వినియోగదారుల శ్రేయస్సే తమ బ్యాంకు లక్ష్యం


టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
వినియోగదారుల శ్రేయస్సే తమ బ్యాంకు లక్ష్యమని బ్యాంక్ ఆఫ్ ఇండియా గుంటూరు ఏరియా మేనేజర్ కె .ఎస్. పవన్ కుమార్ చెప్పారు తెనాలి  బుర్రిపాలెం రోడ్డులో టీ. జీ.కేకళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఖాతాదారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వినియోగదారులకు అవసరమైన రుణాలను తక్కువ వడ్డీకేఅందిస్తామని తెలిపారు. వ్యవసాయానికి, పశు సంపదకు, ల్యాండ్ డెవలప్మెంట్ కు ,చదువుకునే విద్యార్థులకు నర్సరీలు పెంచుకునేందుకు, రుణాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. ఏ బ్యాంకు ఇవ్వని విధంగా అందరికీ రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. వ్యాపారులు కూడా రుణ సదుపాయం అందిస్తున్నట్లు చెప్పారు. చిన్న బడ్డీ కొట్టు  దగ్గర్నుంచి పెద్ద పరిశ్రమల వరకు రుణాలు ఇస్తామన్నారు. గృహాలకు 6.5 శాతం వడ్డీ అంటే కేవలం 53 పైసలు పడుతుందని చెప్పారు. వాహనాలు కూడా అతి తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తామన్నారు. హౌసింగ్ లోన్ లు రెండు సంవత్సరాల పాటు కడితే వారు ఇన్కమ్ టాక్స్ పరిధిలోకి వస్తే ఇంకా తక్కువ అని చెప్పారు. అదేవిధంగా హౌస్ సైట్ వ్యాల్యూ ని బట్టి 75 శాతం వరకు రుణాలు ఇస్తామని వెల్లడించారు. పర్సనల్ లోన్స్ ఏడున్నర లక్షల వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఇస్తామన్నారు‌. అదేవిధంగా దేశ,విదేశాలలో చదువుకునే విద్యార్థులకు 80 లక్షల వరకు లోను సదుపాయం ఉందని, అయితే ఆస్తిని తనఖ పెట్టాల్సి ఉంటుందని చెప్పారు. బంగారు నగలపై 80 శాతం వరకు రుణ సదుపాయంఉందన్నారు. ఈ సందర్భంగా వినియోగదారులకు రుణాలు పంపిణీ చేశారు. ఈ ఈ కార్యక్రమంలో లో ఎస్ కే సి వి ఇన్చార్జ్ వెంకటేశ్వరరావు, ఆర్ బి సి ఆఫీసర్ వెంకటరెడ్డి, తెనాలిలోని మూడు శాఖల బ్రాంచ్ మేనేజర్ లు కె. రవి ,అబ్దుల్ గఫూర్, కె. శ్రీకాంత్ సిబ్బంది ఖాతాదారులు పాల్గొన్నారు.