలు మోగించి ధైర్యంగా పోరాడి దొరల గడీలను బద్దలు కొట్టి ప్రజకు.స్వేచ్చ ను ప్రసాదించిన  వీరవనిత ఐలమ్మ అని అన్నారు.  అలాంటివారు మనకు సదా స్మరణీయులు ముందు తరాలకు వారి త్యాగాలు ఆదర్శనీయం, స్ఫూర్తివంతం అని అన్నారు.  స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల సందర్భంగా ఇలాంటి త్యాగమూర్తి ల గాథలను నాటక రూపం లో ప్రదర్శించి  ముందు తరాలకు  స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశ్యంతో  ప్రభుత్వ సహకారంతో ఈ నాటకాన్ని ప్రదర్శిస్తున్నామన్నారు. నటీనట...

ad

నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగదు. ఏపీడబ్ల్యూజేఎఫ్‌ సమావేశంలో సజ్జల

నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగదు ఏపీడబ్ల్యూజేఎఫ్‌ సమావేశంలో సజ్జల టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:  ప్రభుత్వం ఇచ్చే రాయితీలన్నీ అర్హులైన జర్నలిస్టులకు  అందాలన్నదే రాష్ట్ర ప్రభుత్ ఉద్దేశమని,ఏనిజమైన జర్నలిస్టుకుఅన్యాయం జరగదని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సంఖ్య చిన్నదా? పెద్దదా? అనే సంబంధం లేదని, యాజమాన్యాల నుంచి పొందలేని సౌకర్యాలను కోరుతున్నప్పుడు జర్నలిజంలోని నకిలీలను వేరాయాల్సి ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జర్నలిస్టులపై వ్యతిరేక భావమేమీ లేదని వివరించారు.  జర్నలిస్టులంటే ముఖ్యమంత్రికి అపారమైన గౌరవ భావం ఉందన్నారు. నేషనల్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్ (ఎన్‌ఏజే) పిలుపు మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ (ఏపీయూజేఎఫ్‌) విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మిడిల్‌ ఇన్‌కమ్‌ గ్రూపు (ఎంఐజీ)లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోందన్నారు. దీనిపై త్వరలో విధివిధానాలను ప్రకటిస్తామన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల...

జర్నలిస్టుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి   తెనాలి: రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్ ల రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు తెనాలి డివిజన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్షులు టి. రవీంద్ర బాబు మాట్లాడుతూ ఎంతో కాలంగా పరిష్కారం నోచుకోని జర్నలిస్టుల అక్రిడిటేషన్లను ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులందరికీ మంజూరు చేయాలన్నారు. అదేవిదంగా ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులను జర్నలిస్టులకు అందజేయాలన్నారు. ఇళ్ల స్థలాలపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ఫెడరేషన్ కార్యదర్శి కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ భారతదేశంలో జర్నలిస్టు వృత్తి, జర్నలిస్టులు ఎదుక్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని జర్నలిజాన్ని కాపాడండి, జర్నలిస్టులను రక్షించండి అనే నినాదంతో నేషనల్ అలయెన్స్ ఆఫ్ జర్నలిస్టు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉద్యమ...