Skip to main content

జర్నలిస్టుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి 

తెనాలి: రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్ ల రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు తెనాలి డివిజన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్షులు టి. రవీంద్ర బాబు మాట్లాడుతూ ఎంతో కాలంగా పరిష్కారం నోచుకోని జర్నలిస్టుల అక్రిడిటేషన్లను ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులందరికీ మంజూరు చేయాలన్నారు. అదేవిదంగా ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులను జర్నలిస్టులకు అందజేయాలన్నారు. ఇళ్ల స్థలాలపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ఫెడరేషన్ కార్యదర్శి కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ భారతదేశంలో జర్నలిస్టు వృత్తి, జర్నలిస్టులు ఎదుక్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని జర్నలిజాన్ని కాపాడండి, జర్నలిస్టులను రక్షించండి అనే నినాదంతో నేషనల్ అలయెన్స్ ఆఫ్ జర్నలిస్టు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉద్యమ వారం నిర్వహిస్తుందని అందులో బాగంగా ఎన్.జె.యూ అనుబంద సంస్థల ఆధ్వర్యంలో తెనాలి డివిజన్ లోనూ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. జర్నలిస్టుల సమస్యలను తక్షణం పరిష్కరించి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. తాత్కాలిక అక్రిడిటేషన్ల పక్రియ కాకుండా చిన్న పత్రికలకు జిఎస్టీ తో సంబందం లేకుండా పూర్తి కాలం పనిచేసే అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేసారు. కోవిలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. సంక్షేమ కమిటీని ఏర్పాటుచేసి నిధులు మంజూరు చేయాలన్నారు. మీడియా కమిషన్ ఏర్పాటుచేయాలని కోరారు. రాష్ట్ర, జిల్లా మీడియా కమిటీల్లో ఫెడరేషన్ కు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా కు ఫెడరేషన్ నాయకులు, సభ్యులు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు ఎస్.ఎస్. జహీర్, జి. ప్రకాశరావు, జి. ప్రేమ్ కుమార్, బి. సురేష్ బాబు, ఎం. రవికుమార్, శ్యామ్ సాగర్, సభ్యులు పి. పున్నయ్య, సాంబశివరావు, భూషణం, డి. కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, తదిరరులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...