Skip to main content

గుంటూరు రైల్వే డివిజన్‌లోని పలు రైల్వే సమస్యలను పరిష్కరించాలి

*గుంటూరు రైల్వే డివిజన్‌లోని పలు రైల్వే సమస్యలకు పరిష్కారం కోరుతూ.. నేడు ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని విష్ణవ్‌ గారిని నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కలిశారు.*

▪️ గుంటూరు రైల్వే స్టేషన్‌ రిమోడలింగ్‌ (పునర్మిర్మాణం) ప్రక్రియను కొనసాగించాలని..  రిమోడలింగ్‌కు ఎన్నో ఏళ్ల తర్వాత రూ.80కోట్లు కేటాయించబడ్డాయని, అయితే ఈ ప్రాజెక్టు ప్రస్తుతం రద్దు చేయబడిందని, మంజూరైన నిధులను ఇతర రైల్వే డివిజన్‌లకు కేటాయిస్తున్నారని మంత్రి గారికి విన్నవించారు.  రాష్ట్రంలో గుంటూరు రైల్వే స్టేషన్‌కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా.. నిధులు మరలా  కేటాయించి ప్రాజెక్ట్ ను కొనసాగించాలని కోరారు.

▪️ ప్రజలు, రైతుల ప్రయోజనాల దృష్ట్యా లెవల్‌ క్రాసింగ్‌ గేట్‌ల స్థానంలో అవసరమైన చోట ఆర్‌యుబిలు, ఆర్‌ఓబీల నిర్మాణాలు చేపట్టాలని...
 గుంటూరు డివిజన్‌లోని లెవల్‌ క్రాసింగ్‌ గేట్‌ల సంఖ్యలు– 27, 40, 53, 64, 81, 89, 106, 263, 264, 257, 269, 283, 287, 50, 57, 60, 61, 69, 71, 72, 75, 80 గేట్‌లను మార్చాలని విన్నవించారు.

▪️అలాగే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ (02795) నడికుడి జంక్షన్‌లో ఆపాలని..
▪️ ఫలక్‌నూమా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌(02704) సత్తెనపల్లిలో ఆగుట గురించి..విన్నవించారు.

▪️ ప్రస్తుతం ఉన్న గుంటూరు– గుంతకల్లు మార్గానికి అనుసంధానించే న్యూపిడుగురాళ్ల– శావల్యాపురం మధ్య కొత్త లైన్‌ పూర్తి దశలో ఉందని,. ఇది సికింద్రాబాద్‌– వినుకొండకు నేరుగా రైల్‌ సౌకర్యం కల్పిస్తోందని, ఇప్పటికే  నల్లపాడు – నంద్యాల సెక్షన్‌ విద్యుదీకరించబడినందున చాలా ఉపయోగకరంగా ఉందని, అలాగే ఈ కనెక్షన్‌లో మిగతా విద్యుదీకరణ పనులు త్వరగా పూర్తి చేసి లైన్‌ను ప్రారంభించాలని కోరారు
#MpLavuSrikrishnadevarayalu

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...