Skip to main content

ఘనంగా ముగిసిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సం

ఘనంగా ముగిసిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సం 

- చిత్రోత్సవంలో సందడి చేసిన సినీ ప్రముఖులు 
- పలు దేశాల సందేశాత్మక సినిమాల ప్రదర్శన 
- బాలల నుంచి విశేష స్పందన తెనాలి
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో గతరెండు 
రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం సోమవారం ఘనంగా ముగిసింది. స్థానిక కొత్తపేట తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా తెనాలి కల్చరల్ ఫిల్మ్ సొసైటీ, తెనాలి పురపాలక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో చిత్రోత్సవాలు జరిగాయి. సినిమాల్లోని మంచిని మాత్రమే గ్రహించాలని, చెడును వదలి వేయాలని విచ్చేసిన సినీ రంగ ప్రముఖులు పేర్కొన్నారు. చిత్రోత్సవాలను తిలకించి విజయవంతం చేసిన ప్రభుత్వ, ప్రవేటు విద్యా సంస్థల విద్యార్ధులకు నిర్వహకులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు సభలో సొసైటీ చైర్మన్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ చిత్రోత్సవానికి సహకరించిన శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్, పురపాలక సంఘానికి  కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం నుంచి తెనాలి డివిజన్ లో విద్యాసంస్థలో చిత్రాలను సొసైటీ ద్వారా ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నారు. సొసైటీ కార్యదర్శి బొల్లిముంత కృష్ణ, ఉపాధ్యక్షులు రామరాజు, సభ్యులు జి. వెంకట రత్నం లు ఉత్తమ చిత్రాలను తిలకించడం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న  బాలీఉడ్ చైల్డ్ స్టార్ భాను ప్రకాష్ తన డాన్స్, నటన , కర్రసాము ప్రదర్శించి అబ్బురపరచాడు. బ్రీత్ లెస్ డైలాగ్ లు చెప్పి ప్రేక్షకులను మెప్పించాడు. చిత్రోత్సవంలో త్వరలో విడుదల కాబోతున్న కళ్యాణమస్తు చిత్రయూనిట్ సందడి చేసారు. ఆట, పాటలతో ఉత్సాహం నింపారు. చిత్ర కథానాయకుడు శేఖర్ వర్మ, కథానాయికి  వైభవి రాజ్, నిర్మాత బోయపాటి రఘబాబు, దర్శకుడు ఓంసాయి, కోడైరెక్టర్ రాంకీ, కొరియోగ్రాఫర్ పట్టణానికి చెందిన సుధీర్ లతో పాటు దర్శకులు ఎ. సురేష్, సొసైటీ సభ్యులు మురళీ, కౌషిక్, కనపర్తి రత్నాకర్, శ్రీకాంత్ మునిపల్లి, చౌదరి, బెల్లంకొండ వెంకట్, తదితులు పాల్గొన్నారు అతిధులను సొసైటీ జ్ఞాపిక, శాలువాలతో సత్కరించారు, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...