Skip to main content

సవాళ్లను స్మార్ట్‌గా అధిగమించాలి

సవాళ్లను స్మార్ట్‌గా అధిగమించాలి

  ఇంటర్నేషనల్‌ మోటివేషనల్‌ స్పీకర్, యూత్‌ కౌన్సిలర్, గ్లోబల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్‌ విజేత రాధేశ్యామ్‌ దాస్‌

  విజ్ఞాన్స్‌ వర్సిటీలో ఘనంగా ఆర్ట్‌ ఆఫ్‌ స్మార్ట్‌ వర్క్‌పై ప్రత్యేక అతిథి ఉపన్యాసం

విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్మార్ట్‌ వర్క్‌తో స్మార్ట్‌గా అధిగమించాలని ఇంటర్నేషనల్‌ మోటివేషనల్‌ స్పీకర్, యూత్‌ కౌన్సిలర్, గ్లోబల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్‌ విజేత రాధేశ్యామ్‌ దాస్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ యాక్టివిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ‘‘ ఆర్ట్‌ ఆఫ్‌ స్మార్ట్‌ వర్క్‌’’ అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాసాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ యూత్‌ కౌన్సిలర్, గ్లోబల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్‌ విజేత రాధేశ్యామ్‌ దాస్‌ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో మూడు ( బుక్‌ ఆఫ్‌ యువర్‌ లైఫ్, సెల్ఫ్‌ టెస్ట్‌ పర్సనాలిటీ టైప్, స్మార్ట్‌ టైమ్‌ మేనేజర్‌) టిప్స్‌ను పాటించాలన్నారు. విద్యార్థులకు క్రియేటివిటీ మైండ్‌ సెట్‌తో పాటు అవుట్‌ ఆఫ్‌ బాక్స్‌ థింకింగ్‌ ఉండాలన్నారు. విద్యార్థలు ప్రతిరోజు మెడిటేషన్, యోగ, ప్రాణాయామంలు చేయడంతో పాటు రిలేషన్‌షిప్‌ బిల్డింగ్, సబ్జెక్ట్‌ ట్రైనింగ్, స్టడీ ప్లానింగ్‌ ఉండాలన్నారు. విద్యార్థులు సోషల్‌ సామాజిక మాధ్యమాలను వినియోగిస్తూ సమయాన్ని వృథా చేసుకోరాదన్నారు. విద్యార్థులకు మొదట థింకింగ్‌తో పాటు విజన్‌ను ఏర్పరుచుకుని ఆచరణలో పెట్టాలన్నారు.  విద్యార్థులకు మంచితనం(సత్వ గుణ), అభిరుచి (రజోగుణ)లను పెంచుకుని అజ్ఞానం(తమో గుణ) విడనాడాలన్నారు. విద్యార్థులకు స్మార్ట్‌ వర్క్‌కు హార్డ్‌ వర్క్‌కు మధ్యనున్న తేడాలను వివరించారు. విద్యార్థులు ఏ విషయాన్ని అయినా వాయిదా వేయకూడదని, ఇతరుల గురించి వేరేవాళ్ల దగ్గర మాట్లాడటం మానేసి అందరితో విధేయతగా ఉండాలన్నారు. అనంతరం విద్యార్థులకు క్విజ్‌ పోటీలను నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ చూపిన మొదటి 15 మంది విద్యార్థులకు బహుమతులను అందజేయడంతో పాటు 500 మంది విద్యార్థులకు ఐఐటీ బాంబేకు చెందిన పూర్వ విద్యార్థుల చేత ఉచిత మోటివేషన్‌ క్లాసులను నిర్వహించనున్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...