Skip to main content

కాటూరి శిల్పకళా నైపుణ్యం దేశానికే గర్వకారణం


 కాటూరి శిల్పుల శిల్పకళా నైపుణ్యం దేశానికే గర్వకారణం 

- రైల్వే ప్యాసింజర్స్ సర్వీస్ కమిటీ చైర్మన్ రమేష్ చంద్ర రతన్ 

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: 

కాటూరి శిల్పుల శిల్పకళా నైపుణ్యం దేశానికే గర్వకారణంగా నిలుస్తుందని రైల్వే ప్యాసింజర్స్ సర్వీస్ కమిటీ చైర్మన్ రమేష్ చంద్ర రతన్ అన్నారు. స్థానిక సూర్య శిల్పశాలలో శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు 14 అడుగుల ఎత్తు. రెండు టన్నుల ఐరన్ రొటీతో రూపొందించిన భారత ప్రధాని నరేంద్రమోడీ విగ్రహాన్ని ఆయన స్వయంగా సందర్శించారు. ఇటీవల ఈ విగ్రహ నిర్మాణం అన్ని మీడియాలో వైరల్ గా మారిన విషయం విధితమే. విభిన్న ఆలోచనలతో సృజనాత్మకంగా శిల్పాలను రూపొందించడంలో కాటూరి శిల్పుల ఖ్యాతి విశ్వవ్యాప్తంగా విస్తరించింది. వరల్డ్ రికార్డులను నెలకొలిపారు కాటూరి శిల్పులు. వీరి శిల్పకళా నైపుణ్యంను ప్రధాని మోడీ విగ్రహం రూపంలో తెలుసుకున్న రమేష్ చంద్ర రతన్ గురువారంప్రధాని విగ్రహాన్ని తిలకించారు. ఐరన్ స్క్రాబ్ తో మనిషి పోలికలతో విగ్రహం రూపొందించడం ఎంతో కష్టతరమని ఏ మాత్రం పోలికలు పోకుండా సజీవంగా ప్రధాని విగ్రహాన్ని సజీవంగా ఆవిష్కరించారని శిల్పులను అభినందించారు. శిల్పుల విశేషాలను ప్రధానికి వివరిస్తామన్నారు. స్కాబ్ తో ఇలాంటి విగ్రహాన్ని తొలి సారిగా చూస్తున్నామన్నారు. శిల్పులు వెంకటేశ్వరరావు, రవిచంద్రలను ఆయన సత్కరించారు. రైల్వే ప్యాసింజర్స్ సర్వీస్ కమిటీ చైర్మన్, భారతీయ జనతా పార్టీ నాయకులు రమేష్ చంద్ర రతన్ కు శిల్పులు కృతజ్ఞతలు తెలిపారు. మెమెంటో, బ్రెస్ట్ సైజ్ ప్రధాని ఫైబర్ విగ్రహాన్ని అందజేశారు. వీరితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్యాసింజర్స్ సర్వీస్ కమిటీ సభ్యులు టి. గంగాధర్, గురవిందర్ సింగ్ పెట్టి, కిషోర్ షాన్ బే, బేబి చాణక్య, రాంవీర్ బట్టి, లాల్ మణిపాల్, గుంటూరు ఏ.డి.ఆర్.ఎం ఆర్ శ్రీనివాస్, సీనియర్ డి.సి.ఎం నరేంద్ర వర్మలు విచ్చేసారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...