సినీరచయిత సాయిమాధవ్ బుర్రాకు డాక్టరేట్


సినీరచయిత సాయిమాధవ్ బుర్రాకు డాక్టరేట్ 

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
సినీరంగంలో రచయితగా తన ప్రస్థానాన్ని గుర్తించి కాలిఫోర్నియాకు చెందిన న్యూలైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ వారు ఆయనకు డాక్టరేట్ ప్రకటించారు. సాయిమాధవ్ బుర్రా బుధవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఈ గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. అనంతరం ఈ పురస్కారాన్ని తన తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్లుగా సాయిమాధవ్ బుర్రా తెలిపారు. కాగా, ఈ డాక్టరేట్ ప్రదానోత్సవానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై.. సాయిమాధవ్ కు అభినందనలు తెలిపారు. తెనాలి
చెందిన పలువురు కళాకారులు, కళాసంస్థల నిర్వవహకులు హర్షం వ్యక్తం చేశారు.