Skip to main content

Posts

Showing posts from October, 2021

షెడ్యూల్ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జెడ్పి చైర్ పర్సన్ హెని క్రిస్టినా కు ఘన సత్కారం

తెనాలి :ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విలువలు, విశ్వసనీయతకు ప్రాధాన్యత ఇస్తారని అందుకు ఉదాహరణ హెనీ క్రిస్టినా కు దక్కిన జడ్పీ పదవి అని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. షెడ్యూల్ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి జెడ్పి చైర్ పర్సన్ హెని క్రిస్టినా కు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమావేశానికి ఐక్యవేదిక నాయకుడు గుంటూరు కృష్ణ అధ్యక్షత వహించారు.హోం మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసిన క్రిస్టినా సురేష్ దంపతులకు రెండోసారి సీటు రాకపోయినా నిరాశ చెందలేదని జగన్ మాట విన్నందుకు వారికి మంచి ప్రతిఫలం దక్కిందని అన్నారు. ఆయన నమ్ముకున్నవారికి ఎన్నటికీ అన్యాయం జరగదని చెప్పారు.తన రాజకీయ ప్రస్థానం జెడ్పీటీసీ గా ప్రారంభమైందని ఫిరంగిపురం జడ్పిటిసిగా ఉన్నప్పుడు హార్వెస్ట్ ఇండియా సంస్థ నిర్వాహకులైన సురేష్ దంపతులను ఆరు బోర్లు కావాలి అని అడిగానని వెంటనే వారు స్పందించి వాటిని వేయించాలని అయితే అంతకుముందు ఎప్పుడూ కూడా నీళ్లు పడలేదని అయితే ఈ ఆరు బోర్లలో నీళ్లు వచ్చాయని ఆనందం వ్యక్తం చే...

ఎన్‌సీసీ ట్రైనింగ్‌ క్యాంప్‌లో సత్తాచాటిన విజ్ఞాన్స్‌ లారా విద్యార్థులు

ఎన్‌సీసీ ట్రైనింగ్‌ క్యాంప్‌లో సత్తాచాటిన విజ్ఞాన్స్‌ లారా విద్యార్థులు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఎన్‌సీసీ యాన్యువల్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌లో సత్తాచాటారని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఏర్పాటు చేసిన అభినందన సభలో ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ నాగార్జున యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన 10ఏ బాలికల ఎన్‌సీసీ బెటాలియన్‌ యాన్యువల్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌లో విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన షేక్‌ నజ్మా సుహానాకు బెస్ట్‌ క్యాడెట్‌ అవార్డు, సోలో డాన్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిందని తెలియజేసారు. అంతేకాకుండా ఈ ట్రైనింగ్‌ క్యాంప్‌లో గ్రూప్‌ డ్యాన్స్‌ విభాగంలో ఎస్‌.తేజస్విని దేవి, బీ.లక్ష్మీ సాత్విక భాయ్, కమలశ్రీలకు గోల్డ్‌ మెడల్, వకృత్వ పోటీలో కే.కమలశ్రీకు గోల్డ్‌ మెడల్, డ్రిల్‌ విభాగంలో డీ.సజనాబీ, బీ.రాగిణి వైష్ణవీలకు సిల్వర్‌ మెడల్, ఫైరింగ్‌ విభాగంలో ఎస్‌.డీ.మారూఫాకు సిల్వర్‌ మెడల్‌ లభించిందని పేర్కొన్నారు. మెడల్స్‌ సాధించిన విద...

284 మంది విజ్ఞాన్స్‌ లారా విద్యార్థుకు ఉద్యోగాలు

284 మంది విజ్ఞాన్స్‌ లారా విద్యార్థుకు ఉద్యోగాలు   179 మంది విద్యార్థులు విప్రో సంస్థకు ఎంపిక   105 మంది యాక్సించ్యూర్‌ కంపెనీకు ఎంపిక చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలోని∙నాలుగో సంవత్సరానికి చెందిన 284 మంది విద్యార్థులు ప్రముఖ బహుళజాతి సంస్థలైన  విప్రో, యాక్సించ్యూర్‌ వంటి బహుళజాతి కంపెనీలకు ఎంపికయ్యారని విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ ఫణీంద్రకుమార్‌ మాట్లాడుతూ ఉద్యోగాలు సాధించిన 284 మంది విద్యార్థులు రూ.3.75 లక్షల వార్షిక వేతనం నుంచి రూ.7 లక్షల వార్షిక వేతనానికి ఎంపికయ్యారని వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులలో సీఎస్‌ఈ విభాగం నుంచి 118 మంది, ఈసీఈ విభాగం నుంచి 101 మంది, ఐటీ విభాగం నుంచి 31 మంది, ఈఈఈ విభాగం నుంచి 21 మంది, మెకానికల్‌ విభాగం నుంచి 10 మంది, సివిల్‌ విభాగం నుంచి 3 గురు విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు.   ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను...

విజ్ఞాన్స్‌లో సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ప్రారంభం

విజ్ఞాన్స్‌లో సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ప్రారంభం  చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో బుధవారం సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ప్రారంభం చేసామని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్లాంట్‌ను ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీసీ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ఈ ప్లాంట్‌ను సివిల్‌ ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో కోటి రూపాయల వ్యయంతో ప్రతిరోజు 7 లక్షల లీటర్ల వ్యర్ధమైన నీటిని కన్‌స్ట్రక్టెడ్‌ వెట్‌ ల్యాండ్‌ టెక్నాలజీతో తక్కువ విద్యుత్‌ను వినియోగించి శుద్ధి చేస్తామని తెలిపారు. ఈ ప్లాంట్‌ ద్వారా వ్యర్ధ నీటిని గ్రీన్‌ టెక్నాలజీ సాయంతో శుద్ధి చేయడం వలన పర్యావరణ హితంతో కూడిన జల వనరులను ఆదాచేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వ్యర్ధ నీటిని శుద్ధిచేయడానికి ఈ గ్రీన్‌ టెక్నాలజీను వినియోగిస్తున్న మొట్టమొదటి యూనివర్సిటీ తమదేనని తెలియజేసారు. ఈ టెక్నాలజీ ద్వారా శుద్ధి చేసిన నీటిని గార్డెనింగ...

తెనాలిలో నేను లేని నా ప్రేమ కధ విజయోత్సవం

- తెనాలిలో నేను లేని నా ప్రేమ కధ విజయోత్సవం - చిత్ర మాటల రచయితకు సత్కారం  తెనాలి: పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు సాబీర్ షా నేనులేని నా ప్రేమ కధ చిత్రానికి మాటలు అందించి ప్రేక్షకులనుంచి సెహబాష్ అనిపించుకున్నారు. స్థానిక సంగమేశ్వర ధియోటర్ లో శుక్రవారం నేనులేని నా ప్రేమ కథ చిత్రం విడుదలయ్యింది. ఈ సందర్భంగా తొలిసారిగా వెండితెరకు మాటల రచయితగా పరిచయం అయిన సాబీర్ షాను పట్టణంలోని పలువురు కళాకారులు, కళాసంస్థల నిర్వాహకులు ఆయనను అభినందించారు. సరస్వతి క్రియేషన్స్, త్రిషాల్ ఎంటర్ టైనమెంట్ పతాకాలపై లక్షీ. కందుకూరి సమర్పించిన ఈ చిత్రానికి సురేష్ ఉత్తరాది దర్శకత్వం వహించగా నవీన్ చంద్ర, గాయత్రి సురేష్, స్వీటి దివిజ, క్రిష్, అతిది, రాజారవీంద్ర తదితరులు నటీనటులు. ఎస్.ఎ. భూపతి సినిమాటోగ్రాఫర్, జువెన్ సింగ్ సంగీతం అందించారు. ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. ముఖ్యంగా ప్రేమైనా పశ్చాతాపం అయినా అది గొంతు పలకాల్సిన  బాష కాదు, కళ్ళు తెలపాల్సిన భావం. అమాయకత్వం బ్రతికినంతవరకు మోసం గెలుస్తూనే ఉంటుంది. ఏమి జరగలేదు అనుకో జనంతో ఉంటాను, ఏమైనా జరిగితే జనంలో ఉంటాను జ్ఞాపకంగా వంటి ఎన్నో డ...