క్రానియన్ చర్చ్ ఆధ్వర్యంలో సెమి క్రిస్మస్ వేడుకలు

స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కళాశాలలో    క్రానియన్ చర్చ్ ఆధ్వర్యంలో శనివారం సెమి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాతీయ త్రో బాల్ కెప్టెన్ సునీల్, మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వర రావు మాట్లాడుతూ యేసు క్రీస్తు కృప తో గత మూడు రోజులుగా క్రానియన్ చర్చి వారు సువార్త కూడికలు నిర్వహించడం అభినందనీయమన్నారు. . ప్రేమ, కరుణ, అందరికీ పంచాలని ఏసుక్రీస్తు చెప్పినట్టుగా వారి బోధనలు ఆచరించాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు గుర్తించి వారికి మంచి మనసుతో నూతన వస్త్రాలు బహిష్కరించడం ఆనందించదగ్గ విషయం మన్నారు.జాతీయ త్రో బాల్   కెప్టెన్ చావలి సునీల్ మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారని, వారిని గౌరవించడం మన బాధ్యతగా భావించాలని తెలిపారు. సెమి క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నా పున్నయ్యను ఆయన అభినందించారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలను అతిథులు గుంటూరు కోటేశ్వరరావు, చావలి సునీల్ అందజేశారు ఈ కార్యక్రమంలోనూ పాస్టర్ లు  తంగిరాల యోబు, మంచాల సురేష్, కొప్పుల  కాలేబు, గొళ్ళ సతీష్ బాబు, గోళృ ధీరజ్ తదితరులు పాల్గొన్నారు