*గుంటూరు రైల్వే డివిజన్లోని పలు రైల్వే సమస్యలకు పరిష్కారం కోరుతూ.. నేడు ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని విష్ణవ్ గారిని నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కలిశారు.* ▪️ గుంటూరు రైల్వే స్టేషన్ రిమోడలింగ్ (పునర్మిర్మాణం) ప్రక్రియను కొనసాగించాలని.. రిమోడలింగ్కు ఎన్నో ఏళ్ల తర్వాత రూ.80కోట్లు కేటాయించబడ్డాయని, అయితే ఈ ప్రాజెక్టు ప్రస్తుతం రద్దు చేయబడిందని, మంజూరైన నిధులను ఇతర రైల్వే డివిజన్లకు కేటాయిస్తున్నారని మంత్రి గారికి విన్నవించారు. రాష్ట్రంలో గుంటూరు రైల్వే స్టేషన్కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా.. నిధులు మరలా కేటాయించి ప్రాజెక్ట్ ను కొనసాగించాలని కోరారు. ▪️ ప్రజలు, రైతుల ప్రయోజనాల దృష్ట్యా లెవల్ క్రాసింగ్ గేట్ల స్థానంలో అవసరమైన చోట ఆర్యుబిలు, ఆర్ఓబీల నిర్మాణాలు చేపట్టాలని... గుంటూరు డివిజన్లోని లెవల్ క్రాసింగ్ గేట్ల సంఖ్యలు– 27, 40, 53, 64, 81, 89, 106, 263, 264, 257, 269, 283, 287, 50, 57, 60, 61, 69, 71, 72, 75, 80 గేట్లను మార్చాలని విన్నవించారు. ▪️అలాగే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ (02795) నడికుడి జంక్షన్...