విజ్ఞాన్స్ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్డీ
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ భాగానికి చెందిన అప్పన సాయి మణిదీప్ తమ యూనివర్సటీ పీహెచ్డీ పట్టా అందించిందని ఇంచార్జి వైస్ చాన్స్లర్ డాక్టర్ కేవీ క్రిష్ణకిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ అనలైజింగ్ ద మీడియేటింగ్ రోల్ ఆఫ్ సర్వీస్ క్వాలిటీ ఆన్ కంజూమర్ రీపర్చేజ్ ఇంటెన్షన్ ఇన్ వెల్నెస్ ఇండస్ట్రీ: ఆన్ ఎక్స్టెన్షన్ టు «థియరీ ఆఫ్ ప్లాన్డ్ బిహేవియర్’’ అనే అంశంపై పరిశోధన చేశారని తెలియజేశారు. ఈయనకు విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.శివకోటిరెడ్డి గైడ్గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన తన పరిశోధనలో భాగంగా మొత్తం 7 స్కూపస్ జర్నల్ పబ్లికేషన్, 3 నేషనల్, 2 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పేపర్లు పబ్లిష్ చేశారని తెలియజేసారు.